తొలి సినిమా అర్జున్ రెడ్డితోనే డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తో బాలీవుడ్ లోనూ అతను సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అయితే బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఆ సినిమాకు బాలీవుడ్ క్రిటిక్స్ చాలా మంది నెగిటివ్ రివ్యూలే ఇవ్వగా.. వాళ్లందరి మీద సందీప్ రెడ్డి తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. సందర్భం వచ్చినప్పుడల్లా క్రిటిక్స్ ను ఏకపడేశాడు. తన లేటెస్ట్ మూవీ యానిమల్ రిలీజ్ అయ్యాక కూడా ఇదే ఒరవడి కొనసాగిస్తున్నాడు. ఈ సినిమాను విమర్శించిన బాలీవుడ్ క్రిటిక్స్ కు.. ఇంటర్వ్యూలలో గట్టి కౌంటర్లు ఇచ్చాడు సందీప్.
తాజాగా మరోసారి బాలీవుడ్ క్రిటిక్స్ ను ఘాటుగా విమర్శించాడు సందీప్. బాలీవుడ్ లో చాలామంది దర్శకుల దగ్గర డబ్బులు తీసుకుని పెయిడ్ రివ్యూలు రాస్తుంటారని.. అలాగే వేరే వాళ్ళ సినిమాలను టార్గెట్ చేస్తుంటారని అన్న సందీప్.. యానిమల్ మూవీని కూడా ఇలాగే లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించాడు. ఈ సినిమాను మూడు గంటలు టార్చర్ గా అభివర్ణించడం అన్యాయం అని.. ఇలా పేర్కొన్న వాళ్ళు ఎవరు ఈ సినిమా సాధించిన ఓపెనింగ్స్ గురించి.. తమ కష్టం గురించి ఎక్కడా ప్రస్తావించలేదని సందీప్ ఆవేదన వ్యక్తం చేశాడు.
యానిమల్ గురించి నెగిటివ్ గా రాసిన, మాట్లాడిన ఎవరికీ సినిమా గురించి అసలు ఏమీ తెలియదని సందీప్ వ్యాఖ్యానించాడు. ఇక బాలీవుడ్ లో నెపోటిజం ఎక్కువే అని.. తమ వాళ్ళ సినిమాలనే ఎక్కువగా ప్రమోట్ చేసుకుంటారని.. అడ్డం వచ్చిన వాళ్ళతో క్రూరంగా వ్యవహరిస్తారని సందీప్ ఆరోపించాడు. బాలీవుడ్లో వివక్ష ఎలా ఉంటుందో అవార్డుల వేడుకల్లో చాలాసార్లు చూశానని.. దాని గురించి మాట్లాడాలంటే రెండు రోజులు పడుతుందని.. కానీ తాను ఈ విషయాల గురించి చిన్న పిల్లాడిలా ఏడవాలనునుకోవడం లేదని సందీప్ అన్నాడు.
హాలీవుడ్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా హారర్ జానర్ పరిచయం చేసిన కల్ట్ సిరీస్ గా 'ఈవిల్ డెడ్' సినిమాకున్న ఆదరణ…
కొన్ని కాకతాళీయంగా జరిగినట్టు అనిపించినా దాని వెనుక తెలుసుకోవాల్సిన బాక్సాఫీస్ సత్యాలు చాలా ఉంటాయి. అలాంటిదే ఇది. ఇండస్ట్రీకి వచ్చి…
నిన్న ధనుష్ తమిళ్ మురుగన్ టీజర్ వచ్చాక మొదట ఆందోళన చెందింది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాలోనూ…
పల్లి పల్లి లోకేశ్... ఇదేం పేరండి బాబూ అని జుట్టు పీక్కుంటున్నారా? అంత అవసరం ఏమీ లేదు. ఇదేమీ రాజకీయ ప్రత్యర్థులో,…
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో ఆదివారం తెల్లవారుజామున దారుణ ఘటన చోటుచేసుకుంది. తనపై నమోదైన పోక్సో కేసుకు ప్రతీకారంగా…
పూరి జగన్నాథ్ సినిమా అంటే ప్రేక్షకుల్లో అదో రకమైన స్పెషల్ క్రేజ్ ఉండేది. స్టార్ హీరోతో చేసినా, కొత్తవాళ్లతో తీసినా…