జస్టిస్ ఫర్ సుషాంత్ అంటూ పుట్టుకొచ్చిన ‘ఆర్మీ’ బాలీవుడ్లో ఎవరికీ నిద్ర వుండనివ్వడం లేదు. ఇప్పటికే సినిమా నటుల వారసులు, ఆ వారసులతో సినిమాలు తీసేవాళ్లు సోషల్ మీడియాకి దూరంగా వుంటున్నారు. ఇక వీళ్లతో ఆల్రెడీ సినిమాలు తీస్తోన్న వాళ్లు రేపు ఆ సినిమాలు రిలీజ్ అయినపుడు ఎక్కడ నెగెటివ్ ఫీడ్బ్యాక్ వస్తుందోనని హడలిపోతున్నారు. ఇంకా షూటింగ్ అయినా మొదలు కాని ప్రభాస్ ‘ఆది పురుష్’ చిత్రానికి కూడా ఈ సెగ తగిలేసింది.
ఇందులో విలన్గా, అంటే రావణుడిగా, ‘లంకేష్’ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించనున్నాడు. సుషాంత్ సింగ్కి గతంలో సైఫ్ కూతురు సారా అలీ ఖాన్తో రిలేషన్ వుందని మీడియా ఇన్వెస్టిగేషన్లో తేలడంతో వాళ్లిద్దరూ విడిపోవడానికి సైఫ్ అలీ ఖాన్ కారణమని అతనిపై నిరసన వ్యక్తమవుతోంది. సరిగ్గా ఈ టైమ్లో అతను ‘ఆది పురుష్’లో నటిస్తున్నాడనే వార్త అధికారికంగా రావడంతో లంకేష్ని మార్చాలనే విన్నపాలు మిన్నంటుతున్నాయి. ఖాన్స్ కి ప్రత్యామ్నాయంగా ప్రభాస్ని కొందరు చూస్తున్నారు.
ఇప్పుడతని సినిమాలో ఒక ఖాన్ నటించడం వారికి నచ్చడం లేదు. మరికొందరు సైఫ్కి అసలు చరిత్ర గురించి ఏమి తెలుసని అతడీ పాత్ర పోషించడానికి అర్హుడంటూ వాదిస్తున్నారు. మరోవైపు తెలుగు మాస్ ఆడియన్స్ కి అతడెవరో తెలియదు కనుక అంత కీలకమైన పాత్ర అతనితో చేయిస్తే నేటివిటీ సమస్యలు తలెత్తుతాయని ప్రభాస్ అభిమానులు ఈ ఛాయిస్ పట్ల హ్యాపీగా లేరు.
This post was last modified on September 5, 2020 12:01 am
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…