ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో మైత్రీ మూవీ మేకర్స్ ఒకటి. సినిమాల ఫ్రీక్వెన్స్, రేంజ్ పరంగా దాన్ని నంబర్ వన్ సంస్థ అని కూడా చెప్పొచ్చు. పుష్ప-2 సహా అరడజను దాకా క్రేజీ ప్రాజెక్టులు ఆ సంస్థ చేతిలో ఉన్నాయి. ఈ సంస్థ ప్రస్థానంలో శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, పుష్ప, వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్లు ఉన్నాయి.
ఐతే పెట్టుబడి-రాబడి కోణంలో చూస్తే.. ఆ సంస్థకు బిగ్గెస్ట్ హిట్ లేటెస్ట్ మూవీ ‘హనుమాన్’యే కావడం విశేషం. ఐతే ఇది మైత్రీ ప్రొడ్యూస్ చేసిన చిత్రం కాదు.. డిస్ట్రిబ్యూట్ చేసింది. నైజాం ఏరియాకు ఏడున్నర కోట్లు పెట్టి సినిమా రైట్స్ తీసుకుంది మైత్రీ సంస్థ. సంక్రాంతి పోటీ వల్ల మొదట్లో ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో థియేటర్లు దొరకలేదు. కానీ చివరికి గెలిచేది కంటెంటే అని చాటుతూ.. సంక్రాంతి విజేతగా నిలిచింది హనుమాన్.
మొదట్లో ఉన్న థియేటర్లలోనే హౌస్ ఫుల్స్ పడ్డాయి. తర్వాత ఎగ్జిబిటర్లు ఎగబడి మరీ హనుమాన్ చిత్రాన్ని ప్రదర్శించారు. 5 కోట్లు.. 10 కోట్లు.. 15 కోట్లు.. ఇలా ఒక్కో మార్కును అధిగమిస్తూ.. ఇప్పుడు ఏకంగా రూ.30 కోట్ల షేర్ మార్కును టచ్ చేసింది హనుమాన్ నైజాంలో. గ్రాస్ కలెక్షన్లు 50 కోట్లకు చేరువగా ఉన్నాయి. హనుమాన్ స్థాయి మిడ్ రేంజ్ మూవీ నైజాం ఏరియాలో 30 కోట్ల షేర్ సాధించడం అంటే ఆషామాషీ కాదు. పెద్ద స్టార్లు నటించిన భారీ చిత్రాలే ఈ స్థాయిలో వసూళ్లు రాబడుతుంటాయి.
ఇక మైత్రీ అధినేతల సంబరం అయితే అంతా ఇంతా కాదు. పెట్టుబడి మీద నాలుగు రెట్ల లాభం అంటే.. ఒక డిస్ట్రిబ్యూటర్కు ఇంకేం కావాలి? నైజాంలోనే కాదు.. రిలీజైన ప్రతి చోటా పెట్టుబడి మీద కొన్ని రెట్ల లాభం అందించింది హనుమాన్. మూడో వీకెండ్ అయ్యాక కూడా సినిమా జోరు తగ్గలేదు. ఇంకో రెండు వీకెండ్లు సినిమా సత్తా చాటేలా కనిపిస్తోంది.
This post was last modified on January 29, 2024 4:10 pm
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…
ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని…