ఎప్పుడో అమ్మమ్మల తాతయ్యల కాలంలో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఎగబడి చూశారు కానీ ఇప్పటి టెక్నాలజీలో మాములు కలర్స్ లో తీస్తేనే ప్రేక్షకులను మెప్పించడం కష్టంగా మారిపోయింది. ఐమాక్స్, డాల్బీ విజన్, 8కె అంటూ రకరకాల మార్పులతో ఆడియన్స్ సరికొత్త అనుభూతికి లోనవుతున్నారు. ఈ కారణంగానే హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్ లో ఉన్న లార్జ్ స్క్రీన్ కు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇలాంటప్పుడు కేవలం బ్లాక్ అండ్ వైట్ రంగుల్లో ఒక స్టార్ హీరో సినిమా చూడటం అంటే ఆ ఊహే వింతగా అనిపిస్తుంది. కానీ మమ్ముట్టి మాత్రం ఈ రిస్క్ కు సిద్దపడి ఛాలెంజ్ అంటున్నారు.
తెలుగుతో పాటు అన్ని ప్రధాన దక్షిణాది భాషల్లో విడుదల కాబోతున్న భ్రమ యుగం పూర్తిగా నలుపు తెలుపు కలర్స్ లో ఫిబ్రవరి 15కి రెడీ అవుతోంది. ఒరిజినల్ వెర్షన్ మళయాళమే అయినప్పటికీ కంటెంట్ భాషతో సంబంధం లేకుండా అందరిని ఆకట్టుకుంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కరోనా టైంలో రేవతి ప్రధాన పాత్రలో భూతకాలం అనే సింపుల్ హారర్ ఓటిటి మూవీతో శభాష్ అనిపించుకున్న దర్శకుడు రాహుల్ సదాశివన్ ఈ భ్రమయుగం తీశాడు. ప్రత్యేకంగా బీజీఎమ్ సౌండ్ ట్రాక్ ని ఇటీవలే యూట్యూబ్ లో రిలీజ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
ఒకవేళ ఇది సక్సెస్ అయితే మరికొందరు ఇదే బాట పట్టే అవకాశం లేకపోలేదు. 2023లో దర్శకుడు రాజ్ మాదిరాజు ఇదే తరహాలో గ్రే అనే సినిమా కేవలం బ్లాక్ అండ్ వైట్ లో తీశారు. కానీ జనాలు అస్సలు పట్టించుకోలేదు. స్టార్ క్యాస్టింగ్ లేకపోవడం ఒక మైనస్ అయితే థ్రిల్లింగ్ కంటెంట్ లేకపోవడం ఇంకో దెబ్బ. కానీ భ్రమయుగంకి ఆ సమస్య లేదు. మమ్ముట్టి మొదటిసారి నటించిన కంప్లీట్ హారర్ మూవీ ఇది. ఆయన గెటప్ కూడా భయంకరంగా ఉంది. అసలు సినిమాలో చాలా ట్విస్టులు ఉంటాయట. హీరోయిన్, పాటలు, కమర్షియల్ మసాలా ఇవేవి లేని ఈ ప్రయోగం ఎలాంటి ఫలితం ఇస్తుందో.
This post was last modified on February 4, 2024 9:18 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…