సంక్రాంతి సినిమాల ప్రతి విషయంలో ఎక్కువ కేంద్ర బిందువుగా నిలిచిన గుంటూరు కారం మొదటి వారం పూర్తి చేసుకుంది. 212 కోట్ల గ్రాస్ వచ్చిందని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. సెలవులు పూర్తయి వీక్ డేస్ లో నెమ్మదించడం కనిపిస్తోంది కానీ ఈలోగానే బ్రేక్ ఈవెన్ కు దగ్గరలో ఉన్నామని నిర్మాత నాగవంశీ చెబుతున్నారు. ఇవాళ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన కొన్ని కబుర్లు పంచుకున్నారు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరూ హ్యాపీగా ఉన్నారని, మహేష్ కెరీర్ లో ఇంత పెద్ద హిట్ ఇవ్వడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా పలు అంశాలు ప్రస్తావనకొచ్చాయి.
సలార్ లాంటి మాస్ మూవీకి అర్ధరాత్రి ప్రీమియర్లు వేయడం ప్లస్ అయ్యిందని, కానీ త్రివిక్రమ్ తీసిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కి ఆ పద్ధతి సూట్ కాదని గుర్తించకపోవడం వల్లే సోషల్ మీడియాలో కొంత మిక్స్డ్ టాక్ వచ్చిందని చెప్పిన నాగవంశీ రివ్యూలు, టాకులు ఎలాంటి ప్రభావం చూపించలేదని అంటున్నారు. ఒక మీడియా వర్గం అదే పనిగా టార్గెట్ చేసి, డిస్ట్రిబ్యూటర్లకు ఫోన్ చేసి మరీ కలెక్షన్లు కనుక్కునే దాకా వచ్చారని, కానీ ఎవరెన్ని చేసినా ఫైనల్ గా మంచి విజయం దక్కిందని అన్నారు. నేరుగా ఎవరి గురించో ప్రస్తావన తేలేదు కానీ చురకలు ఎవరికో అన్నట్టు క్లూస్ ఇచ్చినట్టే ఉంది.
మాట్లాడినంత సేపూ హనుమాన్ ఆధిపత్యం తదతర విషయాల ప్రస్తావన రాకుండా కేవలం గుంటూరు కారం గురించే మాట్లాడారు నాగవంశీ. ఈగల్ కోసం టిల్లు స్క్వేర్ వాయిదా వేశాక జరిగిన పరిణామాలు తనకు తెలియదని, ఫిబ్రవరి 9 సోలో రిలీజ్ రాకపోవడం గురించి ఎదురైన ప్రశ్నను దాటవేశారు. ఇదంతా ఎలా ఉన్నా క్షేత్ర స్తాయిలో గుంటూరు కారం స్క్రీన్లు తగ్గిపోయి హనుమాన్ కి పెరిగిన విషయం దాచేది కాదు. తమ సినిమా బ్లాక్ బస్టరని చెబుతున్న నాగవంశీ మాటల ప్రకారం భారీ లాభాలు అందుకుంటే అభిమానులకే కాదు బయ్యర్లకు అంతకన్నా కావాల్సింది ఏముంటుంది.
This post was last modified on January 19, 2024 5:33 pm
కొత్త జిల్లాల ఏర్పాటు అంశం రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఆశలు రేకెత్తించింది. ఈ ప్రభుత్వం అయినా తమకు న్యాయం చేస్తుందని వారు…
ఒక బాలీవుడ్ మూవీ మూడో వారంలోనూ సూపర్ స్ట్రాంగ్ గా ఉండటం చూసి ఎన్ని నెలలయ్యిందో గుర్తు చేసుకోవడం కష్టం.…
అదేంటో కాకతాళీయంగా జరిగినా పరిశ్రమకు సంబంధించిన కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇటీవలే విడుదలైన అఖండ తాండవం 2 ఆశించిన…
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…