విదేశాల్లో మొదలై.. ఆ తర్వాత హిందీలో అడుగు పెట్టి.. మూడేళ్ల కిందట తెలుగునాట అరంగేట్రం చేసిన ‘బిగ్ బాస్’ షో విషయంలో విమర్శలు, అభ్యంతరాలకు లోటు లేదు. ఐతే ఎవరేమన్నా దీనికి టీవీక్షకుల్లో మంచి ఆదరణ ఉన్న మాట వాస్తవం.
‘బిగ్ బాస్’ను తిట్టిన వాళ్లు కూడా ఆ తర్వాత దాని వీక్షకులుగా మారిన వాళ్లే. ఎవరో ఎందుకు ఈ షో కాన్సెప్టే తనకు నచ్చదంటూ విమర్శలు చేసిన అక్కినేని నాగార్జున.. గత ఏడాది హోస్ట్గా మారాడు. వరుసగా రెండో ఏడాది కూడా ఆయనే షోను నడిపించబోతున్నాడు.
ఐతే గత మూడు సీజన్లతో పోలిస్తే ఈసారి ‘బిగ్ బాస్’కు అంత హైప్ కనిపించట్లేదు. ఇందుకు కారణాలు అనేకం. గత ఏడాది నాగ్ హోస్ట్ స్కిల్స్ విషయంలో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. మళ్లీ ఈ ఏడాది కూడా ఆయనే కొనసాగడంతో కొంత ఆసక్తిని తగ్గించింది. కొత్త హోస్ట్ వస్తాడా.. మళ్లీ ఎన్టీఆర్ను ఏమైనా చూస్తామా అని చూసిన అభిమానులకు నిరాశ తప్పలేదు.
మరోవైపు ‘బిగ్ బాస్’ షోలో పాల్గొన్న వాళ్లలో చాలామంది అందులోకి రావాల్సింది కాదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో ఇండస్ట్రీ జనాల్లో ఆ షోలో పాల్గొనడంపై అంత మంచి అభిప్రాయం లేక ప్రేక్షకులు కోరుకున్న స్థాయిలో పార్టిసిపెంట్లు రావట్లేదు. ఇప్పటిదాకా ప్రచారంలో ఉన్న పేర్లలో ఎగ్జైట్ చేస్తున్నవి తక్కువే. మరోవైపు కరోనా తాలూకు భయాలు, ఆందోళనలు, బాధల్లో మునిగిపోయి ఉన్న జనాలు ఈ షో పట్ల ఇప్పటికైతే అంత ఆసక్తిని ప్రదర్శించట్లేదు.
సోషల్ మీడియాలో షో గురించి చర్చే లేదు. ఐతే ఒకసారి షో మొదలయ్యాక కథంతా మారిపోవడం ఖాయం. రెండో సీజన్లో కౌశల్ వ్యవహారం లాగా షో మలుపు తిరిగితే అందరూ అటు వైపు చూస్తారు. ఇక్కడ నాగ్ కూడా షోను నడిపించడంలో నైపుణ్యం చూపించాల్సి ఉంది. కరోనా కారణంగా థియేటర్లలో సినిమాలు లేవు. టీవీల్లో ఆసక్తికర ప్రోగ్రాంలూ లేవు. ఇలాంటి సమయంలో వస్తున్న ‘బిగ్ బాస్’ కొంచెం ఆసక్తికరంగా సాగినా టీఆర్పీ రేటింగ్స్ బద్దలు కావడం ఖాయం.
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…