ఛలో రూపంలో డెబ్యూతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు వెంకీ కుడుముల భీష్మతోనూ అదే ఫలితాన్ని రిపీట్ చేశాడు. రెండో సినిమా బ్రేక్ లో భాగమైన హీరో నితిన్ తో మరోసారి చేతులు కలిపి ఈసారి దొంగతనాల కాన్సెప్ట్ ని తీసుకున్నారు. ఇవాళ రాబిన్ హుడ్ టైటిల్ ని అధికారికంగా ప్రకటించి చిన్న వీడియో ద్వారా కథేంటో చెప్పే ప్రయత్నం చేశారు. దాని ప్రకారం నితిన్ ఇందులో ఆధునిక దొంగగా కనిపించబోతున్నాడు. భారతీయులందరూ నా సోదరులు సోదరీమణులనే ప్రతిజ్ఞని పాటిస్తూ వాళ్ళ పర్సులు, ఇళ్లలో నుంచి డబ్బులు, నగలు దోచుకోవడమే పనిగా పెట్టుకుంటాడు.
ఇండియా మొత్తం నాదే కాబట్టి దేశంలో నివసించే వాళ్లంతా కుటుంబమేనంటూ తన చోరీలను సమర్ధించుకునే ప్రయత్నం వెరైటీగా ఉంది. హీరోయిన్ గా ముందు రష్మిక మందన్నను అనుకున్నారు కానీ తర్వాత ఏవో కారణాల వల్ల తను తప్పుకుంది. ఆ తర్వాత శ్రీలీల పేరు వినిపించినా ఇప్పుడీ టీజర్ డీటెయిల్స్ లో నితిన్ ప్రస్తావన తప్ప ఇంకెవరి వివరాలు లేవు. సో ఇంకా ఫైనల్ అయ్యింది లేనిది తెలియలేదు. ఎంటర్ టైన్మెంట్ ని మిస్ చేయకుండా వెంకీ కుడుముల ఈసారి సీరియస్ పాయింట్ ని తీసుకున్నట్టు కనిపిస్తోంది. మైత్రి నిర్మాణం కాబట్టి క్వాలిటీ పరంగా టెన్షన్ లేదు.
నితిన్ కు గత ఏడాది మాచర్ల నియోజకవర్గం, ఈ సంవత్సరం ఎక్స్ ట్రాడినరి మ్యాన్ లు షాక్ ఇచ్చాయి. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లో ఇరుక్కుపోవడం వల్ల ఫలితాలు తేడా కొడుతున్నాయని గుర్తించి ఈసారి రూటు మార్చి రాబిన్ హుడ్ ని ఎంచుకున్నాడు. చిరంజీవితో సినిమా చేయి దాకా వచ్చి మిస్ చేసుకున్న వెంకీ కుడుముల సైతం హ్యాట్రిక్ కొట్టాలనే కసితో ఉన్నాడు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్న రాబిన్ హుడ్ లో నితిన్ చేసే చోరీలు డిఫరెంట్ గా ఉంటాయని ఇన్ సైడ్ టాక్. విడుదల తేదీని ఇంకా ఖరారు చేయలేదు. ఈ ఏడాదే రిలీజ్ ఉంటుందని సమాచారం.
This post was last modified on January 26, 2024 11:55 am
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…