Movie News

బాలయ్య కోసం ప్రశాంత్ వర్మ కథలు

సంక్రాంతికి టాప్ వన్ బ్లాక్ బస్టర్ సాధించిన హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ పేరు ఇప్పుడు బాలీవుడ్ లోనూ వినిపిస్తోంది. ముందు చిన్న సినిమాగా స్టాంప్ వేయించుకుని అంచనాలకు మించి బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపించడం ఎవరూ ఊహించనిది. ఏకంగా రెండు వందల కోట్ల గ్రాస్ దాటేసి ప్రస్తుతం ట్రిపుల్ సెంచరీ మీద కన్నేసింది. ఏకంగా ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ తో ప్రత్యేకంగా ప్రశంసలు అందుకోవడమంటే మాటలు కాదు. సినిమా ప్రపంచానికి దూరంగా ఉండే ఒక మహా యోగిపుంగవుడి దృష్టిలో పడటం అంటే మాటలు కాదు.

ప్రస్తుతం ప్రశాంత్ వర్మ హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ పనుల్లో ఉన్నాడు. టైటిల్ పాత్ర పెద్ద స్టార్ హీరో చేస్తారని చెబుతున్నాడు కానీ పేరు ఎవరనేది బయటికి చెప్పడం లేదు. రానా అని ఇన్ సైడ్ టాక్. ఇదిలా ఉండగా బాలకృష్ణతో భవిష్యత్తులో సినిమా చేసే ప్లానింగ్ లో ఉన్నట్టు ఈ క్రియేటివ్ డైరెక్టర్ చెప్పడం ఫ్యాన్స్ కి కిక్ ఇస్తోంది. తన దగ్గర రెండు కథలు ఉన్నాయని, ఒకదాంట్లో సినిమాటిక్ యునివర్స్ లో భాగంగా వచ్చే సూపర్ హీరో బ్యాక్ డ్రాప్ ఉంటే, మరొకటి డిఫరెంట్ సెటప్ తో ఒక మంచి కమర్షియల్ సబ్జెక్టు సిద్ధం చేశానని అంటున్నాడు. ఏది కుదిరితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పుకొచ్చాడు.

ఈ కాంబో సెట్ కావడానికి టైం అయితే పడుతుంది. ఎందుకంటే బాబీ దర్శకత్వంలో ఎన్బికె 109 చేస్తున్న బాలయ్య ఎన్నికల సమయంలో బ్రేక్ తీసుకుని తిరిగి వేసవిలో షూటింగ్ కొనసాగిస్తారు. ప్రశాంత్ వర్మ జై హనుమాన్ పూర్తి చేసే ఫ్రీ అయ్యేలోపు ఎంత లేదన్నా ఇంకో ఏడాది పడుతుంది. ఆలోగా బాలకృష్ణ ఇంకో రెండు కమిట్ మెంట్లు పూర్తి చేసే అవకాశం లేకపోలేదు. వాటిలో బోయపాటి శీనుది కూడా ఉంది. ప్రశాంత్ వర్మ లాంటి వాళ్ళతో చేతులు కలిపిస్తే సీనియర్ హీరోల్లోని కొత్త షేడ్స్ బయటికి వస్తాయి. అనిల్ రావిపూడితో బాలయ్య భగవంత్ కేసరి చేయడానికి కారణం ఇదే.

This post was last modified on January 25, 2024 10:01 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నెట్ ఫ్లిక్స్ ఒకవైపు… డాల్బీ సినిమా ఇంకోవైపు

టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…

2 hours ago

కాలర్ లాంటి కంటెంట్ ఉంటే చాలు

మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…

3 hours ago

‘అటవీశాఖ అధికారులను కిడ్నాప్ చెయ్యాలి’

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…

4 hours ago

కష్టాల నాయకుడికి ‘ప్రైమ్’ షాకు ?

రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…

4 hours ago

పవన్ ఫ్యాన్స్ బాధ అర్థం చేసుకున్నారు

అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…

5 hours ago

అక్షయ్ కామెడీ… ఇప్పుడు పండుతుందా?

​బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…

6 hours ago