ఇంకో పది రోజుల్లో ఓటిటి వెర్షన్ రిలీజయ్యాక రిపీట్ షోలు వేసుకుని ఎంజాయ్ చేయాలని చూస్తున్న మూవీ లవర్స్ కి షాక్ తప్పకపోవచ్చని ముంబై టాక్. యానిమల్ హక్కులకు సంబంధించి నిర్మాణ భాగస్వామిగా ఉన్న సినీ 1 స్టూడియోస్ ఢిల్లీ కోర్టులో కేసు వేయడం ఒక్కసారిగా వాతావరణాన్ని వేడెక్కించింది. దీని అధినేత మురద్ ఖేతాని తనకు టి సిరీస్ నుంచి బిజినెస్ కు సంబంధించిన సరైన సమాచారం రాలేదని, వాటిని అందించకుండానే నెట్ ఫ్లిక్స్ కి డిజిటల్ హక్కులు అమ్మేసి ఓటిటి ప్రీమియర్ కు రంగం సిద్ధం చేశారని ఆరోపిస్తూ పిటీషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది.
యానిమల్ లో దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో పాటు అతని సోదరుడు ప్రణయ్ కూడా భాగస్వామి కాబట్టి వాళ్ళను కూడా ప్రతివాదులుగా చేర్చారు. థియేట్రికల్ రిలీజ్ అయిన 70 రోజుల లోపు తమకు అందించాల్సిన రెవిన్యూ స్టేట్ మెంట్ ఇప్పటిదాకా ఇవ్వలేదని, అందుకే ఓటిటి రిలీజ్ ఆపాలని అందులో పేర్కొన్నారు. టి సిరీస్ తరఫున వాదనలు కూడా బలంగా ఉన్నాయి. సినీ 1కి తాము ఎప్పుడూ అందుబాటులోనే ఉన్నామని, ఒప్పందాలకు సంబంధించిన సమాచారం షేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నా వాళ్ళే సమయానుకూలంగా స్పందించలేదని కౌంటర్లు ఇస్తున్నారు.
ఇండస్ట్రీ టాక్ మాత్రం సాధారణంగా ఇలాంటి పార్ట్ నర్ షిప్ వ్యవహారాలను ఆరు నెలల తర్వాత చూసుకుంటారని, సినీ 1 తొందరపడి కోర్టు మెట్లు ఎక్కిందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి కానీ నెట్ ఫ్లిక్స్ కి ఓటిటి రిలీజ్ ఆపమని మాత్రం ఎలాంటి ఉత్తర్వులు రాలేదట. జనవరి 26 నుంచి స్ట్రీమింగ్ జరగొచ్చనే టాక్ ఆల్రెడీ ఉంది. కోర్టులో తదుపరి హియరింగ్ జనవరి 18 అంటే రేపు జరగబోతోంది. ఒకవేళ ఎక్కువ వాయిదాలు పడితే మాత్రం ఈ నెలాఖరులో యానిమల్ ని స్మార్ట్ స్క్రీన్ల మీద చూసుకోవడం అనుమానమేనని నార్త్ మీడియా రిపోర్ట్.
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…