జస్ట్ నిన్నే పుష్ప 2 ది రూల్ ఇంకో రెండు వందల రోజుల్లో రిలీజ్ అవుతుందని టీమ్ అధికారికంగా ఒక పోస్టర్ విడుదల చేసింది. అయినా సరే ఇండస్ట్రీ జనాలకు నమ్మకం కుదరడం లేదు. ఆగస్ట్ 15ని తీసుకునేందుకు పోటీ పడుతున్న వైనం స్పష్టంగా కనిపిస్తోంది. ఏప్రిల్ నుంచి తప్పుకున్న దేవర ఇండిపెండెన్స్ డేకి వస్తుందని ఒకరు, ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ రాని పక్షంలో నాని సరిపోదా శనివారం రావడం పక్కాని మరొకరు ఇలా రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. ఇదే తరహాలో ఓజి డేట్ సెప్టెంబర్ 27 అని బయటికి వచ్చింది. ఈ రెండు సినిమాల నిర్మాణ సంస్థ డివివి ఇంకా ప్రకటనే ఇవ్వలేదు.
అందరూ పుష్ప 2 రాదని ఇంత బలంగా ఫిక్స్ అవ్వడానికి కారణాలు లేకపోలేదు. షూటింగ్ చాలా బాలన్స్ ఉంది. అల్లు అర్జున్ ఫ్రెండ్ గా కీలక పాత్ర చేసిన జగదీశ్ అరెస్ట్ కావడంతో ఇంకా లేట్ అవుతుందని ఓ ప్రచారం జరుగుతోంది. నిజానికతను బెయిల్ మీద బయటికి వచ్చాడనేది యూనిట్ అనధికారికంగా చెబుతున్న మాట. ఫాహద్ ఫాసిల్ చాలా రోజులుగా పుష్ప 2లో జాయిన్ కావడం లేదు. తన భాగం దర్శకుడు సుకుమార్ పూర్తి చేశాడో లేదో తెలియదు. రష్మిక మందన్న పుష్ప 2తో పాటు ఇతర షూటింగుల్లో బిజీగా కనిపిస్తోంది. అనసూయ, సునీల్ తదితరుల జాడలేదు.
ఈ గాసిప్పుల సంగతి ఎలా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్ట్ 15 వదలకూడదనే పంతంతో ఉన్నారు బన్నీ, సుకుమార్. కానీ పరిస్థితులు పూర్తి స్థాయిలో సహకరించడం లేదు. దేవీశ్రీ ప్రసాద్ తన వరకు పాటల కంపోజింగ్ పూర్తి చేశాడు కానీ రీ రికార్డింగ్ కోసం కనీసం ఒక నెల ఇవ్వాలి. కొత్త ఏడాదిలో ఆల్రెడీ 30 రోజులు గడిచిపోయాయి. చేతిలో ఉన్న ఆరు నెలల్లో ఫస్ట్ కాపీని సుకుమార్ సిద్ధం చేయలేడనే ధీమా ఇతర నిర్మాతల్లో కనిపిస్తోంది. వీటికి చెక్ పడాలంటే హీరో దర్శకుడు ఎవరో ఒకరు బలంగా ఒక వీడియో మెసేజ్ లేదా ట్వీట్ పెట్టాల్సిందే. అప్పటిదాకా ఈ ప్రహసనం ఇలాగే ఉంటుంది.
This post was last modified on January 30, 2024 6:32 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…