తెలుగులో రెండు వరస బ్లాక్ బస్టర్లతో మృణాల్ ఠాకూర్ జాతకమే మారిపోయింది. సీతారామం, హాయ్ నాన్న విజయాలు టాలీవుడ్ ఎంట్రిని గ్రాండ్ గా మార్చేశాయి. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ తో హ్యాట్రిక్ అవుతుందనే నమ్మకం తనలో బలంగా ఉంది. ఆఫర్లు వస్తున్నా సరే ఆచితూచి అడుగులు వేస్తోంది. చిరంజీవి విశ్వంభరలో అవకాశం వచ్చిందన్నారు కానీ ఇంకా ఓకే చెప్పింది లేనిది తెలియలేదు. పెండింగ్ లో ఉంది. ఇదిలా ఉండగా కొందరు అభిమానులు తన పాత సినిమాలు తవ్వే పనిలో పడ్డారు. వాటిలో నమ్మశక్యం కాని విధంగా మృణాల్ ని చూసి షాక్ తింటున్నారు.
అందులో ఒకటి లవ్ సోనియా. ఇది 2018లో రిలీజయ్యింది. కానీ షూటింగ్ జరుపుకుంది మాత్రం 2012 నుంచి. రకరకాల కారణాల వల్ల ఆలస్యమవుతూ చివరికి మోక్షం దక్కించుకుంది. ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రశంసలు దక్కినా బాక్సాఫీస్ ఫలితం మాత్రం తేడా కొట్టింది. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ ని చూస్తే ఠక్కున గుర్తుపట్టడం కష్టం. అంత లేతగా ఉంది మరి. కుటుంబ పరిస్థితుల వల్ల దారుణంగా మోసపోయి దగాపడిన ఇద్దరు అక్కాచెల్లెళ్ళ కథ ఇది. అధిక భాగం ముంబై రెడ్ లైట్ ఏరియాలో జరుగుతుంది. దానికి తగ్గట్టే మృణాల్ షాకింగ్ లుక్స్ ఇందులో చాలా ఉంటాయి.
కెరీర్ ప్రారంభంలో టీవీ సీరియల్స్ లోనూ నటించిన మృణాల్ ఠాకూర్ కి బాలీవుడ్ లో ఆశించిన బ్రేక్ ఇప్పటిదాకా దక్కలేదు. దానికి కారణం స్టార్ హీరోల సరసన జోడి కట్టలేకపోవడమే. ఎందుకిలా అని అడిగితే దాని కోసమే ఎదురు చూస్తున్నానని చెప్పిన మృణాల్ ఫ్యామిలీ స్టార్ రిలీజయ్యాక తెలుగు సినిమాలు ఎక్కువ చేస్తానని చెబుతోంది. హాయ్ నాన్న తర్వాత మరింత ఫాలోయింగ్ పెరిగిందని, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం కోసం తొందరపడి వచ్చినవన్నీ ఒప్పుకోవడం లేదని అంటోంది. ప్రైమ్ లో ఉన్న లవ్ సోనియాని ఫ్యాన్స్ చూసే పనిలో పడ్డారు.
This post was last modified on January 31, 2024 6:01 pm
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…