నిన్నటితో హరిహర వీరమల్లు ప్రారంభోత్సవం జరిగి నాలుగు సంవత్సరాలు పూర్తయిపోయాయి. ఇవాళ అయిదో ఏడు ప్రారంభం. అయినా ఇప్పటిదాకా విడుదల తేదీ ఎప్పుడో ఖరారుగా చెప్పలేని పరిస్థితి తలుచుకుని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్ లో అత్యధిక భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమాగా షూటింగ్ మొదలైన కొత్తలో ఎంత హైప్ వచ్చిందో వర్ణించడం కష్టం. పవన్ పుట్టినరోజుకి రిలీజ్ చేసిన టీజర్ ఒక్కసారిగా అంచనాలను అమాంతం పెంచేసింది. కట్ చేస్తే మధ్యలో వాయిదాలు, కరోనాలు, ఇతర కొత్త సినిమాల ప్రమేయాలు ఇలా కాలం కర్పూరమయ్యింది.
2024లో విడుదల చేసే ఛాన్స్ లేదు. ఎన్నికలు ఏప్రిల్ లో జరుగుతాయి. ఆ వెంటనే మొదటి ప్రాధాన్యంగా ఓజికి డేట్స్ ఇవ్వాలని పవన్ నిర్ణయించుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దాని తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ లైన్ లో ఉంది. ఈ రెండు అయ్యేలోగా 2025 వచ్చేస్తుంది. వీరమల్లు దర్శకుడు క్రిష్ వచ్చే నెల కొత్త ప్రాజెక్టు అనౌన్స్ చేయబోతున్నట్టు టాక్ ఉంది. అంటే మళ్ళీ పవన్ ఎప్పుడు పిలుస్తాడో తెలియదు కాబట్టి ఆలోగా ఇంకా సమయం వృథా కాకూడదనే ఉద్దేశంతో ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ కథను రెడీ చేసుకున్నాడట. ఇన్ని పరిణామాలు జరుగుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఈ లెక్కన ఎంత లేట్ గా మొదలుపెట్టినా హరిహరవీరమల్లు 2026లో వచ్చేలా ఉంది. అంటే ఆరేళ్ళ కాలం అవుతుందన్న మాట. ఇంత సుదీర్ఘంగా సెట్స్ మీద ఉన్న పవన్ కళ్యాణ్ సినిమా ఇదొక్కటే అవుతుంది. చిరంజీవికి ఇలాంటి జ్ఞాపకం అంజి రూపంలో ఉంది. నిర్మాత ఏఏం రత్నం మాత్రం ఎన్నికలు కాగానే ముందుకెళ్తుందనే నమ్మకాన్ని తరచు వ్యక్తం చేస్తున్నారు కానీ వాతావరణం దానికి అనుకూలంగా లేదు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ పీరియాడిక్ డ్రామాలో బాబీ డియోల్ ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు
This post was last modified on January 30, 2024 12:45 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…