హీరోగా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. విలన్ గా.. ఇలా అనేక రకాల పాత్రల్లో మెప్పించిన నటుడు శివాజీ. దాదాపు రెండు దశాబ్దాల పాటు విరామం లేకుండా సినిమాలు చేసిన అతను.. కొన్నేళ్ల నుంచి వెండి తెర మీద పెద్దగా కనిపించడం లేదు. కొంతకాలం రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. ఆపై వాటికీ దూరం అయ్యాడు. ఆ తర్వాత కొన్ని నెలల కిందట బిగ్ బాస్ షోలో అడుగుపెట్టి మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చాడు.
ఇటీవలే విడుదలైన శివాజీ వెబ్ సిరీస్ నైంటీస్ మిడిల్ క్లాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కాగా త్వరలోనే శివాజీ వెండితెర మీదికి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు విశేషం. అంతకంటే విశేషం ఏంటంటే అతను విలన్ పాత్రతో పునరాగమనం చేయబోతున్నాడు. ఈ విషయాన్ని తనే స్వయంగా కన్ఫమ్ చేశాడు. కాకపోతే ఏ సినిమాలో అన్నది మాత్రం చెప్పలేదు.
అయితే శివాజీ సన్నిహితుల సమాచారం ప్రకారం అతను బోయపాటి చిత్రంలో విలన్ పాత్ర చేయబోతున్నాడట. బోయపాటి తన తర్వాతి చిత్రాన్ని తన ఫేవరెట్ హీరో నందమూరి బాలకృష్ణ తో చేయనున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందే ఒక టీవీ షోలో శివాజీ మాట్లాడుతూ తాను బోయపాటి సినిమాలో నటించబోతున్నట్లు వెల్లడించాడు. ఇప్పుడేమో విలన్ పాత్ర గురించి అప్డేట్ ఇచ్చాడు. కాబట్టి బాలయ్య- బోయపాటి సినిమాలో శివాజీని ప్రతినాయకుడి పాత్రలో చూడొచ్చు అన్నమాట.
హీరోగా ఉన్న రోజుల్లోనే ఒట్టేసి చెబుతున్నా సహా కొన్ని చిత్రాల్లో నెగిటివ్ రోల్స్ చేశాడు శివాజీ. వాటిలో పెర్ఫార్మన్స్ బట్టి చూస్తే విలనీని అతను బాగానే పండిస్తాడని భావించవచ్చు. బిగ్ బాస్ షో నుంచి వచ్చాక తను చాలా కథలు విన్నానని.. వాటిలో చాలావరకు రొటీన్ గా ఉన్నాయి అని శివాజీ చెప్పాడు. విలన్ పాత్ర ఒకటి వైవిధ్యంగా అనిపించి ఆ సినిమా ఒప్పుకున్నట్లు శివాజీ తెలిపాడు.
This post was last modified on January 20, 2024 10:06 pm
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం' షూటింగ్ మంచి స్వింగ్ లో ఉంది. ముందుగా తీసుకున్న…
మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో…
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకునేందుకు కొనసాగిన ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది. యావత్తు తెలంగాణ వేదికగా సాగిన ఈ ఉద్యమంలో…
``రాజకీయ నేతలు.. ప్రజల కోసం పనిచేసేది తక్కువ.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ. కావాలంటే.. నా ఫోన్ సహా.. రాష్ట్రంలోని…
బద్రి లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు పూరి జగన్నాథ్. అరంగేట్రంలోనే అలాంటి హిట్ పడిందంటే ఇక…
తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్స్(డీజీ)గా పదోన్నతి కల్పించింది. వీరిలో మహేశ్ భగవత్, స్వాతి లక్రా,…