పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా తీన్మార్ సినిమా ఫ్లాప్ అయి ఉండొచ్చు కానీ.. అందులో ఆకట్టుకునే అంశాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా పాటల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక ఫ్లాష్ బ్యాక్లో కనిపించే హీరోయిన్ కృతి కర్బందా తెలుగు ప్రేక్షకులకు అలా గుర్తుండిపోయింది. ఐతే ఫ్లాప్ మూవీతో ఎంట్రీ ఇవ్వడంతో ఆమెకు తెలుగులో అంతగా కలిసి రాలేదు.
తర్వాత తెలుగులో ఆమె నటించిన మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త, బ్రూస్లీ లాంటి సినిమాలేవీ కూడా సరిగా ఆడలేదు. మరోవైపు కన్నడలోనూ ఆమెకు బ్రేక్ లభించలేదు. తమిళంలో కూడా ఒకట్రెండు సినిమాలు చేసి మాయమైంది ఈ కన్నడ భామ. చివరగా ఆమె ప్రస్థానం బాలీవుడ్కు మారింది. అక్కడ కొన్ని సినిమాలు చేసింది. ఓ మోస్తరు ఫలితాలందుకుంది.
సౌత్లో ఉన్నంత వరకు ట్రెడిషనల్ క్యారెక్టర్లు చేస్తూ, అలాంటి అప్పీయరెన్స్, ఇమేజ్తోనే కొనసాగిన కృతి.. బాలీవుడ్కు వెళ్లాక చాలా మారింది. అక్కడి సినిమాలకు తగ్గట్లుగా గ్లామర్ టచ్ అద్దుకుంది. సినిమాల్లో హాట్ హాట్ సీన్లూ చేసింది. అంతే కాక ఒక బాయ్ఫ్రెండ్తోనూ రిలేషన్ షిప్ నడిపింది. ఆ వ్యక్తే.. పులకిత్ సామ్రాట్.
టీవీ సీరియల్స్తో ఫేమస్ అయి.. ఆ తర్వాత బాలీవుడ్లో సినిమాలు చేసిన పులకిత్తో ‘వీరే ది వెడ్డింగ్’ సినిమాలో కలిసి నటించింది కృతి. ఆ టైంలోనే ఇద్దరి మధ్య ఎఫైర్ మొదలైనట్లు వార్తలు వచ్చాయి. అప్పటికే పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న పులకిత్తో కృతిది సీరియస్ రిలేషన్షిప్పా కాదా అనే విషయాలు సందేహాలు కొనసాగాయి. ఐతే ఆరేళ్ల పాటు తమ బంధాన్ని సీక్రెట్గా ఉంచిన ఈ జంట.. ఎట్టకేలకు బయటపడింది. ఎంగేజ్మెంట్ చేసుకోవడం ద్వారా తమ బంధాన్ని అధికారికం చేసింది.
This post was last modified on January 30, 2024 6:18 pm
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…