నిన్నటితో హరిహర వీరమల్లు ప్రారంభోత్సవం జరిగి నాలుగు సంవత్సరాలు పూర్తయిపోయాయి. ఇవాళ అయిదో ఏడు ప్రారంభం. అయినా ఇప్పటిదాకా విడుదల తేదీ ఎప్పుడో ఖరారుగా చెప్పలేని పరిస్థితి తలుచుకుని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్ లో అత్యధిక భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమాగా షూటింగ్ మొదలైన కొత్తలో ఎంత హైప్ వచ్చిందో వర్ణించడం కష్టం. పవన్ పుట్టినరోజుకి రిలీజ్ చేసిన టీజర్ ఒక్కసారిగా అంచనాలను అమాంతం పెంచేసింది. కట్ చేస్తే మధ్యలో వాయిదాలు, కరోనాలు, ఇతర కొత్త సినిమాల ప్రమేయాలు ఇలా కాలం కర్పూరమయ్యింది.
2024లో విడుదల చేసే ఛాన్స్ లేదు. ఎన్నికలు ఏప్రిల్ లో జరుగుతాయి. ఆ వెంటనే మొదటి ప్రాధాన్యంగా ఓజికి డేట్స్ ఇవ్వాలని పవన్ నిర్ణయించుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దాని తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ లైన్ లో ఉంది. ఈ రెండు అయ్యేలోగా 2025 వచ్చేస్తుంది. వీరమల్లు దర్శకుడు క్రిష్ వచ్చే నెల కొత్త ప్రాజెక్టు అనౌన్స్ చేయబోతున్నట్టు టాక్ ఉంది. అంటే మళ్ళీ పవన్ ఎప్పుడు పిలుస్తాడో తెలియదు కాబట్టి ఆలోగా ఇంకా సమయం వృథా కాకూడదనే ఉద్దేశంతో ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ కథను రెడీ చేసుకున్నాడట. ఇన్ని పరిణామాలు జరుగుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఈ లెక్కన ఎంత లేట్ గా మొదలుపెట్టినా హరిహరవీరమల్లు 2026లో వచ్చేలా ఉంది. అంటే ఆరేళ్ళ కాలం అవుతుందన్న మాట. ఇంత సుదీర్ఘంగా సెట్స్ మీద ఉన్న పవన్ కళ్యాణ్ సినిమా ఇదొక్కటే అవుతుంది. చిరంజీవికి ఇలాంటి జ్ఞాపకం అంజి రూపంలో ఉంది. నిర్మాత ఏఏం రత్నం మాత్రం ఎన్నికలు కాగానే ముందుకెళ్తుందనే నమ్మకాన్ని తరచు వ్యక్తం చేస్తున్నారు కానీ వాతావరణం దానికి అనుకూలంగా లేదు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ పీరియాడిక్ డ్రామాలో బాబీ డియోల్ ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు
This post was last modified on January 30, 2024 12:45 pm
అఖండ 2 తాండవం వచ్చి తొమ్మిది నెలలు అయిపోయాయి. సీక్వెల్ అందులోనూ బ్లాక్ బస్టర్ కొనసాగింపు కాబట్టి బాలయ్య మరోసారి…
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక అనుబంధాన్ని…
ఒకప్పుడు సత్యం, గోదావరి, గౌరీ లాంటి హిట్లతో మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో సుమంత్ తర్వాత వరస ఫ్లాపుల దెబ్బకు…
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య చిరాకులు, పరాకులకు అవకాశం ఉంటుందని.. తమకు అది మేలు చేస్తుందని భావిస్తున్న వైసీపీకి…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…