విదేశాల్లో మొదలై.. ఆ తర్వాత హిందీలో అడుగు పెట్టి.. మూడేళ్ల కిందట తెలుగునాట అరంగేట్రం చేసిన ‘బిగ్ బాస్’ షో విషయంలో విమర్శలు, అభ్యంతరాలకు లోటు లేదు. ఐతే ఎవరేమన్నా దీనికి టీవీక్షకుల్లో మంచి ఆదరణ ఉన్న మాట వాస్తవం.
‘బిగ్ బాస్’ను తిట్టిన వాళ్లు కూడా ఆ తర్వాత దాని వీక్షకులుగా మారిన వాళ్లే. ఎవరో ఎందుకు ఈ షో కాన్సెప్టే తనకు నచ్చదంటూ విమర్శలు చేసిన అక్కినేని నాగార్జున.. గత ఏడాది హోస్ట్గా మారాడు. వరుసగా రెండో ఏడాది కూడా ఆయనే షోను నడిపించబోతున్నాడు.
ఐతే గత మూడు సీజన్లతో పోలిస్తే ఈసారి ‘బిగ్ బాస్’కు అంత హైప్ కనిపించట్లేదు. ఇందుకు కారణాలు అనేకం. గత ఏడాది నాగ్ హోస్ట్ స్కిల్స్ విషయంలో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. మళ్లీ ఈ ఏడాది కూడా ఆయనే కొనసాగడంతో కొంత ఆసక్తిని తగ్గించింది. కొత్త హోస్ట్ వస్తాడా.. మళ్లీ ఎన్టీఆర్ను ఏమైనా చూస్తామా అని చూసిన అభిమానులకు నిరాశ తప్పలేదు.
మరోవైపు ‘బిగ్ బాస్’ షోలో పాల్గొన్న వాళ్లలో చాలామంది అందులోకి రావాల్సింది కాదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో ఇండస్ట్రీ జనాల్లో ఆ షోలో పాల్గొనడంపై అంత మంచి అభిప్రాయం లేక ప్రేక్షకులు కోరుకున్న స్థాయిలో పార్టిసిపెంట్లు రావట్లేదు. ఇప్పటిదాకా ప్రచారంలో ఉన్న పేర్లలో ఎగ్జైట్ చేస్తున్నవి తక్కువే. మరోవైపు కరోనా తాలూకు భయాలు, ఆందోళనలు, బాధల్లో మునిగిపోయి ఉన్న జనాలు ఈ షో పట్ల ఇప్పటికైతే అంత ఆసక్తిని ప్రదర్శించట్లేదు.
సోషల్ మీడియాలో షో గురించి చర్చే లేదు. ఐతే ఒకసారి షో మొదలయ్యాక కథంతా మారిపోవడం ఖాయం. రెండో సీజన్లో కౌశల్ వ్యవహారం లాగా షో మలుపు తిరిగితే అందరూ అటు వైపు చూస్తారు. ఇక్కడ నాగ్ కూడా షోను నడిపించడంలో నైపుణ్యం చూపించాల్సి ఉంది. కరోనా కారణంగా థియేటర్లలో సినిమాలు లేవు. టీవీల్లో ఆసక్తికర ప్రోగ్రాంలూ లేవు. ఇలాంటి సమయంలో వస్తున్న ‘బిగ్ బాస్’ కొంచెం ఆసక్తికరంగా సాగినా టీఆర్పీ రేటింగ్స్ బద్దలు కావడం ఖాయం.
This post was last modified on September 6, 2020 1:33 pm
టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…
ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ మీద అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆశ్చర్యకరంగా హిందీ వెర్షన్ అమ్మకాలు…
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…
``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్కటే. పార్టీ క్రమశిక్షణ విషయంలో అందరూ సమానమే. ఎవరు ఏం చేశారన్నది పార్టీ…
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…