హీరోగా ఎలాంటి ఇమేజ్ తేజ సజ్జ అనే కుర్రాడిని పెట్టి మూడు సినిమాల అనుభవం ఉన్న ప్రశాంత్ వర్మ రూపొందించిన ‘హనుమాన్’ బాక్సాఫీస్ దగ్గర రేపిన సంచలనం, బద్దలు కొడుతున్న రికార్డుల గురించి ఎంత చెప్పినా తక్కువే. మొదట సంక్రాంతికి ఈ సినిమాను ప్రదర్శించని థియేటర్లు.. ఆ తర్వాత ఏరి కోరి దాన్నే ఆడించాయి. మూడో వీకెండ్లో కూడా హౌస్ ఫుల్ వసూళ్లతో రన్ అయింది ఈ చిత్రం. ఒక భారీ ఈవెంట్ ఫిలిం స్థాయిలో విజువల్ ఎక్స్పీరియన్స్ ఇస్తూనే.. టికెట్ ధరలు తక్కువ ఉండటం ‘హనుమాన్’కు బాగా ప్లస్ అయింది.
తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్లలో 150-175 రేటుతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు.. మల్టీప్లెక్సుల్లో రూ.250-295 మధ్య రేటు పెట్టారు. ఈ ధరలతో ఒక విజువల్ వండర్ను చూడటం పట్ల ప్రేక్షకులు ఫుల్ హ్యాపీ. యుఎస్లో సైతం ధరలు అందుబాటులో ఉండటం సినిమాకు బాగా కలిసొచ్చింది. కంటెంట్ ఉన్న సినిమాకు అందుబాటులో టికెట్ల ధరలు ఉంటే ఎలాంటి మ్యాజిక్ జరుగుతుందో చెప్పడానికి ‘హనుమాన్’ చిత్రమే ఉదాహరణ.
ఐతే ‘హనుమాన్’ మేకర్స్, డిస్ట్రిబ్యూటర్లు సినిమా లాంగ్ రన్ పెంచడానికి, ఎక్కువమంది ప్రేక్షకులకు సినిమాను చేరువ చేయడానికి మరో మాస్టర్ ప్లాన్తో రెడీ అయినట్లు సమాచారం. ఈ సినిమాను ఇంకా తక్కువ ధరలతో ప్రేక్షకులకు చూపించబోతున్నారట. నైజాం ఏరియాలో కొన్ని సింగిల్ స్క్రీన్లలో రూ.175 రేట్ ఉంది. దాన్ని రూ.150కి తగ్గిస్తారట. అలాగే అన్ని మల్టీప్లెక్సుల్లో కామన్ రేటు రూ.200కు తగ్గిస్తారట. నాలుగో వారం నుంచి ఈ ధరలు అమల్లోకి వస్తాయని సమాచారం.
ఇంకొన్ని రోజులు గడిచాక సింగిల్ స్క్రీన్ల ధరలను అవకాశమున్న చోట రూ.112కు తగ్గించే ఆలోచన కూడా చేస్తున్నారట. దీని వల్ల ఒక్కో టికెట్ మీద వచ్చే ఆదాయం తగ్గినా.. ఆక్యుపెన్సీలు ఎక్కువ ఉండడం వల్ల లాభం పెరుగుతుంది. ‘బ్రహ్మాస్త్ర’ లాంటి చిత్రాలకు ఇలాంటి ఆఫర్లు బాగా కలిసొచ్చాయి. మొత్తానికి హనుమాన్కు అత్యధిక సంఖ్యలో ప్రేక్షకులకు చూపించి లాభాలు మరింత పెంచుకోవడానికి టీం మాస్టర్ ప్లానే వేసినట్లు కనిపిస్తోంది.
This post was last modified on January 30, 2024 3:48 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…