కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ నటించిన మలైకోట్టై వాలిబన్ మొన్న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. తెలుగు వెర్షన్ కూడా సమాంతరంగా ప్లాన్ చేసుకున్నారు కానీ థియేటర్ల సమస్యతో పాటు సరైన సమయానికి నిర్మాత ప్లానింగ్ లేకపోవడంతో ప్రస్తుతానికి డబ్బింగును రిలీజ్ చేయలేదు. లేట్ అయినా తర్వాత చూసుకుందామని పెండింగ్ పెట్టారు. ఇప్పుడదే శాపమయ్యేలా ఉంది. ఎందుకంటే రిలీజ్ ముందు బాహుబలి రేంజ్ లో దీనికిచ్చిన బిల్డప్ అంతా ఇంతా కాదు. మల్లువుడ్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తీసినట్టు అక్కడి మీడియా వర్గాలు తెగ ఉటంకించాయి.
తీరా చూస్తే ఈ మలైకోట్టై వాలిబన్ డిజాస్టర్ దిశగా వెళ్తోంది. రివ్యూలలో విమర్శకులు గట్టిగా తలంటారు. అద్భుతమైన ఆర్ట్ వర్క్, కోట్ల రూపాయల ఖర్చు, కళ్ళు చెదిరే సాంకేతిక నిపుణుల పనితనం ఇవన్నీ నాసిరకం రైటింగ్ తో పాటు తీసికట్టు దర్శకత్వంతో వృథా అయ్యాయని విరుచుకుపడ్డారు. మొదటి రోజు పదిహేను కోట్ల దాకా రాబట్టినా తర్వాత నేషనల్ హాలిడేకి దాన్ని నిలబెట్టుకోలేక విపరీతంగా డ్రాప్ అయ్యింది. ఇంతకు మందు మనదగ్గర మరక్కార్ అరేబియా సముద్ర సింహం సైతం ఇదే ఫలితాన్ని అందుకుంది కానీ కనీసం అది కేరళలో బాగానే ఆడిన లిస్టులోకి చేరింది.
దీనికంతా బాద్యుడిగా దర్శకుడు లిజో జోస్ పెల్లిషెర్రీని పేర్కొంటున్నారు విశ్లేషకులు. బాహుబలి లాగా తీయాలనే ఆలోచన రాగానే సరిపోదని కథా కథనాలు, ఎమోషన్లు ఆ స్థాయిలో ఉన్నాయో లేదో స్క్రిప్ట్ దశలోనే చెక్ చేసుకోవాలని తలంటుతున్నారు. మోహన్ లాల్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఇంత వయసులోనూ దేహ దారుఢ్యాన్ని పెంచుకుని రిస్క్ అనిపించే ఎన్నో యాక్షన్ స్టంట్స్ చేశారు. సీక్వెల్ కూడా చేయాలని నిర్మాతలు ప్లాన్ చేసుకున్నారు కానీ ఇప్పుడీ రిజల్ట్ చూసి ముందుకెళ్లడం అనుమానమే. ఉత్తి హంగులతో సినిమా ఆడే రోజులా ఇవి. స్టార్ హీరోలకైనా పరాభవం తప్పదు.
This post was last modified on January 27, 2024 11:49 am
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…