జస్టిస్ ఫర్ సుషాంత్ అంటూ పుట్టుకొచ్చిన ‘ఆర్మీ’ బాలీవుడ్లో ఎవరికీ నిద్ర వుండనివ్వడం లేదు. ఇప్పటికే సినిమా నటుల వారసులు, ఆ వారసులతో సినిమాలు తీసేవాళ్లు సోషల్ మీడియాకి దూరంగా వుంటున్నారు. ఇక వీళ్లతో ఆల్రెడీ సినిమాలు తీస్తోన్న వాళ్లు రేపు ఆ సినిమాలు రిలీజ్ అయినపుడు ఎక్కడ నెగెటివ్ ఫీడ్బ్యాక్ వస్తుందోనని హడలిపోతున్నారు. ఇంకా షూటింగ్ అయినా మొదలు కాని ప్రభాస్ ‘ఆది పురుష్’ చిత్రానికి కూడా ఈ సెగ తగిలేసింది.
ఇందులో విలన్గా, అంటే రావణుడిగా, ‘లంకేష్’ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించనున్నాడు. సుషాంత్ సింగ్కి గతంలో సైఫ్ కూతురు సారా అలీ ఖాన్తో రిలేషన్ వుందని మీడియా ఇన్వెస్టిగేషన్లో తేలడంతో వాళ్లిద్దరూ విడిపోవడానికి సైఫ్ అలీ ఖాన్ కారణమని అతనిపై నిరసన వ్యక్తమవుతోంది. సరిగ్గా ఈ టైమ్లో అతను ‘ఆది పురుష్’లో నటిస్తున్నాడనే వార్త అధికారికంగా రావడంతో లంకేష్ని మార్చాలనే విన్నపాలు మిన్నంటుతున్నాయి. ఖాన్స్ కి ప్రత్యామ్నాయంగా ప్రభాస్ని కొందరు చూస్తున్నారు.
ఇప్పుడతని సినిమాలో ఒక ఖాన్ నటించడం వారికి నచ్చడం లేదు. మరికొందరు సైఫ్కి అసలు చరిత్ర గురించి ఏమి తెలుసని అతడీ పాత్ర పోషించడానికి అర్హుడంటూ వాదిస్తున్నారు. మరోవైపు తెలుగు మాస్ ఆడియన్స్ కి అతడెవరో తెలియదు కనుక అంత కీలకమైన పాత్ర అతనితో చేయిస్తే నేటివిటీ సమస్యలు తలెత్తుతాయని ప్రభాస్ అభిమానులు ఈ ఛాయిస్ పట్ల హ్యాపీగా లేరు.
This post was last modified on September 5, 2020 12:01 am
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చిన్నపాటి బాంబు పేల్చారు. ఇప్పటిదాకా…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో ఆదివారం జరిగిన జనసేన బహిరంగ సభ…
ఒకరేమో ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ ఫైవ్ లో కొనసాగుతున్నారు. మరొకరేమో... భారత ఐటీ రంగానికి సరికొత్త ఊపిరి ఊదిన…
దసరా బ్లాక్ బస్టర్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చేతులు కలిపిన సంగతి…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శనివారం రాయచోటిలో జరిపిన పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఘటనపై సోషల్…
యానిమల్ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఏడాది గ్యాప్ వచ్చేసింది. ప్రభాస్ కోసం స్పిరిట్ స్క్రిప్ట్…