బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఒకప్పుడు చాలా కామ్గా ఉండేది. మీడియాతో పెద్దగా మాట్లాడేది కాదు. తన వ్యక్తిగత విషయాల గురించి చర్చే ఉండేది కాదు. తన సినిమాలతోనే వాయిస్ వినిపించేది. ఆమె నటన గురించే అందరూ మాట్లాడుకునేవారు. కానీ కొన్నేళ్లుగా ఆమె సినిమాలేవీ సరిగా ఆడట్లేదు. వరుసబెట్టి డిజాస్టర్లు ఇస్తోంది. దీంతో సినిమాల చర్చ పక్కకు వెళ్లిపోయి.. కంగనా వ్యక్తిగత విషయాలు, ఆమె నోటిదురుసు, రాజకీయ భావజాలం మీద ఎక్కువ చర్చ జరుగుతోంది.
చివరగా కంగనా నుంచి వచ్చిన తేజస్ సినిమా పెద్ద డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. కట్ చేస్తే తాజాగా రామమందిర ఆవిష్కరణ సందర్భంగా కంగనా చేసిన హడావుడితో వార్తల్లో వ్యక్తి అయింది.
దీనికి తోడు ఈజ్ మై ట్రిప్ అధినేత నిషాంత్ పిట్టితో కంగనా డేటింగ్లో ఉందనే వార్తలు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వీళ్లిద్దరూ కలిసున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కంగనా స్పందించింది. తాను డేటింగ్లో ఉన్న మాట వాస్తవమే అని.. కానీ అది నిషాంత్తో కాదని ఆమె స్పష్టం చేసింది.
“దయచేసి అసత్య ప్రచారాలు చేయకండి. ఇది నా విన్నపం. నిషాంత్కు పెళ్లయింది. ఆయన వైవాహిక జీవితంగా సంతోషంగా సాగిపోతోంది. నేను వేరే వ్యక్తితో డేటింగ్లో ఉన్నా. అది ఎవరో చెప్పే సరైన సమయం కోసం ఎదురు చూడండి. దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. ఇద్దరు వ్యక్తులు కలిసి ఫొటో దిగినంత మాత్రాన వారి గురించి ఇలా మట్లాడటం కరెక్ట్ కాదు. మళ్లీ ఇలా ఎప్పుడూ చేయొద్దు” అని కంగనా స్పష్టం చేసింది.
This post was last modified on January 24, 2024 8:50 pm
కాకినాడ సముద్ర తీరంలో మత్స్యకారులకు చిక్కిన కచిడి చేప అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. 25 కిలోల బరువున్న ఈ చేప మార్కెట్లో…
ఫిబ్రవరి ఏడు కోసం అక్కినేని అభిమానుల ఎదురు చూపులు మాములుగా లేవు. గత కొంత కాలంగా గట్టిగా చెప్పుకునే బ్లాక్…
అరవింద సమేత.. మహర్షి.. గద్దలకొండ గణేష్.. అల వైకుంఠపురములో... ఇలా ఒక టైంలో తెలుగులో వరుస సక్సెస్లతో తిరుగులేని క్రేజ్…
భారత యువ గ్రాండ్మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద్ తన అద్భుతమైన ప్రదర్శనతో టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు.…
1995 దాకా దేశంలో అటు కేంద్ర ప్రభుత్వమైనా… ఇటు రాష్ట్ర ప్రభుత్వాలైనా కొనసాగించింది కేవలం పరిపాలన మాత్రమే. అయితే 1995లో…
ముంబయిలో జరిగిన ఐదో టీ20లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోసి, కేవలం 37…