దేవర ఇంకా విడుదల కాకుండానే జాన్వీ కపూర్ కు క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా సూర్య సరసన భారీ ఇతిహాసంలో ఛాన్స్ దక్కించుకున్నట్టు లేటెస్ట్ అప్ డేట్. మహాభారతం ఆధారంగా దర్శకుడు రాకేష్ ఓంప్రకాష్ తీయబోయే ప్యాన్ ఇండియా మూవీలో కర్ణుడికి జోడిగా ఆమెను ఎంచుకున్నట్టు తెలిసింది. నిజానికి సీరియళ్లు, సినిమాల్లో కవచకుండల ధారికి భార్యలు ఉన్నట్టు చూపించరు. కానీ చరిత్రలో వృషాలి, సుప్రియ పేరుతో ఆయన జీవితాన్ని పంచుకున్నారని పేర్కొన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ తీసిన దానవీరశూరకర్ణలో సైతం వీళ్ళ ప్రస్తావన కనిపించదు.
ఇప్పుడు ఓంప్రకాష్ తీయబోయే ఎపిక్ లో మాత్రం చూపిస్తారట. ఒకరు జాన్వీ కపూరని వినికిడి. ఎస్ చెప్పడం అయిపోయిందని, రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది వేసవిలో ప్రారంభించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిసింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నట్టు సమాచారం. ఇదే కథతో గతంలో విక్రమ్ తో వేరే దర్శకుడి కాంబోలో మొదలుపెట్టారు. కానీ కొంత భాగం షూట్ జరిగాక అర్ధాంతరంగా ఆగిపోయింది. తిరిగి మొదలుపెట్టాలని ట్రై చేశారు కానీ చియాన్ దాని మీద ఆసక్తి తగ్గిపోయి వదిలేశారు. ఫైనల్ గా ఇప్పుడు బాలీవుడ్ డైరెక్టర్ తో సూర్యకు కుదురుతోంది.
హిందీలో ఎన్ని సినిమాలు చేస్తున్న స్టార్ డం అందని ద్రాక్షగా మారిన జాన్వీ కపూర్ సౌత్ లో మెల్లగా సెటిలయ్యేందుకు ప్లాన్ చేసుకుంటోంది. ఇక్కడ ఎలాగూ హీరోయిన్ల కొరత తీవ్రంగా ఉంది. శ్రీలీల లాంటి ఒకరిద్దరు తప్ప స్టార్ హీరోలకు పెద్దగా ఆప్షన్లు లేకుండా పోయాయి. ఆ అమ్మయి కూడా వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతోంది. ఇలాంటి టైంలో జాన్వీ కనక ఓ బ్లాక్ బస్టర్ అందుకుంటే ఖచ్చితంగా అవకాశాలు క్యూ కడతాయి. దేవర షూటింగ్ ఆలస్యమవుతున్న నేపథ్యంలో తన మొదటి రిలీజ్ కోసం వేచి చూడక తప్పేలా లేదు. జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో మంచి డేట్ కోసం చూస్తున్నారు.
This post was last modified on January 27, 2024 11:28 pm
త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అత్యుత్తమమైన, విభిన్నమైన చిత్రాల్లో అరవింద సమేత ఒకటి. అందులో కీలక పాత్రలు పోషించిన ఆర్టిస్టులందరికీ మంచి…
సీనియర్ దర్శకుడు గుణశేఖర్ కెరీర్లో చూడాలని ఉంది, ఒక్కడు లాంటి బ్లాక్బస్టర్లతో పాటు సైనికుడు, వరుడు, నిప్పు లాంటి దారుణమైన…
స్మార్ట్ఫోన్ ప్రపంచంలో రియల్మీ సరికొత్త రికార్డు సృష్టించింది. గురువారం భారత మార్కెట్లో పీ4 పవర్ 5G ఫోన్ను విడుదల చేసింది.…
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. జనవరి 29 నాటి గణాంకాల ప్రకారం, కేవలం…
అమ్మాయిది అగ్రకులం... అబ్బాయిది వెనుకుబడిన కులం...ఇద్దరూ ప్రేమించుకున్నారు...కానీ, ఈ కులాంతర వివాహానికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు...ఆ తర్వాత ఆ ప్రేమ…
ఈ మధ్యకాలంలో పొలిటికల్ సౌండ్ తగ్గించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్, వైఎస్ షర్మిల మళ్ళీ రంగంలోకి దిగారు. మహాత్మా గాంధీ…