సంక్రాంతి సందడి అయ్యాక బాక్సాఫీస్ కు పదిహేను రోజుల గ్యాప్ వచ్చేసింది. రిపబ్లిక్ డేకి రిలీజైన వాటిలో కెప్టెన్ మిల్లర్ నిరాశ పరచగా, ఆయలాన్ చివరి నిమిషంలో షోలు రద్దయి ఉన్న ఆసక్తిని తగ్గించింది. ఏవో లీగల్ ఇష్యూస్ అన్నారు కానీ మళ్ళీ ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు. ఈ శుక్రవారం ఫిబ్రవరి 2 ఒకటి రెండు కాదు ఏకంగా ఎనిమిది చిన్న సినిమాలు నువ్వా నేనా అంటూ యుద్ధానికి సిద్ధ పడుతున్నాయి. బజ్ ఉన్న వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది సుహాస్ హీరోగా చేసిన ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ గురించి. ట్రైలర్ వచ్చాక దీని మీద ఆడియన్స్ లో మెల్లగా ఆసక్తి పెరిగింది.
క్రమం తప్పకుండ ప్రమోషన్లతో పాటు ముందు రోజు రాత్రే ప్రీమియర్లు వేయడానికి సిద్ధపడి కంటెంట్ మీద నమ్మకాన్ని స్పష్టం చేస్తున్నారు. బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ ‘బూట్ కట్ బాలరాజు’ కామెడీని నమ్ముకుని వస్తోంది. ప్రమోషన్లకు పైసల్ లేవని, మంచి సినిమాని ఆదరించమని హీరో పబ్లిక్ గా చెప్పడం గమనార్హం. హాస్యాన్నే నమ్ముకున్న మరో మూవీ ‘కిస్మత్’లో సపోర్టింగ్ ఆర్టిస్టులే హీరోగా నటించారు. తమను తక్కువంచనా వేయొద్దని ‘గేమ్ ఆన్’ టీమ్ చెబుతోంది. ఇవి కాకుండా హ్యాపీ ఎండింగ్, ధీర, మెకానిక్, ఉర్విలు అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలో దిగుతున్నాయి.
కౌంట్ అయితే పెద్దగానే ఉంది కానీ ప్రేక్షకులను ఫైనల్ గా మెప్పించాల్సింది క్వాలిటీనే. కాకపోతే మరీ ఇంత తీవ్రమైన పోటీలో ఎంత చిన్న సినిమాలైనా సరే ఈ స్థాయిలో పోటీ పడటం వల్ల కలిగే ప్రయోజనం అంతు చిక్కడం లేదు. ఆపై వారం రవితేజ ఈగల్, యాత్ర 2, రజినీకాంత్ లాల్ సలామ్ లు వస్తాయి. హనుమాన్ ఎలాగూ కొనసాగుతోంది. సో పైన చెప్పిన ఎనిమిది సినిమాలకు టాక్ కీలక పాత్ర పోషించనుంది. వీటిలో జనాలకు నిజంగా ఏవి రీచ్ అవుతాయో, ఏవి మొక్కుబడి రిలీజ్ గా మిగిలిపోతాయో చూడాలి. థియేటర్ల సమస్య లేదు. డిమాండ్ కు తగ్గట్టు వాటికి సరిపడా దొరుకుతున్నాయి.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…