డిసెంబర్ లో తన సినిమా విడుదల కాకపోతే ప్రమోషన్లలో పాల్గొనబోనని శపథం చేసిన విశ్వక్ సేన్ ఆ తర్వాత వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుని చల్లబడ్డాడు. బ్యాలన్స్ ఉన్న షూటింగ్ ని వేగంగా చేస్తున్నారు. స్పెషల్ సాంగ్ కోసం ఈషా రెబ్బని తీసుకుని తనకేదో సమస్య రావడంతో ఆ స్థానంలో హిందీ బిగ్ బాస్ ఫేమ్ అయేషా ఖాన్ ని తీసుకున్నారని లేటెస్ట్ అప్డేట్. మార్చుకున్న తేదీ ప్రకారం గ్యాంగ్స్ అఫ్ గోదావరి రిలీజ్ కావాల్సిన డేట్ మార్చి 8. కానీ ఇప్పుడా టార్గెట్ ని చేరుకోవడం కష్టంగానే ఉందని ఇన్ సైడ్ టాక్. దర్శకుడు చైతన్య కృష్ణ డే అండ్ నైట్ దీని పని మీదే ఉన్నారు.
ఇదింకా తేలకపోయినా ఇతర నిర్మాతలు ఆ డేట్ మీద కర్చీఫ్ లు వేస్తున్నారు. ఆనంద్ దేవరకొండ ‘గం గం గణేశా’ దాన్ని లాక్ చేసుకుంది. బేబీ తెచ్చిన క్రేజ్ వల్ల బిజినెస్ బాగా జరుగుతుందనే అంచనాలో నిర్మాతలున్నారు. ఫిబ్రవరి 16 రావాల్సిన వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది. ఒకవేళ మార్చి 1 సాధ్యపడకపోతే ఎనిమిదికి వెళ్లాలని సోనీ సంస్థ ఆలోచన చేస్తోంది. వీటి కన్నా ముందు గోపిచంద్ ‘భీమా’ని అఫీషియల్ గా ఆ తేదీకి ప్రకటించేశారు. మహాశివరాత్రి పర్వదినం కావడంతో క్రమంగా పోటీ పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
ఒకవేళ గ్యాంగ్స్ అఫ్ గోదావరి మళ్ళీ మారాల్సి వస్తే రెండు ఆప్షన్లు ఉంటాయి. మార్చి 15 లేదా 22 చెప్పుకోదగ్గ పోటీ లేదు. మళ్ళీ 29న ఇదే సితార బ్యానర్ టిల్లు స్క్వేర్ షెడ్యూల్ చేసి పెట్టారు. సో ఛాన్స్ ఉండదు. ఏప్రిల్ 5 విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ని దింపేందుకు దిల్ రాజు ప్రణాళిక వేసుకుని ఉన్నారు. సోలో డేట్ అయితే బాగుంటుందని ఎదురు చూసిన గ్యాంగ్స్ అఫ్ గోదావరికి ఇవన్నీ చికాకు పెట్టే పరిణామాలే. ఎప్పటి నుంచో నిర్మాణంలో ఉండి ఇప్పుడు రిలీజ్ రెడీ అయిన విశ్వక్ సేన్ మరో సినిమా గామి ప్రమోషన్లు ఊపందుకోవడం చూస్తే గ్యాంగ్స్ మీద అనుమానం ఇంకా పెరుగుతోంది.
This post was last modified on February 1, 2024 7:26 pm
రెండు నెలల కిందట రిలీజైన దురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవలం…
బుల్లితెరపై ఘన చరిత్ర ఉన్న ఈటీవీ ప్రభాకర్ నట వారసత్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్రహాస్.. తన…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. పంది, ఆవు కొవ్వులను కూడా వినియోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్దగా కేటాయింపులు ఏమీ…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…