ఛలో రూపంలో డెబ్యూతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు వెంకీ కుడుముల భీష్మతోనూ అదే ఫలితాన్ని రిపీట్ చేశాడు. రెండో సినిమా బ్రేక్ లో భాగమైన హీరో నితిన్ తో మరోసారి చేతులు కలిపి ఈసారి దొంగతనాల కాన్సెప్ట్ ని తీసుకున్నారు. ఇవాళ రాబిన్ హుడ్ టైటిల్ ని అధికారికంగా ప్రకటించి చిన్న వీడియో ద్వారా కథేంటో చెప్పే ప్రయత్నం చేశారు. దాని ప్రకారం నితిన్ ఇందులో ఆధునిక దొంగగా కనిపించబోతున్నాడు. భారతీయులందరూ నా సోదరులు సోదరీమణులనే ప్రతిజ్ఞని పాటిస్తూ వాళ్ళ పర్సులు, ఇళ్లలో నుంచి డబ్బులు, నగలు దోచుకోవడమే పనిగా పెట్టుకుంటాడు.
ఇండియా మొత్తం నాదే కాబట్టి దేశంలో నివసించే వాళ్లంతా కుటుంబమేనంటూ తన చోరీలను సమర్ధించుకునే ప్రయత్నం వెరైటీగా ఉంది. హీరోయిన్ గా ముందు రష్మిక మందన్నను అనుకున్నారు కానీ తర్వాత ఏవో కారణాల వల్ల తను తప్పుకుంది. ఆ తర్వాత శ్రీలీల పేరు వినిపించినా ఇప్పుడీ టీజర్ డీటెయిల్స్ లో నితిన్ ప్రస్తావన తప్ప ఇంకెవరి వివరాలు లేవు. సో ఇంకా ఫైనల్ అయ్యింది లేనిది తెలియలేదు. ఎంటర్ టైన్మెంట్ ని మిస్ చేయకుండా వెంకీ కుడుముల ఈసారి సీరియస్ పాయింట్ ని తీసుకున్నట్టు కనిపిస్తోంది. మైత్రి నిర్మాణం కాబట్టి క్వాలిటీ పరంగా టెన్షన్ లేదు.
నితిన్ కు గత ఏడాది మాచర్ల నియోజకవర్గం, ఈ సంవత్సరం ఎక్స్ ట్రాడినరి మ్యాన్ లు షాక్ ఇచ్చాయి. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లో ఇరుక్కుపోవడం వల్ల ఫలితాలు తేడా కొడుతున్నాయని గుర్తించి ఈసారి రూటు మార్చి రాబిన్ హుడ్ ని ఎంచుకున్నాడు. చిరంజీవితో సినిమా చేయి దాకా వచ్చి మిస్ చేసుకున్న వెంకీ కుడుముల సైతం హ్యాట్రిక్ కొట్టాలనే కసితో ఉన్నాడు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్న రాబిన్ హుడ్ లో నితిన్ చేసే చోరీలు డిఫరెంట్ గా ఉంటాయని ఇన్ సైడ్ టాక్. విడుదల తేదీని ఇంకా ఖరారు చేయలేదు. ఈ ఏడాదే రిలీజ్ ఉంటుందని సమాచారం.
This post was last modified on January 26, 2024 11:55 am
ఎనర్జిటిక్ స్టార్ రామ్ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న డబుల్ ఇస్మార్ట్ మీద ఏ స్థాయి అంచనాలు ఉన్నాయో…
రీ రిలీజులతో మొహం మొత్తిపోయి జనం వాటిని పట్టించుకోవడం దాదాపు మానేశారు. అందుకే లీడర్, హ్యాపీ డేస్ లాంటి సెన్సిబుల్…
ఒకపక్క బాలీవుడ్ రామాయణంకు అడుగులు వేగంగా పడటంతో ఇంకోవైపు ఇలాంటి ఎపిక్ డ్రామాలను ప్లాన్ చేసుకున్న ఇతర హీరోలు, నిర్మాతలు…
ఏపీలో 80.66 శాతం పోలింగ్ జరిగిందని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారికంగా ప్రకటించారు. ఏపీ…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మీద సోషల్ మీడియా వేదికగా డిబేట్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవలే ఎన్నికల ప్రచారం చివరి…
ఏపీలో ఎన్నికలు ముగిశాయి. అంతా ప్రశాంత వాతావరణం ఏర్పడింది. అయితే.. అనూహ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు.. సీఎం జగన్ గురించి…