ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా అనిపించే వార్తే. కానీ ఇది నిజమే అన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం. అల్లు అర్జున్, సుకుమార్ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కనున్న థ్రిల్లర్ మూవీ పుష్పలో నారా రోహిత్ ఓ ముఖ్య పాత్ర పోషించే అవకాశాలున్నాయట. ఈ విషయం ఇంకా ఖరారవ్వలేదు కానీ.. పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న కొన్ని ముఖ్య పాత్రలు ఉన్నాయి.
అందులో ఒకదాని కోసం రోహిత్ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. రోహిత్ కోసం సిఫారసు చేసింది అల్లు అర్జున్ అట. మరి అతడికి రోహిత్ పట్ల అంత ఆసక్తి ఏంటో తెలియదు. మరి నిజంగానే పుష్పలో రోహిత్కు అవకావం దక్కుతుందేమో చూడాలి.
కెరీర్ ఆరంభంలో వైవిధ్యమైన సినిమాలతో రోహిత్ మంచి ఊపులోనే కనిపించాడు. ఒక దశలో అతను హీరోగా అరడజనుకు పైగా సినిమాలు లైన్లో ఉన్నాయి. కానీ కథల ఎంపికలో పొరబాట్లు, వరుస పరాజయాలు రోహిత్ను వెనక్కి లాగేశాయి. ఇప్పుడు అతను ఇండస్ట్రీలో ఉన్న విషయమే జనాలకు గుర్తు లేదు. రోహిత్ కొత్త సినిమాలు పట్టాలెక్కడంలో ఆలస్యం జరుగుతోంది.
ఇలాంటి తరుణంలో పుష్ప సినిమాకు అతణ్ని కన్సిడర్ చేస్తున్నారన్న వార్త ఆశ్చర్యం కలిగిస్తోంది. పుష్ప కాస్టింగ్ విషయంలో సుకుమార్ కన్ఫ్యూజన్ ఒక పట్టాన తెమలట్లేదు. ప్రధాన విలన్ పాత్రకు విజయ్ సేతుపతిని అనుకున్నాక అతను డేట్ల సమస్యతో తప్పుకున్నాడు. ఆ తర్వాత ఆ పాత్రకు బాబీ సింహా, అరవింద్ స్వామిల పేర్లు వినిపించాయి. కానీ ఇప్పటికీ ఎవరూ ఖరారు కాలేదని అంటున్నారు.
This post was last modified on September 7, 2020 1:15 pm
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు.. సత్తా చాటుకున్నారు. సాధారణ అభివృద్ధి పనులతో పాటు.. ఎవరూ ఊహించని…
నిన్న విడుదలైన బైకర్ కు పబ్లిక్ టాక్, రివ్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. సినిమా చూస్తే నిరాశపడరనే అభిప్రాయం అధిక…
నిన్న విడుదలైన రాకాస, బైకర్ రెండు సినిమాలకు నెగటివ్ రెస్పాన్స్ రాలేదు. అత్యద్భుతంగా ఉన్నాయని కాదు కానీ ఒకసారి చూడొచ్చనే…
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఉన్న రాయపాటి శైలజ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? అంటే…
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్కు రఘురామకు…
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…