మంచి డేట్ కోసం విడుదల తేదీలు ముందే ప్రకటించుకోవడం వరకు బాగానే ఉంది వాటిని చేరుకోవడం మాత్రం ప్యాన్ ఇండియా సినిమాలకు ప్రాణ సంకటంగా మారుతోంది. కారణాలు ఏమైనా సరే దీని ప్రభావం మిగిలిన వాటి మీద తీవ్రంగా పడుతోంది. మరీ వెనక్కు అవసరం లేదు కానీ ఈ మధ్య జరిగిన పరిణామాలు చూస్తే చాలు మ్యాటర్ అర్థమైపోతుంది. సెప్టెంబర్ నుంచి సలార్ డిసెంబర్ కు వెళ్లిపోవడం వల్ల కనీసం పదికి పైగా సినిమాలకు మార్కెట్, ఓపెనింగ్స్ పరంగా పెద్ద దెబ్బ కొట్టింది. దీని వల్ల క్రిస్మస్ నుంచి సంక్రాంతికి వచ్చిన వెంకటేష్ పోటీలో నలిగిపోయి డిజాస్టర్ అందుకున్నారు.
ఇప్పుడు ఎక్కడ చూసినా దేవర వాయిదా గురించి చర్చ జరుగుతోంది. యూనిట్ అఫీషియల్ గా చెప్పకపోయినా ఏప్రిల్ లో రాదనేది ట్రేడ్ లో బలంగా వినిపిస్తున్న మాట. ఆగస్ట్ 15 లాక్ చేసుకున్న పుష్ప 2 ది రూల్ సైతం తప్పుకోక తప్పదనే ప్రచారం మళ్ళీ ఊపందుకుంది. మే తొమ్మిది కల్కి రావడం మీద అనుమానాలు తీరలేదు. గేమ్ ఛేంజర్ గురించి అప్డేట్ అంటే చాలు నిర్మాత దిల్ రాజు అక్కడి నుంచి మాయం కావడం ఒక్కటే తక్కువ. పవన్ కళ్యాణ్ ఓజి తిరిగి ఎప్పుడు మొదలవుతుందో ఎన్నికలు అయిపోతే కానీ చెప్పలేని పరిస్థితి. నిఖిల్ విశ్వంభు సైతం దసరా లేదా దీపావళిని చేరుకోవడానికి కష్టపడుతోంది.
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలు ఉన్నాయి కానీ ఎంత ప్లానింగ్ తో షూటింగులు చేస్తున్నా సరే వాయిదా పర్వానికి అందరూ బలవుతున్నారు. ఆర్ఆర్ఆర్, బాహుబలి, సాహోలు సైతం గతంలో ఈ సమస్యను ఎదురుకున్నవే. దీనికి పరిష్కారం లేదా అంటే అంత సులభంగా ఎవరూ చెప్పలేరు. హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీలలాగా మనకు అపరిమిత బడ్జెట్ లు, బోలెడు విఎఫెక్స్ వనరులు అందుబాటులో ఉండవు. ప్రతిదానికి పరుగులు పెట్టాల్సిందే. టాలీవుడ్ రేంజ్ పెరగడం వల్ల దర్శకులు రాజీ పడకుండా క్వాలిటీ కోసం పరితపిస్తున్నారు. అందుకే వాయిదాలు, ఆలస్యాలు అలవాటు చేసుకోవాల్సిందే
This post was last modified on January 24, 2024 2:58 pm
కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…
కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…
కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు…
అయేషా మీరా. ఉమ్మడి ఏపీలో 2007లో ఓ వ్యక్తి కామ దాహానికి బలి అయిపోయిన బీఫార్మసీ విద్యార్థిని. ఈ కేసులో…