టాలీవుడ్ లో పోటీ తాకిడి స్ట్రెయిట్ సినిమాలకే కాదు డబ్బింగ్ చిత్రాలకూ తాకుతోంది. ముందుగా ప్రకటించిన ప్రకారం మోహన్ లాల్ మలైకోట్టై వాలిబన్ తెలుగు వెర్షన్ ఈ రోజు విడుదల కావాలి. ఆ మేరకు గతం వారం ట్రైలర్ లోనే ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. కానీ మలయాళంలో మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కంప్లీట్ యాక్టర్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన మూవీగా దీని మీద భారీ అంచనాలున్నాయి. కేరళలో బాహుబలి రేంజ్ లో ఓపెనింగ్స్ వస్తాయని అంచనా. విజువల్స్ చూస్తే కంటెంట్ కూడా దానికి తగ్గట్టే ఆ రేంజ్ లో కనిపిస్తోంది.
ఇక్కడ వెనుకడుగు వేయడానికి కారణాలున్నాయి. రేపు ఒకేసారి కెప్టెన్ మిల్లర్, అయలాన్ లు వస్తున్నాయి. లేట్ రిలీజ్ అయినప్పటికీ బలమైన డిస్ట్రిబ్యూటర్లు అండగా నిలవడంతో ఏపీ తెలంగాణలో తగినన్ని స్క్రీన్లు దొరికాయి. ఇవి కాకుండా హృతిక్ రోషన్ ఫైటర్ కి గ్రాండ్ మల్టీప్లెక్స్ రిలీజ్ దొరికింది. హనుమాన్ ఇంకా నెమ్మదించలేదు సరికదా రిపబ్లిక్ డే నుంచి మళ్ళీ పికప్ కానుంది. నా సామిరంగ, గుంటూరు కారంకు మెయిన్ థియేటర్లు మూడో వారంలోనూ కొనసాగిస్తున్నారు. ఈ నేపధ్యంలో మలైకోట్టై వాలిబన్ కి గ్యాప్ లేదు. పైగా ప్రమోషన్లకు సరిపడా టైం లేకపోవడం ఇంకో సమస్య.
ఒకవేళ ఒరిజినల్ వెర్షన్ కు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే సమస్య లేదు. తెలుగులో ఆలస్యమైనా జనాలు చూస్తారు. కాకపోతే మోహన్ లాల్ కు మన దగ్గర సోలో మార్కెట్ ఎప్పుడూ లేదు. జనతా గ్యారేజ్ లాంటి వాటిలో కీలక పాత్ర పోషించినా తమిళ హీరోల రేంజ్ లో ఆయన్ను సొంతం చేసుకోలేకపోయాం. అందుకే రిస్క్ ఎందుకులెమ్మని ప్రస్తుతానికి డ్రాప్ అయ్యారు. ఫిబ్రవరి 2న అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ తప్ప చెప్పుకోదగ్గ కొత్త బొమ్మలేవీ లేకపోవడంతో ఆ తేదీని పరిశీలిస్తున్నారు. మలైకోట్టై వాలిబన్ పేరు కూడా కనెక్ట్ కాలేని విధంగా ఉంది. మన జనాలకు అర్థమయ్యేలా టైటిల్ పెడితే తప్ప బజ్ రాదు.
This post was last modified on January 25, 2024 9:46 am
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…
అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…
వైసీపీ అధినేత జగన్ హయాంలో ఓ కుటుంబం రోడ్డున పడింది. కేవలం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి…
కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వైసీపీ నేతలకు, కార్యకర్తలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో పిచ్చి పిచ్చి…