విదేశాల్లో మొదలై.. ఆ తర్వాత హిందీలో అడుగు పెట్టి.. మూడేళ్ల కిందట తెలుగునాట అరంగేట్రం చేసిన ‘బిగ్ బాస్’ షో విషయంలో విమర్శలు, అభ్యంతరాలకు లోటు లేదు. ఐతే ఎవరేమన్నా దీనికి టీవీక్షకుల్లో మంచి ఆదరణ ఉన్న మాట వాస్తవం.
‘బిగ్ బాస్’ను తిట్టిన వాళ్లు కూడా ఆ తర్వాత దాని వీక్షకులుగా మారిన వాళ్లే. ఎవరో ఎందుకు ఈ షో కాన్సెప్టే తనకు నచ్చదంటూ విమర్శలు చేసిన అక్కినేని నాగార్జున.. గత ఏడాది హోస్ట్గా మారాడు. వరుసగా రెండో ఏడాది కూడా ఆయనే షోను నడిపించబోతున్నాడు.
ఐతే గత మూడు సీజన్లతో పోలిస్తే ఈసారి ‘బిగ్ బాస్’కు అంత హైప్ కనిపించట్లేదు. ఇందుకు కారణాలు అనేకం. గత ఏడాది నాగ్ హోస్ట్ స్కిల్స్ విషయంలో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. మళ్లీ ఈ ఏడాది కూడా ఆయనే కొనసాగడంతో కొంత ఆసక్తిని తగ్గించింది. కొత్త హోస్ట్ వస్తాడా.. మళ్లీ ఎన్టీఆర్ను ఏమైనా చూస్తామా అని చూసిన అభిమానులకు నిరాశ తప్పలేదు.
మరోవైపు ‘బిగ్ బాస్’ షోలో పాల్గొన్న వాళ్లలో చాలామంది అందులోకి రావాల్సింది కాదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో ఇండస్ట్రీ జనాల్లో ఆ షోలో పాల్గొనడంపై అంత మంచి అభిప్రాయం లేక ప్రేక్షకులు కోరుకున్న స్థాయిలో పార్టిసిపెంట్లు రావట్లేదు. ఇప్పటిదాకా ప్రచారంలో ఉన్న పేర్లలో ఎగ్జైట్ చేస్తున్నవి తక్కువే. మరోవైపు కరోనా తాలూకు భయాలు, ఆందోళనలు, బాధల్లో మునిగిపోయి ఉన్న జనాలు ఈ షో పట్ల ఇప్పటికైతే అంత ఆసక్తిని ప్రదర్శించట్లేదు.
సోషల్ మీడియాలో షో గురించి చర్చే లేదు. ఐతే ఒకసారి షో మొదలయ్యాక కథంతా మారిపోవడం ఖాయం. రెండో సీజన్లో కౌశల్ వ్యవహారం లాగా షో మలుపు తిరిగితే అందరూ అటు వైపు చూస్తారు. ఇక్కడ నాగ్ కూడా షోను నడిపించడంలో నైపుణ్యం చూపించాల్సి ఉంది. కరోనా కారణంగా థియేటర్లలో సినిమాలు లేవు. టీవీల్లో ఆసక్తికర ప్రోగ్రాంలూ లేవు. ఇలాంటి సమయంలో వస్తున్న ‘బిగ్ బాస్’ కొంచెం ఆసక్తికరంగా సాగినా టీఆర్పీ రేటింగ్స్ బద్దలు కావడం ఖాయం.
This post was last modified on September 6, 2020 1:33 pm
ఈ వార్త నిజంగానే షాకింగనే చెప్పాలి. రేపు అంటే బుధవారం నుంచి తెలంగాణవ్యాప్తంగా చికెన్ ముక్క దొరకదట. మరి ముక్క లేనిదే…
హఠాత్తుగా నిన్నటి నుంచి దురంధర్ ది రివెంజ్ బాగా డౌన్ అయిపోయింది. ట్రేడ్ వర్గాల ప్రకారం చాలా ఏరియాల్లో అరవై…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీలో టొవినో థామస్ ఒక ముఖ్యమైన పాత్ర…
https://www.youtube.com/watch?v=stdHpPR8djw అభిమానులు స్వీటీ అని పిలుచుకునే అనుష్క మలయాళం డెబ్యూ కథనర్ తో జరగబోతోంది. ఇవాళ ట్రైలర్ లాంచ్ చేశారు.…
వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటేనే ఒక ప్రత్యేకమైన బ్రాండ్. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన సినిమాలు (రచయితగా మల్లీశ్వరి,…
సాధారణంగా తన పార్టీ ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులు ఆయా పార్టీలు ప్రాధాన్యం ఇస్తాయి. వారి పనితీరు మెచ్చుకుంటాయి. మరింత మెరుగు పరుచుకోవాలని…