హీరోగా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. విలన్ గా.. ఇలా అనేక రకాల పాత్రల్లో మెప్పించిన నటుడు శివాజీ. దాదాపు రెండు దశాబ్దాల పాటు విరామం లేకుండా సినిమాలు చేసిన అతను.. కొన్నేళ్ల నుంచి వెండి తెర మీద పెద్దగా కనిపించడం లేదు. కొంతకాలం రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. ఆపై వాటికీ దూరం అయ్యాడు. ఆ తర్వాత కొన్ని నెలల కిందట బిగ్ బాస్ షోలో అడుగుపెట్టి మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చాడు.
ఇటీవలే విడుదలైన శివాజీ వెబ్ సిరీస్ నైంటీస్ మిడిల్ క్లాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కాగా త్వరలోనే శివాజీ వెండితెర మీదికి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు విశేషం. అంతకంటే విశేషం ఏంటంటే అతను విలన్ పాత్రతో పునరాగమనం చేయబోతున్నాడు. ఈ విషయాన్ని తనే స్వయంగా కన్ఫమ్ చేశాడు. కాకపోతే ఏ సినిమాలో అన్నది మాత్రం చెప్పలేదు.
అయితే శివాజీ సన్నిహితుల సమాచారం ప్రకారం అతను బోయపాటి చిత్రంలో విలన్ పాత్ర చేయబోతున్నాడట. బోయపాటి తన తర్వాతి చిత్రాన్ని తన ఫేవరెట్ హీరో నందమూరి బాలకృష్ణ తో చేయనున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందే ఒక టీవీ షోలో శివాజీ మాట్లాడుతూ తాను బోయపాటి సినిమాలో నటించబోతున్నట్లు వెల్లడించాడు. ఇప్పుడేమో విలన్ పాత్ర గురించి అప్డేట్ ఇచ్చాడు. కాబట్టి బాలయ్య- బోయపాటి సినిమాలో శివాజీని ప్రతినాయకుడి పాత్రలో చూడొచ్చు అన్నమాట.
హీరోగా ఉన్న రోజుల్లోనే ఒట్టేసి చెబుతున్నా సహా కొన్ని చిత్రాల్లో నెగిటివ్ రోల్స్ చేశాడు శివాజీ. వాటిలో పెర్ఫార్మన్స్ బట్టి చూస్తే విలనీని అతను బాగానే పండిస్తాడని భావించవచ్చు. బిగ్ బాస్ షో నుంచి వచ్చాక తను చాలా కథలు విన్నానని.. వాటిలో చాలావరకు రొటీన్ గా ఉన్నాయి అని శివాజీ చెప్పాడు. విలన్ పాత్ర ఒకటి వైవిధ్యంగా అనిపించి ఆ సినిమా ఒప్పుకున్నట్లు శివాజీ తెలిపాడు.
This post was last modified on January 20, 2024 10:06 pm
దేశంలో సార్వత్రిక ఎన్నికలు కీలకదశకు చేరుకున్న నేపథ్యంలో దేశంలో వివిద నియోజకవర్గాలలో నిలబడ్డ ప్రముఖులలో ఎవరు గెలుస్తారు ? అని…
ఒక హీరో వద్దన్న స్టోరీలు ఇంకొకరు తీసుకోవడం సినీ పరిశ్రమలో లెక్కలేనన్నిసార్లు జరిగి ఉంటుంది. త్రివిక్రమ్ చెప్పినప్పుడు నిద్రరాకపోయి ఉంటే…
యానిమల్ విడుదలైన టైంలో, అంతకు ముందు కబీర్ సింగ్ సమయంలో బాలీవుడ్ విమర్శకులు, కొందరు నటీనటులు అదే పనిగా దర్శకుడు…
ఎన్నికల ప్రచారంలో ఎండనక.. వాననక.. నానా కష్టాలూ పడిన రాజకీయ ప్రముఖులు, పోలింగ్ తర్వాత, కౌంటింగ్కి ముందు.. కొంత ఉపశమనం…
పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద పోటీకి దిగిన వైసీపీ ఎంపీ (కాకినాడ) వంగా గీత, జనసేన పార్టీలోకి…
ఏపీలో రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. ఎన్నికల పోలింగ్ జరిగిన ఈ నెల 13న, ఆ రోజు తర్వాత కూడా..…