కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ నటించిన మలైకోట్టై వాలిబన్ మొన్న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. తెలుగు వెర్షన్ కూడా సమాంతరంగా ప్లాన్ చేసుకున్నారు కానీ థియేటర్ల సమస్యతో పాటు సరైన సమయానికి నిర్మాత ప్లానింగ్ లేకపోవడంతో ప్రస్తుతానికి డబ్బింగును రిలీజ్ చేయలేదు. లేట్ అయినా తర్వాత చూసుకుందామని పెండింగ్ పెట్టారు. ఇప్పుడదే శాపమయ్యేలా ఉంది. ఎందుకంటే రిలీజ్ ముందు బాహుబలి రేంజ్ లో దీనికిచ్చిన బిల్డప్ అంతా ఇంతా కాదు. మల్లువుడ్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తీసినట్టు అక్కడి మీడియా వర్గాలు తెగ ఉటంకించాయి.
తీరా చూస్తే ఈ మలైకోట్టై వాలిబన్ డిజాస్టర్ దిశగా వెళ్తోంది. రివ్యూలలో విమర్శకులు గట్టిగా తలంటారు. అద్భుతమైన ఆర్ట్ వర్క్, కోట్ల రూపాయల ఖర్చు, కళ్ళు చెదిరే సాంకేతిక నిపుణుల పనితనం ఇవన్నీ నాసిరకం రైటింగ్ తో పాటు తీసికట్టు దర్శకత్వంతో వృథా అయ్యాయని విరుచుకుపడ్డారు. మొదటి రోజు పదిహేను కోట్ల దాకా రాబట్టినా తర్వాత నేషనల్ హాలిడేకి దాన్ని నిలబెట్టుకోలేక విపరీతంగా డ్రాప్ అయ్యింది. ఇంతకు మందు మనదగ్గర మరక్కార్ అరేబియా సముద్ర సింహం సైతం ఇదే ఫలితాన్ని అందుకుంది కానీ కనీసం అది కేరళలో బాగానే ఆడిన లిస్టులోకి చేరింది.
దీనికంతా బాద్యుడిగా దర్శకుడు లిజో జోస్ పెల్లిషెర్రీని పేర్కొంటున్నారు విశ్లేషకులు. బాహుబలి లాగా తీయాలనే ఆలోచన రాగానే సరిపోదని కథా కథనాలు, ఎమోషన్లు ఆ స్థాయిలో ఉన్నాయో లేదో స్క్రిప్ట్ దశలోనే చెక్ చేసుకోవాలని తలంటుతున్నారు. మోహన్ లాల్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఇంత వయసులోనూ దేహ దారుఢ్యాన్ని పెంచుకుని రిస్క్ అనిపించే ఎన్నో యాక్షన్ స్టంట్స్ చేశారు. సీక్వెల్ కూడా చేయాలని నిర్మాతలు ప్లాన్ చేసుకున్నారు కానీ ఇప్పుడీ రిజల్ట్ చూసి ముందుకెళ్లడం అనుమానమే. ఉత్తి హంగులతో సినిమా ఆడే రోజులా ఇవి. స్టార్ హీరోలకైనా పరాభవం తప్పదు.
This post was last modified on January 27, 2024 11:49 am
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…
కేరళ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..…