Movie News

రంగస్థలం ఛాయలు ఉన్నట్టా లేనట్టా

మొన్న శుక్రవారం విడుదలైన అంబాజీపేట మ్యారేజీ బ్యాండుకి టాక్ డీసెంట్ గానే ఉంది. యూనిట్ అఫీషియల్ గా వదిలిన పోస్టర్ ప్రకారం వరల్డ్ వైడ్ గ్రాస్ ఎనిమిదిన్నర కోట్లు దాటేసింది. కానీ క్షేత్ర స్థాయిలో అంత దూకుడు లేదని, హైదరాబాద్ లాంటి ప్రధాన కేంద్రాలు మినహాయించి చాలా చోట్ల నెమ్మదిగా ఉందని ట్రేడ్ అంటోంది. సరే ఒకటి రెండు కోట్ల వ్యత్యాసం ఉందనుకున్నా టాక్ ఇంకా బలంగా వెళ్లాల్సిన అవసరం చాలా ఉంది. అందుకే ఎక్కువ శాతం రీచ్ కావాలనే ఉద్దేశంతో రాబోయే రెండు మూడు రోజులు ప్రతి చోట ఉచితంగా ఒక స్పెషల్ షో వేయాలనే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు.

ఇదిలా ఉండగా అంబాజీపేట మ్యారేజీ బ్యాండులో రంగస్థలం ఛాయలు చాలా ఉన్నాయనేది ముందు నుంచి వినిపిస్తున్న కామెంట్. సుహాస్, శరణ్య ప్రదీప్ పాత్రలు రామ్ చరణ్, ఆది పినిశెట్టిలను గుర్తుకు తెస్తుండగా విలన్ నితిన్ ప్రసన్నని జగపతి బాబు, ప్రకాష్ రాజ్ ల కలబోతగా ఒకే క్యారెక్టర్ గా మార్చారని చాలా మంది అభిప్రాయపడ్డారు. క్లైమాక్స్ సైతం సుకుమార్ రచన చేసిన ఒక చిన్న సినిమాను గుర్తు చేసిందని ఎవరైనా ఒప్పుకునే నిజం. అయితే తమకు కథ విన్నప్పుడు అలా ఎప్పుడూ అనిపించలేదని, నిజాయితీగా ఒక ఎమోషనల్ డ్రామా చెప్పే ప్రయత్నం చేశామని ప్రొడ్యూసర్ మాట .

వీటి సంగతలా ఉంచితే పోలికలు కనిపించిన మాట వాస్తవమే. సుకుమార్ ప్రభావం అంతో ఇంతో కనిపిస్తుంది. కాకపోతే అంబాజీపేట మ్యారేజీ బ్యాండులో కమర్షియల్ ఎలిమెంట్స్, ఐటెం సాంగ్, హీరో హీరోయిన్ డ్యూయెట్ లాంటివి లేకుండా స్ట్రెయిట్ గా పాయింట్ కే కట్టుబడిన విషయం ఒప్పుకోవాలి. కుల వివక్ష మీద వ్యతిరేకంగా బలమైన సందేశం ఇవ్వాలనే తాపత్రయం దర్శకుడిలో కనిపించింది. టీమ్ చెప్పిన ప్రకారం సుహాస్ బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాలు ఇచ్చాడు. అవి ఏ స్థాయిలో, ఎంతెంత ఫిగర్స్ వచ్చాయనేది తేలాలంటే మాత్రం మొదటి వారం పూర్తయితే కానీ అంచనాకు రాలేం.

This post was last modified on February 5, 2024 8:47 pm

Share

Recent Posts

రోలెక్స్… ఏమో తెలియదన్న సూర్య

లోకనాయకుడు కమల్ హాసన్ పనైపోయిందనుకున్న సమయంలో ఆయన అదిరిపోయే కమ్ బ్యాక్‌‌ ఇచ్చిన సినిమా.. విక్రమ్. ఆ సినిమాతోనే సౌత్…

1 hour ago

మాజీ ముఖ్యమంత్రి తనయుడు అరెస్టు… అక్కడ పొలిటికల్ హీట్!

తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…

2 hours ago

ఆ వైరస్ యమ డేంజర్… ఇప్పటికే 22 మంది పిల్లలు మృతి

గుజరాత్‌లో చాందిపుర వైరస్‌ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్‌ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…

2 hours ago

సినిమా చూడాలంటే మ‌నోళ్ల త‌ర్వాతే ఎవ‌రైనా…

సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వ‌రైనా ఒప్పుకోవాల్సిందే. త‌మ సినిమాల‌ను ప్ర‌మోట్ చేయ‌డం కోసం తెలుగు రాష్ట్రాల‌కు…

2 hours ago

సూపర్ స్టార్ కూతురు ఎలా చేసింది

మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…

4 hours ago

పీకే విక్టరీ బీజేపీకి డేంజర్ బెల్స్ మోగించినట్టేనా?

బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…

7 hours ago