ఒక చిన్న సినిమాకు హైప్ తేవడం నిర్మాణం కన్నా పెద్ద సవాల్ గా మారిపోయిన పరిస్థితులివి. అలాంటిది అంబాజీపేట మ్యారేజీ బ్యాండు మీద ఈ మాత్రం బజ్ ఉందంటే పబ్లిసిటీ విషయంలో టీమ్ తీసుకున్న శ్రద్దే కారణం. దానికి తోడు కంటెంట్ మీద నమ్మకంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన కేంద్రాల్లో ఇవాళ రాత్రే ప్రీమియర్లకు సిద్ధ పడటం కాన్ఫిడెన్స్ ని చూపిస్తోంది. బేబీ లాంటి బ్లాక్ బస్టర్స్ కు ఈ స్ట్రాటజీ బాగా వర్కౌట్ అయ్యింది. రాత్రి టాక్ సోషల్ మీడియాలో విపరీతంగా తిరిగేసరికి రిలీజ్ రోజు సాయంత్రం నుంచే టికెట్లు దొరకలేదు. నిర్మాతలు వేరైనప్పటికీ దీనికీ అదే స్పందన ఆశిస్తున్నారు.
అంబాజీపేట మ్యారేజీ బ్యాండుకున్న పెద్ద సానుకూలాంశం బాక్సాఫీస్ గ్యాప్. హనుమాన్ ని అందరూ చూసేశారు. మిగిలిన మూడు సంక్రాంతి సినిమాలు ఓటిటిలకు రెడీ అవుతున్నాయి. ప్రత్యేకంగా థియేటర్లకు వెళ్లేందుకు ప్రేక్షకుల దగ్గర ఆప్షన్ లేదు. రెండు వారాలుగా థియేటర్లకు సరైన ఫీడింగ్ లేదు. గత వారం కెప్టెన్ మిల్లర్ నిరాశపరిస్తే ఫైటర్ కూడా సోసోగానే వెళ్తోంది. సో మూవీ లవర్స్ ఎదురు చూపులు భారీగా ఉన్నాయి. రేపు కౌంట్ పరంగా ఎనిమిదికి పైగా రిలీజులున్నా సుహాస్ మీద ఉన్నంత ఫోకస్ మిగిలినవాటికి రావడం లేదు. అందుకే ఈ ఛాన్స్ వాడుకోవడం కీలకం.
రేపటి అడ్వాన్స్ బుకింగ్స్ ఏమంత లేవు. రాత్రి వచ్చే టాకే వసూళ్లకు కీలకం కానుంది. ఎక్కువ సంఖ్యలో షోలు వేస్తున్నారు కాబట్టి పాజిటివ్ అయినా నెగటివ్ అయినా స్పష్టంగానే వస్తుంది. సుహాస్ లాంటి అప్ కమింగ్ హీరోకు ఇలాంటి విడుదల దక్కడం మంచిదే. విజయ్ దేవరకొండ ప్రత్యక్షంగా షో చూసి మరీ మెచ్చుకున్నాడు. అడవి శేష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చి డాన్సు కూడా చేశాడు. ఇండస్ట్రీలో మంచి మద్దతు కూడగట్టుకున్న అంబాజీపేట మ్యారేజీ బ్యాండుకి అదే సపోర్ట్ ఆడియన్స్ నుంచి వస్తే హిట్టు పడ్డట్టే. ఇవాళ అర్ధరాత్రి దాటడం ఆలస్యం మ్యాటరేంటో తెలిసిపోతుంది.
This post was last modified on February 1, 2024 10:57 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…