జస్ట్ నిన్నే పుష్ప 2 ది రూల్ ఇంకో రెండు వందల రోజుల్లో రిలీజ్ అవుతుందని టీమ్ అధికారికంగా ఒక పోస్టర్ విడుదల చేసింది. అయినా సరే ఇండస్ట్రీ జనాలకు నమ్మకం కుదరడం లేదు. ఆగస్ట్ 15ని తీసుకునేందుకు పోటీ పడుతున్న వైనం స్పష్టంగా కనిపిస్తోంది. ఏప్రిల్ నుంచి తప్పుకున్న దేవర ఇండిపెండెన్స్ డేకి వస్తుందని ఒకరు, ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ రాని పక్షంలో నాని సరిపోదా శనివారం రావడం పక్కాని మరొకరు ఇలా రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. ఇదే తరహాలో ఓజి డేట్ సెప్టెంబర్ 27 అని బయటికి వచ్చింది. ఈ రెండు సినిమాల నిర్మాణ సంస్థ డివివి ఇంకా ప్రకటనే ఇవ్వలేదు.
అందరూ పుష్ప 2 రాదని ఇంత బలంగా ఫిక్స్ అవ్వడానికి కారణాలు లేకపోలేదు. షూటింగ్ చాలా బాలన్స్ ఉంది. అల్లు అర్జున్ ఫ్రెండ్ గా కీలక పాత్ర చేసిన జగదీశ్ అరెస్ట్ కావడంతో ఇంకా లేట్ అవుతుందని ఓ ప్రచారం జరుగుతోంది. నిజానికతను బెయిల్ మీద బయటికి వచ్చాడనేది యూనిట్ అనధికారికంగా చెబుతున్న మాట. ఫాహద్ ఫాసిల్ చాలా రోజులుగా పుష్ప 2లో జాయిన్ కావడం లేదు. తన భాగం దర్శకుడు సుకుమార్ పూర్తి చేశాడో లేదో తెలియదు. రష్మిక మందన్న పుష్ప 2తో పాటు ఇతర షూటింగుల్లో బిజీగా కనిపిస్తోంది. అనసూయ, సునీల్ తదితరుల జాడలేదు.
ఈ గాసిప్పుల సంగతి ఎలా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్ట్ 15 వదలకూడదనే పంతంతో ఉన్నారు బన్నీ, సుకుమార్. కానీ పరిస్థితులు పూర్తి స్థాయిలో సహకరించడం లేదు. దేవీశ్రీ ప్రసాద్ తన వరకు పాటల కంపోజింగ్ పూర్తి చేశాడు కానీ రీ రికార్డింగ్ కోసం కనీసం ఒక నెల ఇవ్వాలి. కొత్త ఏడాదిలో ఆల్రెడీ 30 రోజులు గడిచిపోయాయి. చేతిలో ఉన్న ఆరు నెలల్లో ఫస్ట్ కాపీని సుకుమార్ సిద్ధం చేయలేడనే ధీమా ఇతర నిర్మాతల్లో కనిపిస్తోంది. వీటికి చెక్ పడాలంటే హీరో దర్శకుడు ఎవరో ఒకరు బలంగా ఒక వీడియో మెసేజ్ లేదా ట్వీట్ పెట్టాల్సిందే. అప్పటిదాకా ఈ ప్రహసనం ఇలాగే ఉంటుంది.
This post was last modified on January 30, 2024 6:32 pm
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉవ్వెత్తున సాగుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు(అసెంబ్లీ+పార్లమెంటు) ప్రశాంతంగా జరిగాయని ఎన్నికలు సంఘం చెబుతోంది. అయితే.. ప్రశాంతత కొన్ని నియోజకవర్గాలకు.. జిల్లాలకు మాత్రమే…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలకు వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన శిల్పా రవికి ప్రచారం…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల అధికార వైఎస్సార్ పార్టీ నేతలు, కార్యకర్తలు దాడులకు పాల్పడ్డ ఉదంతాలు మీడియాలో…
ఎన్నికల అంకం ముగింపుకొస్తున్న తరుణంలో అందరి దృష్టి క్రమంగా సినిమాల వైపు మళ్లుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఎలా…
కీలకమైన నాలుగోదశ ఎన్నికల పోలింగ్ సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవా ల్.. సంచలన ప్రకటన చేశారు.…