ఒకే ఒక జీవితం ముందు వరస ఫ్లాపులతో సతమతమైన శర్వానంద్ కు ఆ సినిమా విజయం ఇచ్చిన ఊరట అంతా ఇంతా కాదు. ఒకటి రెండు కాదు ఏకంగా అయిదారు పరాజయాలు పలకరిస్తే ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుంది. పెళ్ళైనప్పటి నుంచి కొంత స్పీడ్ తగ్గించిన శర్వాకు ఇప్పుడు సరైన కాంబినేషన్లు పడుతున్నాయి. మంచి డైరెక్టర్లతో ప్రాజెక్టులు సెట్ చేసుకుంటున్నాడు. శ్రీరాం ఆదిత్యతో కృతి శెట్టి హీరోయిన్ గా జరుగుతున్న మూవీ ఆల్రెడీ ముగింపు దశలో ఉంది. బాబ్ అనే టైటిల్ లీకయ్యింది కానీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే ఆ లాంఛనం చేయబోతున్నారు.
దీని తర్వాత సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు డైరెక్షన్ లో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సంయుక్త మీనన్, సాక్షి వైద్యలను జోడిగా ఫిక్స్ చేసుకున్నారు. ఇది కూడా ఫుల్ ఎంటర్ టైన్మెంట్ తో సాగే మ్యారీడ్ బ్యాచిలర్ కథగా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభించబోతున్నారు. సమాంతరంగా మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు శర్వానంద్. లూజర్ వెబ్ సిరీస్ తో మెప్పు పొందిన అభిలాష్ కు ఎస్ చెప్పాడు. మాళవిక నాయర్ జోడిగా నటించనుండగా జిబ్రాన్ సంగీతం సమకూర్చబోతున్నాడు. త్వరలోనే స్టార్ట్ కానుంది.
పక్కా ప్లానింగ్ తో దర్శకులను సింక్ చేసుకుంటున్న శర్వానంద్ సక్సెస్ ట్రాక్ ని కొనసాగించే ఉద్దేశంతో కొంత టైం పడుతున్నా కాంబోలు సెట్ చేసుకుంటున్నాడు, బాబ్ రిలీజ్ ఎందుకు లేట్ అవుతుందనే కారణాలు గుట్టుగా ఉన్నాయి కానీ కీలకమైన ఫారిన్ షెడ్యూల్ పూర్తి చేసినట్టు యూనిట్ టాక్. 2023లో శర్వానంద్ నుంచి ఒక్క రిలీజూ లేదు. ఈ సంవత్సరం ఖచ్చితంగా రెండు ఉండేలా దర్శక నిర్మాతలకు ముందే సూచనలు ఇచ్చాడట శర్వా. ఇవి కాకుండా మరో రెండు స్టోరీ డిస్కషన్ స్టేజిలో ఉన్నాయి. అభిలాష్ తో చేయబోయే సినిమా ఇప్పటిదాకా ఎవరూ టచ్ చేయని జానర్ లో ఉంటుందట.
This post was last modified on January 31, 2024 10:05 pm
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…