Movie News

యానిమల్ బృందానికి కొత్త టెన్షన్

ఇంకో పది రోజుల్లో ఓటిటి వెర్షన్ రిలీజయ్యాక రిపీట్ షోలు వేసుకుని ఎంజాయ్ చేయాలని చూస్తున్న మూవీ లవర్స్ కి షాక్ తప్పకపోవచ్చని ముంబై టాక్. యానిమల్ హక్కులకు సంబంధించి నిర్మాణ భాగస్వామిగా ఉన్న సినీ 1 స్టూడియోస్ ఢిల్లీ కోర్టులో కేసు వేయడం ఒక్కసారిగా వాతావరణాన్ని వేడెక్కించింది. దీని అధినేత మురద్ ఖేతాని తనకు టి సిరీస్ నుంచి బిజినెస్ కు సంబంధించిన సరైన సమాచారం రాలేదని, వాటిని అందించకుండానే నెట్ ఫ్లిక్స్ కి డిజిటల్ హక్కులు అమ్మేసి ఓటిటి ప్రీమియర్ కు రంగం సిద్ధం చేశారని ఆరోపిస్తూ పిటీషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది.

యానిమల్ లో దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో పాటు అతని సోదరుడు ప్రణయ్ కూడా భాగస్వామి కాబట్టి వాళ్ళను కూడా ప్రతివాదులుగా చేర్చారు. థియేట్రికల్ రిలీజ్ అయిన 70 రోజుల లోపు తమకు అందించాల్సిన రెవిన్యూ స్టేట్ మెంట్ ఇప్పటిదాకా ఇవ్వలేదని, అందుకే ఓటిటి రిలీజ్ ఆపాలని అందులో పేర్కొన్నారు. టి సిరీస్ తరఫున వాదనలు కూడా బలంగా ఉన్నాయి. సినీ 1కి తాము ఎప్పుడూ అందుబాటులోనే ఉన్నామని, ఒప్పందాలకు సంబంధించిన సమాచారం షేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నా వాళ్ళే సమయానుకూలంగా స్పందించలేదని కౌంటర్లు ఇస్తున్నారు.

ఇండస్ట్రీ టాక్ మాత్రం సాధారణంగా ఇలాంటి పార్ట్ నర్ షిప్ వ్యవహారాలను ఆరు నెలల తర్వాత చూసుకుంటారని, సినీ 1 తొందరపడి కోర్టు మెట్లు ఎక్కిందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి కానీ నెట్ ఫ్లిక్స్ కి ఓటిటి రిలీజ్ ఆపమని మాత్రం ఎలాంటి ఉత్తర్వులు రాలేదట. జనవరి 26 నుంచి స్ట్రీమింగ్ జరగొచ్చనే టాక్ ఆల్రెడీ ఉంది. కోర్టులో తదుపరి హియరింగ్ జనవరి 18 అంటే రేపు జరగబోతోంది. ఒకవేళ ఎక్కువ వాయిదాలు పడితే మాత్రం ఈ నెలాఖరులో యానిమల్ ని స్మార్ట్ స్క్రీన్ల మీద చూసుకోవడం అనుమానమేనని నార్త్ మీడియా రిపోర్ట్. 

This post was last modified on January 17, 2024 7:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ట్రంప్ ఇమేజ్ ఎంత దారుణంగా పడిదంటే

అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…

1 hour ago

జగన్ ‘మావిగన్’… ట్రోల్ మెటీరియల్ అయిందే

‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…

1 hour ago

ప్రీమియర్ల నుంచే హడావిడి మొదలు

కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…

3 hours ago

హ్యాపీగా వస్తే ఎవరూ పట్టించుకోలేదు

జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…

4 hours ago

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

6 hours ago

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంచు విష్ణు కౌంటర్

టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…

6 hours ago