టాలీవుడ్ లో పోటీ తాకిడి స్ట్రెయిట్ సినిమాలకే కాదు డబ్బింగ్ చిత్రాలకూ తాకుతోంది. ముందుగా ప్రకటించిన ప్రకారం మోహన్ లాల్ మలైకోట్టై వాలిబన్ తెలుగు వెర్షన్ ఈ రోజు విడుదల కావాలి. ఆ మేరకు గతం వారం ట్రైలర్ లోనే ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. కానీ మలయాళంలో మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కంప్లీట్ యాక్టర్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన మూవీగా దీని మీద భారీ అంచనాలున్నాయి. కేరళలో బాహుబలి రేంజ్ లో ఓపెనింగ్స్ వస్తాయని అంచనా. విజువల్స్ చూస్తే కంటెంట్ కూడా దానికి తగ్గట్టే ఆ రేంజ్ లో కనిపిస్తోంది.
ఇక్కడ వెనుకడుగు వేయడానికి కారణాలున్నాయి. రేపు ఒకేసారి కెప్టెన్ మిల్లర్, అయలాన్ లు వస్తున్నాయి. లేట్ రిలీజ్ అయినప్పటికీ బలమైన డిస్ట్రిబ్యూటర్లు అండగా నిలవడంతో ఏపీ తెలంగాణలో తగినన్ని స్క్రీన్లు దొరికాయి. ఇవి కాకుండా హృతిక్ రోషన్ ఫైటర్ కి గ్రాండ్ మల్టీప్లెక్స్ రిలీజ్ దొరికింది. హనుమాన్ ఇంకా నెమ్మదించలేదు సరికదా రిపబ్లిక్ డే నుంచి మళ్ళీ పికప్ కానుంది. నా సామిరంగ, గుంటూరు కారంకు మెయిన్ థియేటర్లు మూడో వారంలోనూ కొనసాగిస్తున్నారు. ఈ నేపధ్యంలో మలైకోట్టై వాలిబన్ కి గ్యాప్ లేదు. పైగా ప్రమోషన్లకు సరిపడా టైం లేకపోవడం ఇంకో సమస్య.
ఒకవేళ ఒరిజినల్ వెర్షన్ కు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే సమస్య లేదు. తెలుగులో ఆలస్యమైనా జనాలు చూస్తారు. కాకపోతే మోహన్ లాల్ కు మన దగ్గర సోలో మార్కెట్ ఎప్పుడూ లేదు. జనతా గ్యారేజ్ లాంటి వాటిలో కీలక పాత్ర పోషించినా తమిళ హీరోల రేంజ్ లో ఆయన్ను సొంతం చేసుకోలేకపోయాం. అందుకే రిస్క్ ఎందుకులెమ్మని ప్రస్తుతానికి డ్రాప్ అయ్యారు. ఫిబ్రవరి 2న అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ తప్ప చెప్పుకోదగ్గ కొత్త బొమ్మలేవీ లేకపోవడంతో ఆ తేదీని పరిశీలిస్తున్నారు. మలైకోట్టై వాలిబన్ పేరు కూడా కనెక్ట్ కాలేని విధంగా ఉంది. మన జనాలకు అర్థమయ్యేలా టైటిల్ పెడితే తప్ప బజ్ రాదు.
This post was last modified on January 25, 2024 9:46 am
ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…