తెలుగు సినిమాలకు సంబంధించి క్రేజీయెస్ట్ సీజన్ అంటే సంక్రాంతే. సంవత్సరం మొత్తంలో ఒక్క వీకెండ్లో ఎక్కువ భారీ చిత్రాలు రిలీజయ్యేది ఆ పండక్కే. సంక్రాంతి సమయంలో యూత్ మాత్రమే కాక ఫ్యామిలీస్ కూడా సినిమాలు చూడడాన్ని ఎంతో ఇష్టపడతాయి. కుటుంబ సమేతంగా పెద్ద ఎత్తున ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. అందుకే ఆ సమయంలో మిగతా రోజుల్లో కంటే ఎక్కువ వసూళ్లు వస్తాయి. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న చిత్రానికి 30 శాతం దాకా అదనపు వసూళ్లు తెచ్చుకుంటుందని అంచనా. అందుకే సంక్రాంతికి వసూళ్ల పరంగా కొత్త రికార్డులు నమోదవుతుంటాయి.
ఐతే దశాబ్దాల సంక్రాంతి సినిమాల చరిత్రలో ఎప్పుడూ స్టార్ హీరోలు నటించిన పెద్ద సినిమాలదే ఆధిపత్యం. వాటి పేరిటే రికార్డులన్నీ ఉంటాయి. కానీ ఈ ఏడాది హనుమాన్ అనే మిడ్ రేంజ్ మూవీ అన్ని రికార్డులనూ బద్దలు కొట్టేసి సంక్రాంతి హైయెస్ట్ గ్రాసర్గా నిలవడం విశేషం.
అప్ కమింగ్ హీరో తేజ సజ్జను పెట్టి దర్శకుడిగా మూడు చిత్రాల అనుభవం ఉన్న ప్రశాంత్ వర్మ పరిమిత బడ్జెట్లో తీసిన ‘హనుమాన్’ అన్ని అంచనాలను మించిపోయి ఏకంగా రూ.250 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. దీంతో మూడేళ్ల కిందట ‘అల వైకుంఠపురములో’ సంక్రాంతి బిగ్గెస్ట్ గ్రాసర్గా నెలకొల్పిన రికార్డు బద్దలైపోయింది. ఫుల్ రన్ అయ్యేసరికి ఏరియాల వారీగా కూడా హనుమాన్ అన్ని రికార్డులనూ తుడిచిపెట్టేయడం ఖాయంగా కనిపిస్తోంది.
భారీ చిత్రాలకు పేరుపడ్డ సంక్రాంతి సీజన్లో హనుమాన్ లాంటి చిత్రం చరిత్రను తిరగరాసే విజయం అందుకుంటుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఫుల్ రన్లో ఈ చిత్రం ఇంకో వంద కోట్లకు తక్కువ కాకుండా గ్రాస్ కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ పండిట్లు అంచనా వేస్తున్నారు. సమీప భవిష్యత్తులో ఈ రికార్డులు బద్దలు కావడం కష్టంగానే కనిపిస్తోంది.
This post was last modified on January 30, 2024 6:27 pm
ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…