Movie News

ప్రభాస్‍ ‘ఆదిపురుష్‍’కీ సెగ తగిలేసింది

జస్టిస్‍ ఫర్‍ సుషాంత్‍ అంటూ పుట్టుకొచ్చిన ‘ఆర్మీ’ బాలీవుడ్‍లో ఎవరికీ నిద్ర వుండనివ్వడం లేదు. ఇప్పటికే సినిమా నటుల వారసులు, ఆ వారసులతో సినిమాలు తీసేవాళ్లు సోషల్‍ మీడియాకి దూరంగా వుంటున్నారు. ఇక వీళ్లతో ఆల్రెడీ సినిమాలు తీస్తోన్న వాళ్లు రేపు ఆ సినిమాలు రిలీజ్‍ అయినపుడు ఎక్కడ నెగెటివ్‍ ఫీడ్‍బ్యాక్‍ వస్తుందోనని హడలిపోతున్నారు. ఇంకా షూటింగ్‍ అయినా మొదలు కాని ప్రభాస్‍ ‘ఆది పురుష్‍’ చిత్రానికి కూడా ఈ సెగ తగిలేసింది.

ఇందులో విలన్‍గా, అంటే రావణుడిగా, ‘లంకేష్‍’ పాత్రలో సైఫ్‍ అలీ ఖాన్‍ నటించనున్నాడు. సుషాంత్‍ సింగ్‍కి గతంలో సైఫ్‍ కూతురు సారా అలీ ఖాన్‍తో రిలేషన్‍ వుందని మీడియా ఇన్వెస్టిగేషన్‍లో తేలడంతో వాళ్లిద్దరూ విడిపోవడానికి సైఫ్‍ అలీ ఖాన్‍ కారణమని అతనిపై నిరసన వ్యక్తమవుతోంది. సరిగ్గా ఈ టైమ్‍లో అతను ‘ఆది పురుష్‍’లో నటిస్తున్నాడనే వార్త అధికారికంగా రావడంతో లంకేష్‍ని మార్చాలనే విన్నపాలు మిన్నంటుతున్నాయి. ఖాన్స్ కి ప్రత్యామ్నాయంగా ప్రభాస్‍ని కొందరు చూస్తున్నారు.

ఇప్పుడతని సినిమాలో ఒక ఖాన్‍ నటించడం వారికి నచ్చడం లేదు. మరికొందరు సైఫ్‍కి అసలు చరిత్ర గురించి ఏమి తెలుసని అతడీ పాత్ర పోషించడానికి అర్హుడంటూ వాదిస్తున్నారు. మరోవైపు తెలుగు మాస్‍ ఆడియన్స్ కి అతడెవరో తెలియదు కనుక అంత కీలకమైన పాత్ర అతనితో చేయిస్తే నేటివిటీ సమస్యలు తలెత్తుతాయని ప్రభాస్‍ అభిమానులు ఈ ఛాయిస్‍ పట్ల హ్యాపీగా లేరు.

This post was last modified on September 5, 2020 12:01 am

Share
Show comments
Published by
suman

Recent Posts

బాబీ గారు… ప్రేక్షకులు ఎప్పుడైనా రైటే

భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…

5 hours ago

‘ఇవేవీ తెలియకుండా జగన్ సీఎం ఎలా అయ్యాడో’

వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…

6 hours ago

అఫీషియల్: తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ

తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…

6 hours ago

‘నువ్వు బ‌జారోడివి కాదు’… అనిల్ మీమ్ పంచ్

సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయ‌డంలో తెలుగు వాళ్ల‌ను మించిన వాళ్లు ఇంకెవ్వ‌రూ ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. కొన్ని మీమ్స్…

7 hours ago

జగన్ చేతులు కాల్చాకా నేతలు ఆకులు పట్టుకున్నారు

అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…

8 hours ago

కైట్ కుర్రోళ్లు… ఇప్పటికైనా అర్థం చేసుకోండి

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…

9 hours ago