అనుకున్నట్టే ఫిబ్రవరి 9 ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారబోతోంది. సంక్రాంతి సినిమాల విడుదల టైంలో ఎక్కువ పోటీ ఉండటం వల్ల పరస్పర ప్రయోజనాలు దెబ్బ తింటాయని, దాని కోసం ఈగల్ ని వాయిదా వేసుకుంటే తర్వాత సోలో రిలీజ్ డేట్ వచ్చేలా చూస్తామని సదరు ప్రొడ్యూసర్ కి నిర్మాతల మండలి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఊహించని విధంగా ఒక్కో కొత్త సినిమా అదే డేట్ కి వస్తున్నామని పోస్టర్లు, ట్రైలర్లు వదులుతుండటంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తమకిచ్చిన మాట నిలబెట్టుకోమంటూ ఈగల్ తరఫున పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ లేఖ రాసింది.
ఫిబ్రవరి 8న యాత్ర 2 రాబోతోంది. యువి క్రియేషన్స్ నిర్మాణ భాగస్వామి కావడంతో మంచి రిలీజ్ దక్కుతుంది. జగన్ బయోపిక్ గా దీని గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరుసటి రోజు ఊరి పేరు భైరవకోన మీద అంచనాలు పెరుగుతున్నాయి. నిన్న జరిగిన ట్రైలర్ లాంచ్ లో హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ పండగ టైంలో తమను ఎవరూ పోస్ట్ పోన్ గురించి సంప్రదించలేదని, ఇప్పుడు నిర్ణయం మార్చుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని చెప్పిన సంగతి తెలిసిందే. వీటికి తోడు రజనీకాంత్ పేరు మీద మార్కెట్ చేస్తున్న లాల్ సలామ్ అదే రోజు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
ఈ నేపథ్యంలో ఈగల్ నిర్మాతల విన్నపం లేదా డిమాండ్ పేరు ఏదైనా సబబుగానే అనిపిస్తోంది. ఆ రోజు టిల్లు స్క్వేర్ వాయిదాకి ఒప్పించామని దిల్ రాజుతో సహా పలువురు పెద్దలు నొక్కి వక్కాణించారు కానీ యాత్ర 2, ఊరు పేరు భైరవకోనలు ఉన్న విషయాన్ని మర్చిపోవడం పలు అనుమానాలకు దారి తీసింది. ఇప్పుడీ లెటర్ కి ఫిలిం ఛాంబర్ ఏ రకంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇంకో తేదీకి వెళ్లే ఛాన్స్ లేనట్టే. పోనీ మిగిలినవాళ్లను ఒప్పిస్తారా అంటే అదంత సులభం కాదు. ఇంటర్వెల్ ట్విస్టు లాగా ఈ సంఘటనలు ఆసక్తికరంగా మారుతున్నాయి. క్లైమాక్స్ ఏమవుతుందో.
This post was last modified on January 19, 2024 12:02 pm
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…