హనుమాన్ విజయంలో మాస్ మహారాజా పాత్రను ఎవరూ విస్మరించలేరు. ప్రత్యక్షంగా కనిపించకపోయినా కోటి అనే కోతి పాత్రకు డబ్బింగ్ ఇచ్చి గమ్మత్తమైన మాడ్యులేషన్ తో గొంతు చాలా ప్లస్ అయ్యింది. గతంలో మర్యాద రామన్నలో సైకిల్ కి ఇదే తరహాలో మాటలు ఇచ్చిన రవితేజ దాని సక్సెస్ లోనూ పాలు పంచుకున్నాడు. ఇవాళ జరిగిన సక్సెస్ మీట్ లో దర్శకుడు ప్రశాంత్ వర్మ భవిష్యత్తులో తాను సృష్టించబోయే సూపర్ హీరో సినిమాటిక్ యునివర్స్ లో వీలైతే ఒక భాగాన్ని ఆయనతోనే తీస్తానని చెప్పడం ఆసక్తి రేపుతోంది. అంటే కోటి పాత్రనే మనిషిగా మార్చే ప్రయత్నమన్నమాట.
దీనికి టైం ఎక్కువే పట్టొచ్చు. ఎందుకంటే ప్రశాంత్ వర్మ ప్రస్తుతం జై హనుమాన్ పనుల్లో ఉన్నాడు. రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుపెట్టాలి. డివివి దానయ్య కొడుకు కళ్యాణ్ ని హీరోగా పరిచయం చేస్తూ ప్లాన్ చేసుకున్న అధీరా బాధ్యతను వేరొకరికి ఇచ్చే ఆలోచన జరుగుతున్నట్టు ఇన్ సైడ్ టాక్. ఇవి కాకుండా హనుమాన్ షూటింగ్ అయిపోయాక ఒక చిన్న రామ్ కామ్ తీశారనే ప్రచారం జరుగుతోంది కానీ ఇప్పటిదాకా దానికి సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు. సో రవితేజతో అనుకున్న కాన్సెప్ట్ తెరకెక్కడానికి ఎంత లేదన్నా రెండేళ్ల సమయం పట్టొచ్చు.
తేజ సజ్జను ముందు హీరోగా తర్వాత స్టార్ గా మార్చడం పట్ల ప్రశాంత్ వర్మ సంతోషం వ్యక్తం చేశాడు. ఒక స్నేహితుడిని ఇలా చూసుకోవడం కన్నా గొప్ప ఫీల్ ఏముంటుందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రెండు వందల యాభై కోట్ల గ్రాస్ దాటేసిన హనుమాన్ ఇంకో రెండు వారాలకు పైగానే సాలిడ్ రన్ సాధించే అవకాశాలున్న నేపధ్యంలో నిర్మాతలు ప్రమోషన్లను ఆపడం లేదు. క్రమం తప్పకుండా ఇంటర్వ్యూలు, ఈవెంట్లు చేస్తూనే ఉన్నారు. అన్నట్టు ఇంకో రీమాస్టర్ వెర్షన్ ని సిద్ధం చేస్తున్నామని ప్రశాంత్ వర్మ చెప్పడం కొసమెరుపు. ఏమైనా అదనపు సీన్లు జోడిస్తారేమో వేచి చూడాలి.
This post was last modified on January 27, 2024 6:03 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…