ఎనర్జిటిక్ స్టార్ రామ్ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతున్న డబుల్ ఇస్మార్ట్ విడుదల తేదీ మార్చి 8గా ఎప్పుడో లాక్ చేసుకుని అధికారికంగా ప్రకటించారు. వేగంగా తీయడంలో స్పెషలిస్ట్ అయిన పూరి ఖచ్చితంగా డెడ్ లైన్ ని అందుకుంటాడనే ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ ఈసారి సాధ్యం కాకపోవచ్చని వినిపిస్తోంది. ఇంకో నలభై రోజుల దాకా షూటింగ్ పెండింగ్ ఉండటంతో తొందరపడి హడావిడి చేయడం కంటే క్వాలిటీ మిస్ కాకుండా చూడాలని పూరి, రామ్ ఇద్దరూ నిర్ణయించుకోవడంతో పోస్ట్ పోన్ లాంఛనమేనని తెలుస్తోంది. త్వరలో అధికారికం కావొచ్చు.
ఒకవేళ అలా జరిగితే విశ్వక్ సేన్ కి పెద్ద రిలీఫ్ దక్కుతుంది. ఎందుకంటే అదే డేట్ కి గ్యాంగ్స్ అఫ్ గోదావరి సిద్ధంగా ఉంది. ఈ సినిమా మీద బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. డిసెంబర్ లోనే రావాల్సి ఉన్నా సలార్ వల్ల హాయ్ నాన్న, ఎక్స్ ట్రాడినరి మ్యాన్ లు ముందుకు వచ్చేయడంతో పాటు చివరి నిమిషంలో పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కావడంతో తప్పుకున్నాడు. ఇప్పుడు మార్చ్ 8కి ఎలాంటి అడ్డంకులు లేనట్టే. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ పీరియాడిక్ విలేజ్ డ్రామాని సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించింది. థియేట్రికల్ బిజినెస్ ఆఫర్లు బాగా వస్తున్నాయి.
డబుల్ ఇస్మార్ట్ కున్న ఇంకో సమస్య ప్రమోషన్లు. మార్చిలోనే రిలీజ్ చేయాలంటే వచ్చే నెల మూడో వారంలోపే చిత్రీకరణ పూర్తి చేయాలి. ప్రమోషన్లకు ఎంత లేదన్నా నెల రోజులు అవసరం. అంత టైం దొరకదు. పైగా లైగర్ డిజాస్టర్ కి తగిన సమాధానం డబుల్ ఇస్మార్ట్ తో చెప్పాలని పూరి కసితో ఉన్నాడు. స్కంద విషయంలో ఏకంగా ట్రోలింగ్ ని చవి చూడాల్సి వచ్చిన రామ్ కు సైతం ఈ ప్రాజెక్ట్ కీలకం. సంజయ్ దత్ విలనిజం. మణిశర్మ సంగీతం ఇలా బోలెడు ఆకర్షణలున్నాయి. సో ఈసారికి నిదానమే ప్రధానం మంచిదే. సో టీమ్ నుంచి న్యూస్ వచ్చే దాకా ఫ్యాన్స్ వెయిట్ చేయక తప్పదు.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…