బాక్సాఫీస్ వద్ద హనుమాన్ తాకిడి ఆగే సూచనలు కనిపించడం లేదు. సంక్రాంతి సెలవులు అయ్యాక బాగా నెమ్మదిస్తుందనుకుంటే దానికి భిన్నంగా వీక్ డేస్ లోనూ హౌస్ ఫుల్స్ రిజిస్టర్ చేయడం ట్రేడ్ ని షాక్ గురి చేస్తోంది. ఇప్పటికే 150 కోట్ల గ్రాస్ ని అఫీషియల్ గా దాటేసిన హనుమాన్ ఫైనల్ రన్ అయ్యేలోపు నమోదు చేయబోయే ఫిగర్లు వణుకు పుట్టించేలా ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 300 కోట్లకు పైగానే వస్తుందని, నార్త్ లో క్రమంగా ఊపందుకోవడం దానికి సూచనగా చెబుతున్నారు. ఓవర్సీస్ లో రంగస్థలం, అల వైకుంఠపురములోని దాటేసింది.
థియేటర్లు, షోలు హనుమాన్ కి ఇబ్బడి ముబ్బడిగా పెంచేస్తున్నారు. మొన్నటిదాకా జిల్లా కేంద్రాల్లో ఇరవై లోపే ఉన్న షోలు ఇప్పుడు ఏకంగా నలభైకి దగ్గరగా వెళ్తున్నాయి. ఇంకోవైపు గుంటూరు కారం కౌంట్ గణనీయంగా తగ్గిపోతోంది. వారాంతంలో మినహాయించి ఇంకెలాంటి మేజిక్ జరగకపోవచ్చని బయ్యర్ల టాక్. దీని సంగతలా ఉంచితే హనుమాన్ శని ఆదివారాల్లో నమోదు చేస్తున్న అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే మైండ్ బ్లాంకే. ముఖ్యంగా హైదరాబాద్ లో నేరుగా కౌంటర్ దగ్గర టికెట్లు కొనే పరిస్థితి ఎంత మాత్రం లేదు. మొత్తం ఆన్ లైన్ లోనే గంటల ముందు ఫుల్ అవుతున్నాయి.
దీనికి తోడు అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ నేపథ్యంలో దేశమంతా ఒకరకమైన ఆధ్యాత్మిక చింతన నెలకొంది. సినిమాల మీద ఆసక్తి ఉన్న జనాలు హనుమాన్ చూసేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. పైగా విడుదలకు ముందే ఊహించిన ఈ సెంటిమెంట్ వర్కౌట్ అవుతోంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జ ఆనందం మాములుగా లేదు. నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ కు కేవలం ఓవర్సీస్ నుంచే పదిహేను కోట్లకు పైగా లాభం రావొచ్చని అంచనా. బాహబలి, ఆర్ఆర్ఆర్ తర్వాత స్థానంలో సలార్ పెట్టిన 8 మిలియన్ టార్గెట్ అందుకోవాలని హనుమాన్ ఫ్యాన్స్ కోరుతున్నారు. ఏమో జరగవచ్చేమో.
This post was last modified on January 20, 2024 2:56 pm
ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…
బాలీవుడ్లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…
నేడు ఉగాది సందర్భంగా కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంగా ప్రారంభమవుతోంది. అయితే “పరాభవం” అనే పదం వినగానే…
ఉద్యోగార్థులకు ఉగాది కానుకగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది. మొత్తం 10,060 పోస్టులతో ఈ క్యాలెండర్ను విడుదల…
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…