హీరోగా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. విలన్ గా.. ఇలా అనేక రకాల పాత్రల్లో మెప్పించిన నటుడు శివాజీ. దాదాపు రెండు దశాబ్దాల పాటు విరామం లేకుండా సినిమాలు చేసిన అతను.. కొన్నేళ్ల నుంచి వెండి తెర మీద పెద్దగా కనిపించడం లేదు. కొంతకాలం రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. ఆపై వాటికీ దూరం అయ్యాడు. ఆ తర్వాత కొన్ని నెలల కిందట బిగ్ బాస్ షోలో అడుగుపెట్టి మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చాడు.
ఇటీవలే విడుదలైన శివాజీ వెబ్ సిరీస్ నైంటీస్ మిడిల్ క్లాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కాగా త్వరలోనే శివాజీ వెండితెర మీదికి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు విశేషం. అంతకంటే విశేషం ఏంటంటే అతను విలన్ పాత్రతో పునరాగమనం చేయబోతున్నాడు. ఈ విషయాన్ని తనే స్వయంగా కన్ఫమ్ చేశాడు. కాకపోతే ఏ సినిమాలో అన్నది మాత్రం చెప్పలేదు.
అయితే శివాజీ సన్నిహితుల సమాచారం ప్రకారం అతను బోయపాటి చిత్రంలో విలన్ పాత్ర చేయబోతున్నాడట. బోయపాటి తన తర్వాతి చిత్రాన్ని తన ఫేవరెట్ హీరో నందమూరి బాలకృష్ణ తో చేయనున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందే ఒక టీవీ షోలో శివాజీ మాట్లాడుతూ తాను బోయపాటి సినిమాలో నటించబోతున్నట్లు వెల్లడించాడు. ఇప్పుడేమో విలన్ పాత్ర గురించి అప్డేట్ ఇచ్చాడు. కాబట్టి బాలయ్య- బోయపాటి సినిమాలో శివాజీని ప్రతినాయకుడి పాత్రలో చూడొచ్చు అన్నమాట.
హీరోగా ఉన్న రోజుల్లోనే ఒట్టేసి చెబుతున్నా సహా కొన్ని చిత్రాల్లో నెగిటివ్ రోల్స్ చేశాడు శివాజీ. వాటిలో పెర్ఫార్మన్స్ బట్టి చూస్తే విలనీని అతను బాగానే పండిస్తాడని భావించవచ్చు. బిగ్ బాస్ షో నుంచి వచ్చాక తను చాలా కథలు విన్నానని.. వాటిలో చాలావరకు రొటీన్ గా ఉన్నాయి అని శివాజీ చెప్పాడు. విలన్ పాత్ర ఒకటి వైవిధ్యంగా అనిపించి ఆ సినిమా ఒప్పుకున్నట్లు శివాజీ తెలిపాడు.
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…
తెలుగు టాప్ కొరియోగ్రాఫర్లయిన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ పరస్పరం అరుచుకుంటూ ఒకరి మీదికి ఒకరు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…
బాక్సాఫీస్ వద్ద లెనిన్ తప్ప జనాలకు వేరే ఆప్షన్ కనిపించడం లేదు. ఇతర కొత్త సినిమాలు విడుదలైనా వాటి గురించి…
తెలంగాణలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని, ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయడం లేదని ఆరోపిస్తూ.. ప్రధాన ప్రతిపక్షం…