Movie News

మల్టీప్లెక్సు స్క్రీన్ మీద రామాలయ ఘట్టం

జనవరి 22న అయోధ్యలో జరగబోయే మహా ఘట్టం రామాలయ ప్రారంభోత్సవం కోసం యావత్ దేశం వేయి కళ్ళతో ఎదురు చూస్తోంది. కొన్ని రాష్ట్రాలు అధికారికంగా సగం రోజు సెలవు ప్రకటించాయంటే దీని పట్ల ఎంత ఆసక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంత సుమధుర వేడుకని చిన్ని తెరపై చూస్తే పూర్తిగా ఆస్వాదించలేమని అనుకుంటున్నారా. అయితే ఛలో మల్టీప్లెక్స్ అంటోంది పివిఆర్ ఐనాక్స్ యాజమాన్యం. దేశవ్యాప్తంగా 160కి పైగా స్క్రీన్లలో లైవ్ గా రాముడి ఆగమనాన్ని ప్రదర్శించబోతున్నారు. టైం పరిమితి అంటూ లేదు. జరిగినంత సేపు చూస్తూనే ఉండొచ్చు.

ప్రత్యేకత ఏంటంటే టికెట్ ధర కేవలం 100 రూపాయలు మాత్రమే. అసలు ట్విస్టు మరొకటి ఉంది. ఉచితంగా పాప్ కార్న్ కూడా అందిస్తారు. ఇంకేముంది కిట్టుబాటు కావడానికి ఇంత కన్నా వేరే ఆఫర్ ఏముంటుంది. ప్రముఖ న్యూస్ ఛానల్ ఆజ్ తక్ తో కలిసి పివిఆర్ ఈ స్కీంని తీసుకొచ్చింది. ఇదేదో బాగుందని ఆడియన్స్ అప్పుడే టికెట్లు బుక్ చేసుకోవడం కోసం ఎదురు చూస్తున్నారు. ఎంచక్కా కుషన్ సీట్లలో కూర్చుని, ఇష్టమైన పాప్ కార్న్ తింటూ పెద్ద తెరపై రాముడి దర్శనం చేసుకోవడం కొత్త అనుభూతినిస్తుంది. హైదరాబాద్ సహా అన్ని నగరాల్లోనూ షోలు ఉంటాయి.

గతంలో క్రికెట్ మ్యాచులు ఇలా ప్రసారం చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ ట్రెండ్ ఆలయ ఓపెనింగ్స్ కు వచ్చేసింది. చరిత్రలోనే ఒక అరుదైన సంఘటనగా నిలిచిపోయే రామాలయ ప్రారంభోత్సవ వేడుకని కనివిని ఎరుగని స్థాయిలో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 90 దశకంలో జనాలను భక్తి పారవశ్యంలో ముంచెత్తిన రామాయణం సీరియల్ ని జనవరి 24న పివిఆర్ మల్టీప్లెక్సుల్లో ప్రదర్శించే ప్రతిపాదన ఉంది కానీ వీడియో నాణ్యతలో ఇబ్బందులఉన్న కారణంగా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. సో థియేటర్లో గుడిని చూడాలంటె టికెట్ బుక్ చేసుకోండి మరి.

This post was last modified on January 19, 2024 8:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…

1 hour ago

‘ప్యారడైజ్’ బిర్యాని… ‘సంపూ’ర్ణ వాడకం అంటే ఇది

దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

2 hours ago

జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?

రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…

3 hours ago

బన్నీ-అట్లీ… అప్పుడే ఎందుకీ కన్ఫ్యూజన్

ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…

4 hours ago

అవతార్ 3 టాక్ ఏంటి తేడాగా ఉంది

భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…

5 hours ago

జననాయకుడుకి ట్విస్ట్ ఇస్తున్న పరాశక్తి ?

మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…

6 hours ago