Movie News

మైత్రీకి ఇన్నేళ్లలో చూడని లాభాలు

ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో మైత్రీ మూవీ మేకర్స్ ఒకటి. సినిమాల ఫ్రీక్వెన్స్, రేంజ్ పరంగా దాన్ని నంబర్ వన్ సంస్థ అని కూడా చెప్పొచ్చు. పుష్ప-2 సహా అరడజను దాకా క్రేజీ ప్రాజెక్టులు ఆ సంస్థ చేతిలో ఉన్నాయి. ఈ సంస్థ ప్రస్థానంలో శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, పుష్ప, వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్లు ఉన్నాయి.

ఐతే పెట్టుబడి-రాబడి కోణంలో చూస్తే.. ఆ సంస్థకు బిగ్గెస్ట్ హిట్ లేటెస్ట్ మూవీ ‘హనుమాన్’యే కావడం విశేషం. ఐతే ఇది మైత్రీ ప్రొడ్యూస్ చేసిన చిత్రం కాదు.. డిస్ట్రిబ్యూట్ చేసింది. నైజాం ఏరియాకు ఏడున్నర కోట్లు పెట్టి సినిమా రైట్స్ తీసుకుంది మైత్రీ సంస్థ. సంక్రాంతి పోటీ వల్ల మొదట్లో ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో థియేటర్లు దొరకలేదు. కానీ చివరికి గెలిచేది కంటెంటే అని చాటుతూ.. సంక్రాంతి విజేతగా నిలిచింది హనుమాన్.

మొదట్లో ఉన్న థియేటర్లలోనే హౌస్ ఫుల్స్ పడ్డాయి. తర్వాత ఎగ్జిబిటర్లు ఎగబడి మరీ హనుమాన్ చిత్రాన్ని ప్రదర్శించారు. 5 కోట్లు.. 10 కోట్లు.. 15 కోట్లు.. ఇలా ఒక్కో మార్కును అధిగమిస్తూ.. ఇప్పుడు ఏకంగా రూ.30 కోట్ల షేర్ మార్కును టచ్ చేసింది హనుమాన్ నైజాంలో. గ్రాస్ కలెక్షన్లు 50 కోట్లకు చేరువగా ఉన్నాయి. హనుమాన్ స్థాయి మిడ్ రేంజ్ మూవీ నైజాం ఏరియాలో 30 కోట్ల షేర్ సాధించడం అంటే ఆషామాషీ కాదు. పెద్ద స్టార్లు నటించిన భారీ చిత్రాలే ఈ స్థాయిలో వసూళ్లు రాబడుతుంటాయి.

ఇక మైత్రీ అధినేతల సంబరం అయితే అంతా ఇంతా కాదు. పెట్టుబడి మీద నాలుగు రెట్ల లాభం అంటే.. ఒక డిస్ట్రిబ్యూటర్‌కు ఇంకేం కావాలి? నైజాంలోనే కాదు.. రిలీజైన ప్రతి చోటా పెట్టుబడి మీద కొన్ని రెట్ల లాభం అందించింది హనుమాన్. మూడో వీకెండ్ అయ్యాక కూడా సినిమా జోరు తగ్గలేదు. ఇంకో రెండు వీకెండ్లు సినిమా సత్తా చాటేలా కనిపిస్తోంది.

Satya

Recent Posts

సింగ్ గీతం… జస్ట్ ఒక్క రోజు ఆలస్యం

ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…

5 hours ago

మంచి పని చేసిన దృశ్యం 3

మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…

5 hours ago

డిప్యూటీ సీఎం నోట ఫార్మ్ హౌస్ మాట

మీలాగా మేం ఫామ్ హౌస్‌లో ప‌డుకోవ‌ట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…

5 hours ago

అమ‌ర్నాథా… ఇప్పుడు కూడా రాజ‌కీయ‌మేంట‌య్యా!

స్వ‌తంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్న‌ట్టుగా వైసీపీ నాయ‌కుల‌కు ఎక్క‌డ ఎలా వ్య‌వ‌హరించాలో తెలియ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.…

6 hours ago

మీనాక్షికి షాకిచ్చిన ఈసీ… ఏం జరిగింది?

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…

7 hours ago

ప‌వ‌న్‌-లోకేష్‌… బాధ్య‌త పంచుకున్నారు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌లు.. కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క రోల్ పోషిస్తున్న విష‌యం తెలిసిందే.…

8 hours ago