ఒక చిన్న సినిమాకు హైప్ తేవడం నిర్మాణం కన్నా పెద్ద సవాల్ గా మారిపోయిన పరిస్థితులివి. అలాంటిది అంబాజీపేట మ్యారేజీ బ్యాండు మీద ఈ మాత్రం బజ్ ఉందంటే పబ్లిసిటీ విషయంలో టీమ్ తీసుకున్న శ్రద్దే కారణం. దానికి తోడు కంటెంట్ మీద నమ్మకంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన కేంద్రాల్లో ఇవాళ రాత్రే ప్రీమియర్లకు సిద్ధ పడటం కాన్ఫిడెన్స్ ని చూపిస్తోంది. బేబీ లాంటి బ్లాక్ బస్టర్స్ కు ఈ స్ట్రాటజీ బాగా వర్కౌట్ అయ్యింది. రాత్రి టాక్ సోషల్ మీడియాలో విపరీతంగా తిరిగేసరికి రిలీజ్ రోజు సాయంత్రం నుంచే టికెట్లు దొరకలేదు. నిర్మాతలు వేరైనప్పటికీ దీనికీ అదే స్పందన ఆశిస్తున్నారు.
అంబాజీపేట మ్యారేజీ బ్యాండుకున్న పెద్ద సానుకూలాంశం బాక్సాఫీస్ గ్యాప్. హనుమాన్ ని అందరూ చూసేశారు. మిగిలిన మూడు సంక్రాంతి సినిమాలు ఓటిటిలకు రెడీ అవుతున్నాయి. ప్రత్యేకంగా థియేటర్లకు వెళ్లేందుకు ప్రేక్షకుల దగ్గర ఆప్షన్ లేదు. రెండు వారాలుగా థియేటర్లకు సరైన ఫీడింగ్ లేదు. గత వారం కెప్టెన్ మిల్లర్ నిరాశపరిస్తే ఫైటర్ కూడా సోసోగానే వెళ్తోంది. సో మూవీ లవర్స్ ఎదురు చూపులు భారీగా ఉన్నాయి. రేపు కౌంట్ పరంగా ఎనిమిదికి పైగా రిలీజులున్నా సుహాస్ మీద ఉన్నంత ఫోకస్ మిగిలినవాటికి రావడం లేదు. అందుకే ఈ ఛాన్స్ వాడుకోవడం కీలకం.
రేపటి అడ్వాన్స్ బుకింగ్స్ ఏమంత లేవు. రాత్రి వచ్చే టాకే వసూళ్లకు కీలకం కానుంది. ఎక్కువ సంఖ్యలో షోలు వేస్తున్నారు కాబట్టి పాజిటివ్ అయినా నెగటివ్ అయినా స్పష్టంగానే వస్తుంది. సుహాస్ లాంటి అప్ కమింగ్ హీరోకు ఇలాంటి విడుదల దక్కడం మంచిదే. విజయ్ దేవరకొండ ప్రత్యక్షంగా షో చూసి మరీ మెచ్చుకున్నాడు. అడవి శేష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చి డాన్సు కూడా చేశాడు. ఇండస్ట్రీలో మంచి మద్దతు కూడగట్టుకున్న అంబాజీపేట మ్యారేజీ బ్యాండుకి అదే సపోర్ట్ ఆడియన్స్ నుంచి వస్తే హిట్టు పడ్డట్టే. ఇవాళ అర్ధరాత్రి దాటడం ఆలస్యం మ్యాటరేంటో తెలిసిపోతుంది.
This post was last modified on February 1, 2024 10:57 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…