‘ఈగ’ సినిమాలో విలన్ పాత్రధారి.. ఈగ దాడిని తప్పించుకునే క్రమంలో, దాన్ని చంపే ప్రయత్నంలో ఎన్నెన్ని ఇబ్బందులు కొని తెచ్చుకుంటాడో తెలిసిందే. ఒకసారి ఈగ కారణంగా అతడి కారు బోల్తా పడి ప్రాణాల మీదికి వస్తుంది. ఇంకోసారి ఈగ ధాటికి రాత్రంతా నిద్రే లేక అవస్థ పడతాడు. మరో సందర్భంలో ఇంటినంతా ధ్వంసం చేసుకుంటాడు.
చివరికి ఇళ్లంతా తగలబెట్టుకునే పరిస్థితి వస్తుంది. చివరికి ఈగ వల్ల ప్రాణాలు కూడా కోల్పోతాడు. ఐతే సినిమా కాబట్టి ఇలాంటి ఎగ్జాజరేషన్లు మామూలే. కానీ నిజ జీవితంలో ఒక ఈగను చంపడం కోసం ఓ వ్యక్తి తన ఇంటిలో కొంత భాగాన్ని ధ్వంసం చేసుకున్నాడు. అలాగే ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి గాయాలు కూడా అయ్యాయి. ఫ్రాన్స్లోని ఓ నగరంలో ఈ ఆశ్చర్యకర ఉదంతం చోటు చేసుకుంది.
దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీని గురించి బీబీసీ వార్తా సంస్థ కూడా రిపోర్ట్ చేసింది. ఫ్రాన్స్కు చెందిన 80 ఏళ్ల వృద్ధుడు ఈగను చంపడానికి ప్రయత్నించి తన ఇంటిలో కొంత భాగాన్ని తగలబెట్టుకున్నాడట. తన చుట్టూ తిరుగుతూ విసిగిస్తున్న ఈగను ఎలాగైనా చంపాలనుకున్న ఆ వ్యక్తి.. దోమలు, పురుగుల్ని చంపే ఎలక్ట్రిక్ బ్యాట్ పట్టుకుని వెంబడించాడట. అయితే అప్పటికే ఇంట్లో గ్యాస్ లీకవుతున్న విషయాన్ని ఆయన గమనించలేదు.
ఎలక్ట్రిక్ బ్యాట్ నుంచి వచ్చిన నిప్పురవ్వలకు గ్యాస్ తోడై ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో కిచెన్తో పాటు ఇంటి పైకప్పు కూడా ధ్వంసం అయింది. అదృష్టం కొద్దీ ఆ ముసలాయనకు ఏమీ కాలేదు. కానీ ఆ ఇంట్లో ఉన్న మరో వ్యక్తి గాయపడ్డట్లు తెలిసింది. ఇంతకీ ఈ విధ్వంసానికి కారణమైన ఈగ ఏమైందో ఏమో మరి. ఈ ఉదంతం తెలుసుకున్న మన జనాలకు మాత్రం ‘ఈగ’ సినిమానే గుర్తుకొస్తోంది.
This post was last modified on September 7, 2020 11:02 pm
మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…
విశాఖపట్నంలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఆశలు గల్లంతవుతున్నాయి. గతంలో ఉన్న పట్టు.. ఇప్పుడు లేకపోవడం.. గతంలో సాయిరెడ్డి వంటి…
టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…
పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…
వ్యూహాల కలిమి.. నాయకుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవసరం. ఈ విషయంలో వైసీపీ చేస్తున్న వ్వవహారం.. పార్టీని దుంపనాశనం…