Movie News

బాహుబలి స్థాయిలో బిల్డప్ ఇచ్చారు కానీ

కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ నటించిన మలైకోట్టై వాలిబన్ మొన్న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. తెలుగు వెర్షన్ కూడా సమాంతరంగా ప్లాన్ చేసుకున్నారు కానీ థియేటర్ల సమస్యతో పాటు సరైన సమయానికి నిర్మాత ప్లానింగ్ లేకపోవడంతో ప్రస్తుతానికి డబ్బింగును రిలీజ్ చేయలేదు. లేట్ అయినా తర్వాత చూసుకుందామని పెండింగ్ పెట్టారు. ఇప్పుడదే శాపమయ్యేలా ఉంది. ఎందుకంటే రిలీజ్ ముందు బాహుబలి రేంజ్ లో దీనికిచ్చిన బిల్డప్ అంతా ఇంతా కాదు. మల్లువుడ్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తీసినట్టు అక్కడి మీడియా వర్గాలు తెగ ఉటంకించాయి.

తీరా చూస్తే ఈ మలైకోట్టై వాలిబన్ డిజాస్టర్ దిశగా వెళ్తోంది. రివ్యూలలో విమర్శకులు గట్టిగా తలంటారు. అద్భుతమైన ఆర్ట్ వర్క్, కోట్ల రూపాయల ఖర్చు, కళ్ళు చెదిరే సాంకేతిక నిపుణుల పనితనం ఇవన్నీ నాసిరకం రైటింగ్ తో పాటు తీసికట్టు దర్శకత్వంతో వృథా అయ్యాయని విరుచుకుపడ్డారు. మొదటి రోజు పదిహేను కోట్ల దాకా రాబట్టినా తర్వాత నేషనల్ హాలిడేకి దాన్ని నిలబెట్టుకోలేక విపరీతంగా డ్రాప్ అయ్యింది. ఇంతకు మందు మనదగ్గర మరక్కార్ అరేబియా సముద్ర సింహం సైతం ఇదే ఫలితాన్ని అందుకుంది కానీ కనీసం అది కేరళలో బాగానే ఆడిన లిస్టులోకి చేరింది.

దీనికంతా బాద్యుడిగా దర్శకుడు లిజో జోస్ పెల్లిషెర్రీని పేర్కొంటున్నారు విశ్లేషకులు. బాహుబలి లాగా తీయాలనే ఆలోచన రాగానే సరిపోదని కథా కథనాలు, ఎమోషన్లు ఆ స్థాయిలో ఉన్నాయో లేదో స్క్రిప్ట్ దశలోనే చెక్ చేసుకోవాలని తలంటుతున్నారు. మోహన్ లాల్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఇంత వయసులోనూ దేహ దారుఢ్యాన్ని పెంచుకుని రిస్క్ అనిపించే ఎన్నో యాక్షన్ స్టంట్స్ చేశారు. సీక్వెల్ కూడా చేయాలని నిర్మాతలు ప్లాన్ చేసుకున్నారు కానీ ఇప్పుడీ రిజల్ట్ చూసి ముందుకెళ్లడం అనుమానమే. ఉత్తి హంగులతో సినిమా ఆడే రోజులా ఇవి. స్టార్ హీరోలకైనా పరాభవం తప్పదు.

This post was last modified on January 27, 2024 11:49 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నెట్ ఫ్లిక్స్ ఒకవైపు… డాల్బీ సినిమా ఇంకోవైపు

టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…

2 hours ago

కాలర్ లాంటి కంటెంట్ ఉంటే చాలు

మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…

3 hours ago

‘అటవీశాఖ అధికారులను కిడ్నాప్ చెయ్యాలి’

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…

4 hours ago

కష్టాల నాయకుడికి ‘ప్రైమ్’ షాకు ?

రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…

4 hours ago

పవన్ ఫ్యాన్స్ బాధ అర్థం చేసుకున్నారు

అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…

5 hours ago

అక్షయ్ కామెడీ… ఇప్పుడు పండుతుందా?

​బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…

5 hours ago