ఒక చిన్న సినిమాకు హైప్ తేవడం నిర్మాణం కన్నా పెద్ద సవాల్ గా మారిపోయిన పరిస్థితులివి. అలాంటిది అంబాజీపేట మ్యారేజీ బ్యాండు మీద ఈ మాత్రం బజ్ ఉందంటే పబ్లిసిటీ విషయంలో టీమ్ తీసుకున్న శ్రద్దే కారణం. దానికి తోడు కంటెంట్ మీద నమ్మకంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన కేంద్రాల్లో ఇవాళ రాత్రే ప్రీమియర్లకు సిద్ధ పడటం కాన్ఫిడెన్స్ ని చూపిస్తోంది. బేబీ లాంటి బ్లాక్ బస్టర్స్ కు ఈ స్ట్రాటజీ బాగా వర్కౌట్ అయ్యింది. రాత్రి టాక్ సోషల్ మీడియాలో విపరీతంగా తిరిగేసరికి రిలీజ్ రోజు సాయంత్రం నుంచే టికెట్లు దొరకలేదు. నిర్మాతలు వేరైనప్పటికీ దీనికీ అదే స్పందన ఆశిస్తున్నారు.
అంబాజీపేట మ్యారేజీ బ్యాండుకున్న పెద్ద సానుకూలాంశం బాక్సాఫీస్ గ్యాప్. హనుమాన్ ని అందరూ చూసేశారు. మిగిలిన మూడు సంక్రాంతి సినిమాలు ఓటిటిలకు రెడీ అవుతున్నాయి. ప్రత్యేకంగా థియేటర్లకు వెళ్లేందుకు ప్రేక్షకుల దగ్గర ఆప్షన్ లేదు. రెండు వారాలుగా థియేటర్లకు సరైన ఫీడింగ్ లేదు. గత వారం కెప్టెన్ మిల్లర్ నిరాశపరిస్తే ఫైటర్ కూడా సోసోగానే వెళ్తోంది. సో మూవీ లవర్స్ ఎదురు చూపులు భారీగా ఉన్నాయి. రేపు కౌంట్ పరంగా ఎనిమిదికి పైగా రిలీజులున్నా సుహాస్ మీద ఉన్నంత ఫోకస్ మిగిలినవాటికి రావడం లేదు. అందుకే ఈ ఛాన్స్ వాడుకోవడం కీలకం.
రేపటి అడ్వాన్స్ బుకింగ్స్ ఏమంత లేవు. రాత్రి వచ్చే టాకే వసూళ్లకు కీలకం కానుంది. ఎక్కువ సంఖ్యలో షోలు వేస్తున్నారు కాబట్టి పాజిటివ్ అయినా నెగటివ్ అయినా స్పష్టంగానే వస్తుంది. సుహాస్ లాంటి అప్ కమింగ్ హీరోకు ఇలాంటి విడుదల దక్కడం మంచిదే. విజయ్ దేవరకొండ ప్రత్యక్షంగా షో చూసి మరీ మెచ్చుకున్నాడు. అడవి శేష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చి డాన్సు కూడా చేశాడు. ఇండస్ట్రీలో మంచి మద్దతు కూడగట్టుకున్న అంబాజీపేట మ్యారేజీ బ్యాండుకి అదే సపోర్ట్ ఆడియన్స్ నుంచి వస్తే హిట్టు పడ్డట్టే. ఇవాళ అర్ధరాత్రి దాటడం ఆలస్యం మ్యాటరేంటో తెలిసిపోతుంది.
This post was last modified on February 1, 2024 10:57 pm
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు కౌంట్డౌన్ దగ్గరపడుతోంది. మరొక్క రోజు గడువు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అసెంబ్లీ…
లోక్సభలో ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, ఏపీ ప్రయోజనాల గురించి ప్రశ్నించిన నేతగా టీడీపీ ఎంపీ…
రెబల్ స్టార్, దివంగత కృష్ణం రాజు సతీమణి శ్యామలా దేవి అనూహ్యంగా ఎన్నికల ప్రచారం చివరి రోజు రాజకీయ ప్రచారం…
సంక్రాంతి, దసరా సెలవులు వచ్చాయి అంటే మొదట మీడియాలో వినిపించే పేరు పంతంగి. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి…
"మీ శ్రేయోభిలాషి.." అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల ప్రచారం ముగిసిన మరుక్షణం…
ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యేందుకు మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. కానీ.. ఇంతలోనే ఏపీలో ఏదో జరుగుతోందనే…