అప్పుడెప్పుడో ముప్పై ఏళ్ళ క్రితంలో సీతారామయ్య గారి మనవరాలులో ఏఎన్ఆర్ భార్యగా చేసిన నటిగా చెబితే గుర్తుకు రావడం కష్టం కానీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో వెంకటేష్ మహేష్ బాబుల బామ్మ అంటే వెంటనే ఫ్లాష్ అవుతుంది. ఆవిడే రోహిణి హట్టంగడి. తరచుగా కనిపించడం తప్ప సినిమాలు చేయడం బాగా తగ్గించిన ఈ పెద్దావిడ కొన్ని నెలల క్రితం ‘బైపన్ భారీదేవ’ అనే మరాఠి సినిమాలో కీలక పాత్ర పోషించారు. కేవలం 5 కోట్లతో తెరకెక్కిస్తే ఏకంగా 90 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాప్రే అనిపించింది. ఆరు నెలల తర్వాత కానీ హాట్ స్టార్ ద్వారా ఓటిటి మోక్షం దక్కలేదు.
ఆరుగురు ఆడవాళ్ళ పాత్రలను తీసుకుని ఆరు రంగులను ప్రతిబింబించేలా, కేవలం ఎమోషన్స్ ని కదిలించేలా దర్శకుడు కేదార్ షిండే చేసిన ప్రయత్నం గొప్ప ఫలితాన్ని ఇచ్చింది. ఇందులో ఎలాంటి ఫైట్లు, కమర్షియల్ మసాలాలు ఉండవు. అచ్చం ఇంట్లో మాట్లాడుకున్నట్టే సన్నివేశాలు జరుగుతాయి. రోజూ చూసే పాత్రలను స్క్రీన్ మీద కలుస్తున్నట్టు ఉంటుంది. రోహిణి హట్టంగడికి తోడు మిగిలిన అయిదుగురు ఆర్టిస్టులు నువ్వా నేనా అనే రీతిలో పోటీ పడటంతో జనాలు థియేటర్లకు పోటెత్తారు. ఒరిజినల్ వెర్షన్ తో పాటు కేవలం హిందీ డబ్బింగ్ మాత్రమే అందుబాటులో ఉంచారు.
దీని ప్రస్తావన ఎందుకంటే తెలుగులో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. రోహిణి హట్టంగడినే కొనసాగించి మిగిలిన క్యాస్టింగ్ ని ఇక్కడి వాళ్ళను తీసుకునేలా ఒక మహిళా దర్శకురాలు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. హక్కుల కోసం డిమాండ్ ఉండటంతో బైపన్ భారీదేవా నిర్మాతలు ఇతర బాషలకు అనువదించలేదని టాక్. అయినా స్టార్ హీరోల సినిమాలకే బ్లాక్ బస్టర్ లేని రోజుల్లో కేవలం ఆడవాళ్లను పెట్టుకుని ఇంత హిట్టు కొట్టడం విశేషమే. అంతగా ఏముందో తెలియాలంటే హిందీ మరాఠి రాకపోతే సబ్ టైటిల్స్ చూడటం తప్ప ప్రస్తుతానికి వేరే ఆప్షన్ లేదు.
This post was last modified on January 25, 2024 4:37 pm
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…
గజ్వేల్ నియోజకవర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట. అయితే.. ఇక్కడే పాగా వేయాలని.. వచ్చే…
తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…
అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయితే.. ఇప్పటి వరకు చూసింది ఒక లెక్క.. ఇక నుంచి మరో…
ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారిన 'డీజే సౌండ్' వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. తాజాగా అనంతపురంలో నిర్వహించిన వినాయక నిమజ్జన…