బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఒకప్పుడు చాలా కామ్గా ఉండేది. మీడియాతో పెద్దగా మాట్లాడేది కాదు. తన వ్యక్తిగత విషయాల గురించి చర్చే ఉండేది కాదు. తన సినిమాలతోనే వాయిస్ వినిపించేది. ఆమె నటన గురించే అందరూ మాట్లాడుకునేవారు. కానీ కొన్నేళ్లుగా ఆమె సినిమాలేవీ సరిగా ఆడట్లేదు. వరుసబెట్టి డిజాస్టర్లు ఇస్తోంది. దీంతో సినిమాల చర్చ పక్కకు వెళ్లిపోయి.. కంగనా వ్యక్తిగత విషయాలు, ఆమె నోటిదురుసు, రాజకీయ భావజాలం మీద ఎక్కువ చర్చ జరుగుతోంది.
చివరగా కంగనా నుంచి వచ్చిన తేజస్ సినిమా పెద్ద డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. కట్ చేస్తే తాజాగా రామమందిర ఆవిష్కరణ సందర్భంగా కంగనా చేసిన హడావుడితో వార్తల్లో వ్యక్తి అయింది.
దీనికి తోడు ఈజ్ మై ట్రిప్ అధినేత నిషాంత్ పిట్టితో కంగనా డేటింగ్లో ఉందనే వార్తలు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వీళ్లిద్దరూ కలిసున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కంగనా స్పందించింది. తాను డేటింగ్లో ఉన్న మాట వాస్తవమే అని.. కానీ అది నిషాంత్తో కాదని ఆమె స్పష్టం చేసింది.
“దయచేసి అసత్య ప్రచారాలు చేయకండి. ఇది నా విన్నపం. నిషాంత్కు పెళ్లయింది. ఆయన వైవాహిక జీవితంగా సంతోషంగా సాగిపోతోంది. నేను వేరే వ్యక్తితో డేటింగ్లో ఉన్నా. అది ఎవరో చెప్పే సరైన సమయం కోసం ఎదురు చూడండి. దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. ఇద్దరు వ్యక్తులు కలిసి ఫొటో దిగినంత మాత్రాన వారి గురించి ఇలా మట్లాడటం కరెక్ట్ కాదు. మళ్లీ ఇలా ఎప్పుడూ చేయొద్దు” అని కంగనా స్పష్టం చేసింది.
This post was last modified on January 24, 2024 8:50 pm
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…