తెలుగులో రెండు వరస బ్లాక్ బస్టర్లతో మృణాల్ ఠాకూర్ జాతకమే మారిపోయింది. సీతారామం, హాయ్ నాన్న విజయాలు టాలీవుడ్ ఎంట్రిని గ్రాండ్ గా మార్చేశాయి. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ తో హ్యాట్రిక్ అవుతుందనే నమ్మకం తనలో బలంగా ఉంది. ఆఫర్లు వస్తున్నా సరే ఆచితూచి అడుగులు వేస్తోంది. చిరంజీవి విశ్వంభరలో అవకాశం వచ్చిందన్నారు కానీ ఇంకా ఓకే చెప్పింది లేనిది తెలియలేదు. పెండింగ్ లో ఉంది. ఇదిలా ఉండగా కొందరు అభిమానులు తన పాత సినిమాలు తవ్వే పనిలో పడ్డారు. వాటిలో నమ్మశక్యం కాని విధంగా మృణాల్ ని చూసి షాక్ తింటున్నారు.
అందులో ఒకటి లవ్ సోనియా. ఇది 2018లో రిలీజయ్యింది. కానీ షూటింగ్ జరుపుకుంది మాత్రం 2012 నుంచి. రకరకాల కారణాల వల్ల ఆలస్యమవుతూ చివరికి మోక్షం దక్కించుకుంది. ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రశంసలు దక్కినా బాక్సాఫీస్ ఫలితం మాత్రం తేడా కొట్టింది. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ ని చూస్తే ఠక్కున గుర్తుపట్టడం కష్టం. అంత లేతగా ఉంది మరి. కుటుంబ పరిస్థితుల వల్ల దారుణంగా మోసపోయి దగాపడిన ఇద్దరు అక్కాచెల్లెళ్ళ కథ ఇది. అధిక భాగం ముంబై రెడ్ లైట్ ఏరియాలో జరుగుతుంది. దానికి తగ్గట్టే మృణాల్ షాకింగ్ లుక్స్ ఇందులో చాలా ఉంటాయి.
కెరీర్ ప్రారంభంలో టీవీ సీరియల్స్ లోనూ నటించిన మృణాల్ ఠాకూర్ కి బాలీవుడ్ లో ఆశించిన బ్రేక్ ఇప్పటిదాకా దక్కలేదు. దానికి కారణం స్టార్ హీరోల సరసన జోడి కట్టలేకపోవడమే. ఎందుకిలా అని అడిగితే దాని కోసమే ఎదురు చూస్తున్నానని చెప్పిన మృణాల్ ఫ్యామిలీ స్టార్ రిలీజయ్యాక తెలుగు సినిమాలు ఎక్కువ చేస్తానని చెబుతోంది. హాయ్ నాన్న తర్వాత మరింత ఫాలోయింగ్ పెరిగిందని, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం కోసం తొందరపడి వచ్చినవన్నీ ఒప్పుకోవడం లేదని అంటోంది. ప్రైమ్ లో ఉన్న లవ్ సోనియాని ఫ్యాన్స్ చూసే పనిలో పడ్డారు.
This post was last modified on January 31, 2024 6:01 pm
జపాన్ లో సోమవారం భారీ భూకంపం సంభవించింది. జపాన్ లోని ఉత్తర ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో కూడిన…
మొన్న ఏడాది వచ్చిన వరుణ్ తేజ్ 'మట్కా'ని సామాన్య ప్రేక్షకులు మర్చిపోయి ఉండొచ్చు కానీ అభిమానులకు మాత్రం పీడకలలా నిలిచిపోయింది.…
నిన్న కీలకమైన వీకెండ్ పూర్తయ్యింది. శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ ఆశలన్నీ సండే మీద పెట్టుకుని ప్రమోషన్లు…
సమ్మర్ సీజన్ లో ఏప్రిల్ చివరి వారం సినిమాలకు చాలా మంచి టైం. వేసవి పీక్స్ లో ఉండటంతో పాటు…
గంధపు చెక్కల స్మగ్లర్గా.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం రేపిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు…
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…