జస్టిస్ ఫర్ సుషాంత్ అంటూ పుట్టుకొచ్చిన ‘ఆర్మీ’ బాలీవుడ్లో ఎవరికీ నిద్ర వుండనివ్వడం లేదు. ఇప్పటికే సినిమా నటుల వారసులు, ఆ వారసులతో సినిమాలు తీసేవాళ్లు సోషల్ మీడియాకి దూరంగా వుంటున్నారు. ఇక వీళ్లతో ఆల్రెడీ సినిమాలు తీస్తోన్న వాళ్లు రేపు ఆ సినిమాలు రిలీజ్ అయినపుడు ఎక్కడ నెగెటివ్ ఫీడ్బ్యాక్ వస్తుందోనని హడలిపోతున్నారు. ఇంకా షూటింగ్ అయినా మొదలు కాని ప్రభాస్ ‘ఆది పురుష్’ చిత్రానికి కూడా ఈ సెగ తగిలేసింది.
ఇందులో విలన్గా, అంటే రావణుడిగా, ‘లంకేష్’ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించనున్నాడు. సుషాంత్ సింగ్కి గతంలో సైఫ్ కూతురు సారా అలీ ఖాన్తో రిలేషన్ వుందని మీడియా ఇన్వెస్టిగేషన్లో తేలడంతో వాళ్లిద్దరూ విడిపోవడానికి సైఫ్ అలీ ఖాన్ కారణమని అతనిపై నిరసన వ్యక్తమవుతోంది. సరిగ్గా ఈ టైమ్లో అతను ‘ఆది పురుష్’లో నటిస్తున్నాడనే వార్త అధికారికంగా రావడంతో లంకేష్ని మార్చాలనే విన్నపాలు మిన్నంటుతున్నాయి. ఖాన్స్ కి ప్రత్యామ్నాయంగా ప్రభాస్ని కొందరు చూస్తున్నారు.
ఇప్పుడతని సినిమాలో ఒక ఖాన్ నటించడం వారికి నచ్చడం లేదు. మరికొందరు సైఫ్కి అసలు చరిత్ర గురించి ఏమి తెలుసని అతడీ పాత్ర పోషించడానికి అర్హుడంటూ వాదిస్తున్నారు. మరోవైపు తెలుగు మాస్ ఆడియన్స్ కి అతడెవరో తెలియదు కనుక అంత కీలకమైన పాత్ర అతనితో చేయిస్తే నేటివిటీ సమస్యలు తలెత్తుతాయని ప్రభాస్ అభిమానులు ఈ ఛాయిస్ పట్ల హ్యాపీగా లేరు.
This post was last modified on September 5, 2020 12:01 am
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…