సుషాంత్ సింగ్ రాజ్పుట్ ఆత్మహత్య చేసుకుని మరణించాడా లేక మర్డర్ చేసారా అనే కోణంలో సిబిఐ కొన్నాళ్లుగా దర్యాప్తు జరుపుతోంది. రియా చక్రవర్తితో పాటు చాలా మందిని విచారించింది. సుషాంత్ భయంకరమయిన మానసిక రుగ్మతతో పోరాడుతున్నాడని, అతడికి ఎప్పట్నుంచో మానసిక సంబంధిత సమస్యలున్నాయని సిబిఐ గుర్తించింది. అతడు అలా మారిపోవడానికి రియా కుట్ర చేసిందనే కోణంలోను సిబిఐ విచారణ జరిపినా కానీ ఆమె అలా చేసిందనే దానికి సిబిఐ ఎలాంటి అనుమానిత విషయాలు కనుగొనలేదని సమాచారం.
సుషాంత్ మరణంలో పాత్ర కానీ, అతని డబ్బులు దుర్వినియోగం చేసిందనే ఆరోపణల పరంగా కానీ సిబిఐకి రియా చక్రవర్తి దోషి అనడానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అయితే ఈ గొడవలో రియాతో పాటు ఆమె సోదరుడు కూడా డ్రగ్స్ వినియోగం విషయంలో మాత్రం అడ్డంగా దొరికిపోయారు. వీరు వున్న వాట్సాప్ గ్రూపుల్లో చాట్స్, వీళ్ల పర్సనల్ చాట్స్ లో కూడా పలుమార్లు డ్రగ్స్ ప్రస్తావన వుండడంతో ఆ కేసు మాత్రం మెడకు చుట్టుకునేలా వుంది.
మరి ఈ ఛార్జస్ ఎంత తీవ్రంగా వుంటాయో, దీంట్లో రియాకు ఎన్నాళ్ల శిక్ష పడుతుందో తెలియదు కానీ సుషాంత్ అభిమానులు మాత్రం అతడిది ఆత్మహత్యే అనే వాదనను ఇప్పటికీ అంగీకరించడం లేదు.
This post was last modified on September 7, 2020 1:25 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…