అమెరికాలో తెలుగు సినిమాలకు ఉన్న డిమాండే వేరు. ఒకప్పుడు అక్కడ హిందీ సినిమాలు మాత్రమే రిలీజయ్యేవి. కానీ తర్వాతి కాలంలో తెలుగు సినిమాల హవా మొదలైంది. తెలుగు వాళ్లు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సినిమాల పట్ల చూపించే అభిమానమే వేరు. యుఎస్లో తెలుగు ఎన్నారైల సంఖ్య పెరిగిపోవడంతో అందుకు తగ్గట్లే మన సినిమాల హంగామా కూడా పెరిగింది. టికెట్ల ధరలు ఎంత పెట్టినా.. షోలు ఎంత దూరంలో ఉన్నా మన వాళ్లు రాజీ పడరు. ఈ డిమాండ్ చూసే ప్రిమియర్ షోలను భారీ స్థాయిలో ప్లాన్ చేయడం, భారీ రేట్లు పెట్టడం చేశారు అక్కడి డిస్ట్రిబ్యూటర్లు.
ప్రిమియర్స్ తర్వాత నార్మల్ షోలకు కూడా హిందీ చిత్రాలతో పోలిస్తే తెలుగు సినిమాల రేట్లే ఎక్కువ ఉంటాయి. మన సినిమాలు అక్కడ చాలా వేగంగా మిలియన్ల కొద్దీ వసూళ్లు రాబట్టడానికి ఇదే కారణం. ఐతే రేట్లు మరీ పెంచేయడం వల్ల ప్రతికూల ప్రభావం కూడా పడుతున్న మాట వాస్తవం. దాని వల్ల ఆక్యుపెన్సీలు, లాంగ్ రన్ తగ్గి వసూళ్లు అనుకున్నంత స్థాయిలో ఉండట్లేదు.
ఇలాంటి తరుణంలో హనుమాన్ సినిమా యుఎస్లో అద్భుతం చేసింది. రిలీజ్కు ముందు ఈ సినిమాకు మరీ డిమాండ్ ఏమీ లేకపోవడం, సంక్రాంతికి గుంటూరు కారం లాంటి భారీ చిత్రం ఉండడంతో ‘హనుమాన్’కు 12 డాలర్ల నార్మల్ రేటు పెట్టారు. కాగా హనుమాన్కు మంచి టాక్ రావడం, గుంటూరు కారం అంచనాలకు తగ్గట్లు లేకపోవడంతో యుఎస్ ఆడియన్స్ వెంటనే అటు మళ్లారు. దీంతో యుఎస్లో ఎవ్వరూ ఊహించని స్థాయిలో హనుమాన్ వసూళ్లు పెరిగిపోయాయి. మిలియన్, 2 మిలియన్, 3 మిలియన్.. ఇలా ఒక్కో మైలురాయిని దాటుకుంటూ ఆ చిత్రం ఇప్పుడు ఏకంగా 5 మిలియన్ డాలర్లు కొల్లగొట్టింది.
బాహుబలి-1, బాహుబలి-2, ఆర్ఆర్ఆర్, సలార్ లాంటి భారీ చిత్రాల తర్వాత ఈ ఘనత అందుకున్న చిత్రం ‘హనుమాన్’యే. మిగతా చిత్రాల్లో వేటికీ టికెట్ ధర 25 డాలర్లకు తక్కువ లేదు. కానీ హనుమాన్ 12 డాలర్ల నార్మల్ రేటుతో ఈ ఘనత అందుకుని సంచలనం సృష్టించింది. కంటెంట్ బలంగా ఉండి, రేట్లు తక్కువ ఉండడం హనుమాన్కు పెద్ద ప్లస్ అయింది. ఇది పెద్ద సినిమాలు తీసేవాళ్లందరూ చూసి నేర్చుకోవాల్సిన పాఠం.
This post was last modified on January 29, 2024 6:47 pm
కర్నూలు జైల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కర్నూలులో పర్యటించిన సంగతి…
ఓ ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చిన దొంగ ఆ ఇంట్లో వస్తువులు దొంగిలించడం…ఆకలేయడంతో ఆ ఇంట్లోనే తినేసి నిద్రలోకి జారుకోవడం…తీరా…
పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్పై హత్యాయత్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం…
రాజ్యసభలో విపక్షనేత, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హల్ద్వానిలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన ర్యాలీ ప్రదేశాన్ని శ్రీరామ్…
ఒకప్పుడు షకీలాకు సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. వరుస సినిమాలు, భారీ గుర్తింపు, తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్తో…
ఏఐ రంగప్రవేశం తర్వాత తమ ఫొటోలు, వీడియోలను ఇష్టానుసారం వాడేస్తున్న నేపథ్యంలో పర్సనాలిటీ రైట్స్ కోసం ఫిలిం సెలబ్రెటీలను న్యాయస్థానాలను…