Movie News

మహేష్- రాజమౌళి కథ రెడీ అయిపోయింది

గుంటూరు కారం సందడి కొనసాగుతుండగానే మహేష్ బాబు అభిమానుల దృష్టి మరో సినిమా మీదికి మళ్ళింది. అది రాజమౌళి దర్శకత్వంలో చేయబోయే చిత్రం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా రెండేళ్ల ముందే ఖరారు కాగా.. సెట్స్ మీదికి వెళ్లడానికి ఇంకా సమయం పట్టేలా ఉంది.

రాజమౌళి సినిమా అంటే కథ కోసం ఏడాది.. ప్రీ ప్రొడక్షన్ కోసం ఏడాది.. మేకింగ్ కోసం రెండేళ్లు.. పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఇంకొక ఏడాది సమయం పడుతుంది అన్నది అందరికీ తెలిసిన విషయమే. అందుకే అభిమానులు ఓపిగ్గా ఎదురుచూస్తున్నారు. అయితే ఇందులో ఒక అంకం పూర్తి అయింది అన్నది తాజా కబురు.

మహేష్ బాబు- రాజమౌళి సినిమాకు కథ పూర్తి చేసినట్లుగా రచయిత విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి అడిగితే.. మహేష్ రాజమౌళి సినిమాకు కథ పూర్తి చేసినట్లుగా సింపుల్ గా ఒక మాట చెప్పారు. ఈ వీడియో ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఈ కథ గురించి ఏడాది కాలంగా విజయేంద్రప్రసాద్ హింట్స్ ఇస్తున్నారు కానీ తొలిసారిగా స్క్రిప్ట్ పూర్తయిన విషయం ఇప్పుడే వెల్లడించారు.

కథ పూర్తయిందంటే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జోరందుకున్నట్లే. కాబట్టి మరి కొన్ని నెలల్లో షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా ఇండియానా జోన్స్ తరహా అడ్వెంచరస్ థ్రిల్లర్ అని రాజమౌళి ముందు నుంచి చెబుతున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ నటినటులు, టెక్నీషియన్ల కలయికతో ఈసారి పక్కా ప్రపంచ స్థాయి సినిమాను అందించబోతున్నాడు రాజమౌళి. సీనియర్ నిర్మాత కె.ఎల్ నారాయణ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నారు.

This post was last modified on January 20, 2024 4:04 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏపీ కోరినట్టుగానే.. ‘వాల్తేర్’తోనే విశాఖ రైల్వే జోన్

కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా… అందులో ఎదో ఒక మెలిక ఉండనే ఉంటుంది. ఈ తరహా నిర్ణయాలను కేంద్రం తెలిసి…

1 hour ago

హమ్మయ్యా… బెర్తులన్నీ సేఫ్

తెలంగాణాలో త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే… ఆ వార్తలన్నింటిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

3 hours ago

ర్యాంకులపై వైసీపీ రచ్చ..చంద్రబాబు కౌంటర్

సీఎం చంద్రబాబుపై ఎప్పుడు బురదజల్లుదామా అనే కాన్సెప్ట్ తో వైసీపీ నేతలు రెడీగా ఉంటారని టీడీపీ నేతలు విమర్శిస్తుంటారు. చంద్రబాబు…

7 hours ago

పేదల గుండెకు బాబు సర్కారు భరోసా

ఏపీలోని పేద ప్రజల గుండెకు భరోసా అందించే దిశగా కూటమి సర్కారు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే అమలులోకి…

8 hours ago

రతన్ టాటా మిస్టరీ ట్విస్ట్.. అతని పేరు మీద 500 కోట్లు

ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా చివరి ఉత్తర్వుల్లో అద్భుత ట్విస్ట్ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా కుటుంబ…

9 hours ago

“జ‌గ‌న్‌ది.. పొలిటిక‌ల్ రేప్‌.. నా మాట విను!”

మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయకుడు సాకే శైల‌జానాథ్‌.. తాజాగా వైసీపీ గూటికి చేరారు. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం…

9 hours ago