రెండు వందల కోట్లకు పైగా గ్రాస్ తో ఆల్ టైం బ్లాక్ బస్టర్స్ సరసన చోటు దక్కించుకునేందుకు పరుగులు పెడుతున్న హనుమాన్ సీక్వెల్ వచ్చే ఏడాది ప్రకటించిన సంగతి తెలిసిందే. జై హనుమాన్ టైటిల్ థియేటర్లోనే రివీల్ చేశారు. సినిమా సాధించిన ఘనవిజయం చూసి ఒక్కసారిగా కొనసాగింపుపై అంచనాలు పెరుగుతున్నాయి. దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమంతుడి పాత్ర కోసం పెద్ద హీరోని ట్రై చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఆయనే పలు ఇంటర్వ్యూలలో స్పష్టంగా చెబుతున్నాడు. తేజ సజ్జ ఉన్నప్పటికీ ప్రాధాన్యం పరంగా మొత్తం కథ అసలు హనుమాన్ చుట్టే తిరుగుతుందట.
అంతర్గతంగా వినిపిస్తున్న సమాచారం మేరకు ప్రశాంత్ వర్మ పెట్టుకున్న ఆప్షన్లలో బయట ప్రచారం జరిగినట్టు చిరంజీవి లేరు. ఎందుకంటే విశ్వంభర తప్ప ఇంకో ఏడాది దాకా వేరే ఏ చిత్రంలో నటించే ఆలోచన మెగాస్టార్ పెట్టుకోలేదు. సో నో ఛాన్స్. తనకు డైరెక్టర్ గా అవకాశమిచ్చిన నానిని ఈ విషయంగా సంప్రదించినట్టు వినికిడి. అయితే సానుకూలంగా స్పందించింది లేనిది ఇంకా తెలియలేదు. ఆంజనేయుడిగా తన శరీరం సూటవుతుందా లేదానే దాని మీద సందేహం వ్యక్త పరిచినట్టు టాక్. బాలకృష్ణతో ప్రశాంత్ వర్మ వేరే సబ్జెక్టు ప్లాన్ చేసుకున్నాడు. అడిగే ఛాన్స్ లేనట్టే.
స్టార్ ఇమేజ్ ఉన్న నటుడు హనుమంతుడిగా నటించడం ఓకే కానీ దానికి తగ్గ విగ్రహం, కండలు చాలా ముఖ్యం. ప్రశాంత్ వర్మ ఇంకా స్క్రిప్ట్ ని పూర్తి చేయాల్సి ఉంది. బడ్జెట్ మీద ఒక అవగాహనకు వచ్చాక ఆర్టిస్టులు ఎవరనేది డిసైడ్ చేయాలి. తేజ సజ్జ సంగతి పక్కనపెడితే వచ్చే ఏడాది జై హనుమాన్ రిలీజ్ చేయాలంటే కేవలం సంవత్సర కాలం సరిపోకపోవచ్చు. పైగా ప్రశాంత్ వర్మ ఆల్రెడీ నిర్మాణంలో అధీరాని పూర్తి చేయాలి. దానికన్నా ముందు సైలెంట్ గా తీసిన రామ్ కామ్ ఎంటర్ టైనర్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకోవాలి. జై హనుమాన్ ఆలస్యమయ్యేలానే ఉంది. క్వాలిటీ ముఖ్యంగా కదా.
This post was last modified on January 23, 2024 6:44 am
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…