ఇంకో పది రోజుల్లో ఓటిటి వెర్షన్ రిలీజయ్యాక రిపీట్ షోలు వేసుకుని ఎంజాయ్ చేయాలని చూస్తున్న మూవీ లవర్స్ కి షాక్ తప్పకపోవచ్చని ముంబై టాక్. యానిమల్ హక్కులకు సంబంధించి నిర్మాణ భాగస్వామిగా ఉన్న సినీ 1 స్టూడియోస్ ఢిల్లీ కోర్టులో కేసు వేయడం ఒక్కసారిగా వాతావరణాన్ని వేడెక్కించింది. దీని అధినేత మురద్ ఖేతాని తనకు టి సిరీస్ నుంచి బిజినెస్ కు సంబంధించిన సరైన సమాచారం రాలేదని, వాటిని అందించకుండానే నెట్ ఫ్లిక్స్ కి డిజిటల్ హక్కులు అమ్మేసి ఓటిటి ప్రీమియర్ కు రంగం సిద్ధం చేశారని ఆరోపిస్తూ పిటీషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది.
యానిమల్ లో దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో పాటు అతని సోదరుడు ప్రణయ్ కూడా భాగస్వామి కాబట్టి వాళ్ళను కూడా ప్రతివాదులుగా చేర్చారు. థియేట్రికల్ రిలీజ్ అయిన 70 రోజుల లోపు తమకు అందించాల్సిన రెవిన్యూ స్టేట్ మెంట్ ఇప్పటిదాకా ఇవ్వలేదని, అందుకే ఓటిటి రిలీజ్ ఆపాలని అందులో పేర్కొన్నారు. టి సిరీస్ తరఫున వాదనలు కూడా బలంగా ఉన్నాయి. సినీ 1కి తాము ఎప్పుడూ అందుబాటులోనే ఉన్నామని, ఒప్పందాలకు సంబంధించిన సమాచారం షేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నా వాళ్ళే సమయానుకూలంగా స్పందించలేదని కౌంటర్లు ఇస్తున్నారు.
ఇండస్ట్రీ టాక్ మాత్రం సాధారణంగా ఇలాంటి పార్ట్ నర్ షిప్ వ్యవహారాలను ఆరు నెలల తర్వాత చూసుకుంటారని, సినీ 1 తొందరపడి కోర్టు మెట్లు ఎక్కిందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి కానీ నెట్ ఫ్లిక్స్ కి ఓటిటి రిలీజ్ ఆపమని మాత్రం ఎలాంటి ఉత్తర్వులు రాలేదట. జనవరి 26 నుంచి స్ట్రీమింగ్ జరగొచ్చనే టాక్ ఆల్రెడీ ఉంది. కోర్టులో తదుపరి హియరింగ్ జనవరి 18 అంటే రేపు జరగబోతోంది. ఒకవేళ ఎక్కువ వాయిదాలు పడితే మాత్రం ఈ నెలాఖరులో యానిమల్ ని స్మార్ట్ స్క్రీన్ల మీద చూసుకోవడం అనుమానమేనని నార్త్ మీడియా రిపోర్ట్.
This post was last modified on January 17, 2024 7:08 pm
ఏప్రిల్ 30 విడుదల కాబోతున్న పెద్ది బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. రెండు పాటలు ఛార్ట్ బస్టర్ కావడం, టీజర్ సంచలనం…
అనుదీప్ కేవీ.. ఐదేళ్ల ముందు ఈ పేరు ఒక సంచలనం. కొవిడ్ వల్ల కళ తప్పిన థియేటర్లలో సందడి తీసుకొచ్చి,…
టీమ్ఇండియా మరోసారి ప్రపంచ విజేతగా నిలిచింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో…
దురంధర్ షూటింగ్ జరుగుతున్న టైంలో ఎలాంటి హడావిడి లేదు. ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా సందడి లేదు. రిలీజ్…
ఉస్తాద్ భగత్ సింగ్ కు మార్చి 18 రాత్రి నుంచే ప్రీమియర్లు ఉంటాయనే వార్త మొన్నటి నుంచి చక్కర్లు కొడుతోంది.…
స్టార్ హీరోల ఈవెంట్లలో అభిమానులు ఎంత హడావుడి చేస్తారో టాలీవుడ్ సినిమా ఈవెంట్లు చూసే వాళ్లకు కొత్తగా చెప్పాల్సిన పని…