తొలి సినిమా అర్జున్ రెడ్డితోనే డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తో బాలీవుడ్ లోనూ అతను సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అయితే బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఆ సినిమాకు బాలీవుడ్ క్రిటిక్స్ చాలా మంది నెగిటివ్ రివ్యూలే ఇవ్వగా.. వాళ్లందరి మీద సందీప్ రెడ్డి తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. సందర్భం వచ్చినప్పుడల్లా క్రిటిక్స్ ను ఏకపడేశాడు. తన లేటెస్ట్ మూవీ యానిమల్ రిలీజ్ అయ్యాక కూడా ఇదే ఒరవడి కొనసాగిస్తున్నాడు. ఈ సినిమాను విమర్శించిన బాలీవుడ్ క్రిటిక్స్ కు.. ఇంటర్వ్యూలలో గట్టి కౌంటర్లు ఇచ్చాడు సందీప్.
తాజాగా మరోసారి బాలీవుడ్ క్రిటిక్స్ ను ఘాటుగా విమర్శించాడు సందీప్. బాలీవుడ్ లో చాలామంది దర్శకుల దగ్గర డబ్బులు తీసుకుని పెయిడ్ రివ్యూలు రాస్తుంటారని.. అలాగే వేరే వాళ్ళ సినిమాలను టార్గెట్ చేస్తుంటారని అన్న సందీప్.. యానిమల్ మూవీని కూడా ఇలాగే లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించాడు. ఈ సినిమాను మూడు గంటలు టార్చర్ గా అభివర్ణించడం అన్యాయం అని.. ఇలా పేర్కొన్న వాళ్ళు ఎవరు ఈ సినిమా సాధించిన ఓపెనింగ్స్ గురించి.. తమ కష్టం గురించి ఎక్కడా ప్రస్తావించలేదని సందీప్ ఆవేదన వ్యక్తం చేశాడు.
యానిమల్ గురించి నెగిటివ్ గా రాసిన, మాట్లాడిన ఎవరికీ సినిమా గురించి అసలు ఏమీ తెలియదని సందీప్ వ్యాఖ్యానించాడు. ఇక బాలీవుడ్ లో నెపోటిజం ఎక్కువే అని.. తమ వాళ్ళ సినిమాలనే ఎక్కువగా ప్రమోట్ చేసుకుంటారని.. అడ్డం వచ్చిన వాళ్ళతో క్రూరంగా వ్యవహరిస్తారని సందీప్ ఆరోపించాడు. బాలీవుడ్లో వివక్ష ఎలా ఉంటుందో అవార్డుల వేడుకల్లో చాలాసార్లు చూశానని.. దాని గురించి మాట్లాడాలంటే రెండు రోజులు పడుతుందని.. కానీ తాను ఈ విషయాల గురించి చిన్న పిల్లాడిలా ఏడవాలనునుకోవడం లేదని సందీప్ అన్నాడు.
This post was last modified on January 20, 2024 8:53 am
కేంద్రంలోని బీజేపీతోను.. ఇటు రాష్ట్రంలోని బీజేపీతోనూ కయ్యానికి సుముఖంగా లేమని వైసీపీ స్పష్టం చేస్తోంది. నిజానికి ఆది నుంచి కూడా…
ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఈవీవీ సత్యనారాయణ గారు అలీబాబా అరడజను దొంగలు అనే సినిమా తీశారు. రాజేంద్ర ప్రసాద్…
గత కొంత కాలంగా సౌత్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ తన స్థాయికి తగ్గ మ్యూజిక్ ఇవ్వడం లేదని సంగీత ప్రియులు…
సచిన్ అంటే ఒక బ్రాండ్. అందుకే ఆయన బ్రాండ్ విలువ ఏమాత్రం తగ్గలేదు. దేశంలోని ప్రముఖ కంపెనీలు ఆయనను బ్రాండ్…
``దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చేందుకు మన వాళ్లు తుపాకీ తూటాలకే వెనుకాడలేదు. మీరు ఎంపీ అయి ఉండి.. కోడిగుడ్లకు భయపడతారా?``అంటూ.. తృణమూల్…
ప్రస్తుతం వైసీపీ పెట్టుకున్న లక్ష్యం.. మంత్రి నారా లోకేష్ తో రాజీనామా చేయించడం. గత వారం రోజులుగా ఈ విషయాన్ని…