Movie News

టికెట్ రేట్ల విషయంలో ఈగల్ తెలివైన నిర్ణయం

మాస్ మహారాజా రవితేజ ఈగల్ టికెట్ రేట్ల విషయంలో నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు మంచి నిర్ణయం తీసుకున్నారు. జిఓలో వెసులుబాటు ఉందనే సాకుతో మొదటి వారమే వీలైనంత రాబట్టుకునే ట్రెండ్ కి భిన్నంగా రెగ్యులర్ ప్రైజ్ తో వెళ్లాలని డిసైడ్ చేయడం సానుకూల ఫలితం ఇచ్చేలా కనిపిస్తోంది. తెలంగాణలో మల్టీప్లెక్స్ 200, సింగల్ స్క్రీన్ 150 రూపాయలకు పరిమితం చేయడం ద్వారా ఎక్కువ సామాన్యులు చూసే వెసులుబాటు కలుగుతుంది. గరిష్ట పరిమితి 295 పెట్టే ఛాన్స్ ఉన్నా దాని జోలికి వెళ్ళకపోవడం ఫుట్ ఫాల్స్ ని పెంచుతుంది. ఓపెనింగ్స్ బాగా వస్తాయి.

ఇప్పుడున్న పరిస్థితుల్లో జనాలను మొదటి రోజే థియేటర్లకు వచ్చేలా చేయడం పెద్ద ఛాలెంజ్. రవితేజ రేంజ్ స్టార్ హీరోకు ఇది టెన్షన్ పడాల్సిన విషయం కాకపోయినా రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు ఫలితాల ప్రభావం ఈగల్ మీద ఉంది. అందుకే మంచి కంటెంట్ ని చేరువ చేయాలంటే కొన్ని త్యాగాలు తప్పవు. టికెట్ కు 95 రూపాయలు వదులుకోవడం కొంచెం రిస్క్ గా అనిపించినా పది మంది వచ్చే స్థానంలో పాతిక మందిని టికెట్లు కొనేలా చేయడం ద్వారానే ఎక్కువ లాభాలు వస్తాయి. సంక్రాంతికి టికెట్ హైక్ అడగకుండానే హనుమాన్ బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపించింది.

పరీక్షల సీజన్ దగ్గరగా ఉండటం వల్ల సాధారణంగా ఫిబ్రవరి కొంచెం డ్రైగానే ఉంటుంది. అందుకే ఈగల్ నిర్మాతలు కంటెంట్ మీద ఎంత నమ్మకంతో ఉన్నా టికెట్ ధరల గురించి తెలివైన ఎత్తుగడ వేసుకున్నారు. కార్తీక ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో కమర్షియల్ అంశాల పాటు రైతులకు సంబంధించిన ఓ కీలక సమస్యకు కొత్త తరహా ట్రీట్ మెంట్ ఉంటుందనే టాక్ ఇప్పటికే ఉంది. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లు కాగా నవదీప్, అవసరాల శ్రీనివాస్, అజయ్ ఘోష్ తదితరులు ఇతర క్యాస్టింగ్. పోటీలో యాత్ర 2, లాల్ సలామ్, ట్రూ లవర్ లున్నాయి.

This post was last modified on February 6, 2024 11:14 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

22 minutes ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

3 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

6 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

6 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

9 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

11 hours ago