అనుకున్నట్టే ఫిబ్రవరి 9 ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారబోతోంది. సంక్రాంతి సినిమాల విడుదల టైంలో ఎక్కువ పోటీ ఉండటం వల్ల పరస్పర ప్రయోజనాలు దెబ్బ తింటాయని, దాని కోసం ఈగల్ ని వాయిదా వేసుకుంటే తర్వాత సోలో రిలీజ్ డేట్ వచ్చేలా చూస్తామని సదరు ప్రొడ్యూసర్ కి నిర్మాతల మండలి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఊహించని విధంగా ఒక్కో కొత్త సినిమా అదే డేట్ కి వస్తున్నామని పోస్టర్లు, ట్రైలర్లు వదులుతుండటంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తమకిచ్చిన మాట నిలబెట్టుకోమంటూ ఈగల్ తరఫున పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ లేఖ రాసింది.
ఫిబ్రవరి 8న యాత్ర 2 రాబోతోంది. యువి క్రియేషన్స్ నిర్మాణ భాగస్వామి కావడంతో మంచి రిలీజ్ దక్కుతుంది. జగన్ బయోపిక్ గా దీని గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరుసటి రోజు ఊరి పేరు భైరవకోన మీద అంచనాలు పెరుగుతున్నాయి. నిన్న జరిగిన ట్రైలర్ లాంచ్ లో హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ పండగ టైంలో తమను ఎవరూ పోస్ట్ పోన్ గురించి సంప్రదించలేదని, ఇప్పుడు నిర్ణయం మార్చుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని చెప్పిన సంగతి తెలిసిందే. వీటికి తోడు రజనీకాంత్ పేరు మీద మార్కెట్ చేస్తున్న లాల్ సలామ్ అదే రోజు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
ఈ నేపథ్యంలో ఈగల్ నిర్మాతల విన్నపం లేదా డిమాండ్ పేరు ఏదైనా సబబుగానే అనిపిస్తోంది. ఆ రోజు టిల్లు స్క్వేర్ వాయిదాకి ఒప్పించామని దిల్ రాజుతో సహా పలువురు పెద్దలు నొక్కి వక్కాణించారు కానీ యాత్ర 2, ఊరు పేరు భైరవకోనలు ఉన్న విషయాన్ని మర్చిపోవడం పలు అనుమానాలకు దారి తీసింది. ఇప్పుడీ లెటర్ కి ఫిలిం ఛాంబర్ ఏ రకంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇంకో తేదీకి వెళ్లే ఛాన్స్ లేనట్టే. పోనీ మిగిలినవాళ్లను ఒప్పిస్తారా అంటే అదంత సులభం కాదు. ఇంటర్వెల్ ట్విస్టు లాగా ఈ సంఘటనలు ఆసక్తికరంగా మారుతున్నాయి. క్లైమాక్స్ ఏమవుతుందో.
This post was last modified on January 19, 2024 12:02 pm
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…