రెండు వందల కోట్లకు పైగా గ్రాస్ తో ఆల్ టైం బ్లాక్ బస్టర్స్ సరసన చోటు దక్కించుకునేందుకు పరుగులు పెడుతున్న హనుమాన్ సీక్వెల్ వచ్చే ఏడాది ప్రకటించిన సంగతి తెలిసిందే. జై హనుమాన్ టైటిల్ థియేటర్లోనే రివీల్ చేశారు. సినిమా సాధించిన ఘనవిజయం చూసి ఒక్కసారిగా కొనసాగింపుపై అంచనాలు పెరుగుతున్నాయి. దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమంతుడి పాత్ర కోసం పెద్ద హీరోని ట్రై చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఆయనే పలు ఇంటర్వ్యూలలో స్పష్టంగా చెబుతున్నాడు. తేజ సజ్జ ఉన్నప్పటికీ ప్రాధాన్యం పరంగా మొత్తం కథ అసలు హనుమాన్ చుట్టే తిరుగుతుందట.
అంతర్గతంగా వినిపిస్తున్న సమాచారం మేరకు ప్రశాంత్ వర్మ పెట్టుకున్న ఆప్షన్లలో బయట ప్రచారం జరిగినట్టు చిరంజీవి లేరు. ఎందుకంటే విశ్వంభర తప్ప ఇంకో ఏడాది దాకా వేరే ఏ చిత్రంలో నటించే ఆలోచన మెగాస్టార్ పెట్టుకోలేదు. సో నో ఛాన్స్. తనకు డైరెక్టర్ గా అవకాశమిచ్చిన నానిని ఈ విషయంగా సంప్రదించినట్టు వినికిడి. అయితే సానుకూలంగా స్పందించింది లేనిది ఇంకా తెలియలేదు. ఆంజనేయుడిగా తన శరీరం సూటవుతుందా లేదానే దాని మీద సందేహం వ్యక్త పరిచినట్టు టాక్. బాలకృష్ణతో ప్రశాంత్ వర్మ వేరే సబ్జెక్టు ప్లాన్ చేసుకున్నాడు. అడిగే ఛాన్స్ లేనట్టే.
స్టార్ ఇమేజ్ ఉన్న నటుడు హనుమంతుడిగా నటించడం ఓకే కానీ దానికి తగ్గ విగ్రహం, కండలు చాలా ముఖ్యం. ప్రశాంత్ వర్మ ఇంకా స్క్రిప్ట్ ని పూర్తి చేయాల్సి ఉంది. బడ్జెట్ మీద ఒక అవగాహనకు వచ్చాక ఆర్టిస్టులు ఎవరనేది డిసైడ్ చేయాలి. తేజ సజ్జ సంగతి పక్కనపెడితే వచ్చే ఏడాది జై హనుమాన్ రిలీజ్ చేయాలంటే కేవలం సంవత్సర కాలం సరిపోకపోవచ్చు. పైగా ప్రశాంత్ వర్మ ఆల్రెడీ నిర్మాణంలో అధీరాని పూర్తి చేయాలి. దానికన్నా ముందు సైలెంట్ గా తీసిన రామ్ కామ్ ఎంటర్ టైనర్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకోవాలి. జై హనుమాన్ ఆలస్యమయ్యేలానే ఉంది. క్వాలిటీ ముఖ్యంగా కదా.
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…