హీరోగా ఎలాంటి ఇమేజ్ తేజ సజ్జ అనే కుర్రాడిని పెట్టి మూడు సినిమాల అనుభవం ఉన్న ప్రశాంత్ వర్మ రూపొందించిన ‘హనుమాన్’ బాక్సాఫీస్ దగ్గర రేపిన సంచలనం, బద్దలు కొడుతున్న రికార్డుల గురించి ఎంత చెప్పినా తక్కువే. మొదట సంక్రాంతికి ఈ సినిమాను ప్రదర్శించని థియేటర్లు.. ఆ తర్వాత ఏరి కోరి దాన్నే ఆడించాయి. మూడో వీకెండ్లో కూడా హౌస్ ఫుల్ వసూళ్లతో రన్ అయింది ఈ చిత్రం. ఒక భారీ ఈవెంట్ ఫిలిం స్థాయిలో విజువల్ ఎక్స్పీరియన్స్ ఇస్తూనే.. టికెట్ ధరలు తక్కువ ఉండటం ‘హనుమాన్’కు బాగా ప్లస్ అయింది.
తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్లలో 150-175 రేటుతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు.. మల్టీప్లెక్సుల్లో రూ.250-295 మధ్య రేటు పెట్టారు. ఈ ధరలతో ఒక విజువల్ వండర్ను చూడటం పట్ల ప్రేక్షకులు ఫుల్ హ్యాపీ. యుఎస్లో సైతం ధరలు అందుబాటులో ఉండటం సినిమాకు బాగా కలిసొచ్చింది. కంటెంట్ ఉన్న సినిమాకు అందుబాటులో టికెట్ల ధరలు ఉంటే ఎలాంటి మ్యాజిక్ జరుగుతుందో చెప్పడానికి ‘హనుమాన్’ చిత్రమే ఉదాహరణ.
ఐతే ‘హనుమాన్’ మేకర్స్, డిస్ట్రిబ్యూటర్లు సినిమా లాంగ్ రన్ పెంచడానికి, ఎక్కువమంది ప్రేక్షకులకు సినిమాను చేరువ చేయడానికి మరో మాస్టర్ ప్లాన్తో రెడీ అయినట్లు సమాచారం. ఈ సినిమాను ఇంకా తక్కువ ధరలతో ప్రేక్షకులకు చూపించబోతున్నారట. నైజాం ఏరియాలో కొన్ని సింగిల్ స్క్రీన్లలో రూ.175 రేట్ ఉంది. దాన్ని రూ.150కి తగ్గిస్తారట. అలాగే అన్ని మల్టీప్లెక్సుల్లో కామన్ రేటు రూ.200కు తగ్గిస్తారట. నాలుగో వారం నుంచి ఈ ధరలు అమల్లోకి వస్తాయని సమాచారం.
ఇంకొన్ని రోజులు గడిచాక సింగిల్ స్క్రీన్ల ధరలను అవకాశమున్న చోట రూ.112కు తగ్గించే ఆలోచన కూడా చేస్తున్నారట. దీని వల్ల ఒక్కో టికెట్ మీద వచ్చే ఆదాయం తగ్గినా.. ఆక్యుపెన్సీలు ఎక్కువ ఉండడం వల్ల లాభం పెరుగుతుంది. ‘బ్రహ్మాస్త్ర’ లాంటి చిత్రాలకు ఇలాంటి ఆఫర్లు బాగా కలిసొచ్చాయి. మొత్తానికి హనుమాన్కు అత్యధిక సంఖ్యలో ప్రేక్షకులకు చూపించి లాభాలు మరింత పెంచుకోవడానికి టీం మాస్టర్ ప్లానే వేసినట్లు కనిపిస్తోంది.
This post was last modified on January 30, 2024 3:48 pm
ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం తాడిపత్రిలో ఎన్నికల అనంతరం తీవ్ర హింస చెలరేగింది. ఇక్కడ పోటీలో ఉన్న జేసీ…