సుషాంత్ సింగ్ రాజ్పుట్ ఆత్మహత్య చేసుకుని మరణించాడా లేక మర్డర్ చేసారా అనే కోణంలో సిబిఐ కొన్నాళ్లుగా దర్యాప్తు జరుపుతోంది. రియా చక్రవర్తితో పాటు చాలా మందిని విచారించింది. సుషాంత్ భయంకరమయిన మానసిక రుగ్మతతో పోరాడుతున్నాడని, అతడికి ఎప్పట్నుంచో మానసిక సంబంధిత సమస్యలున్నాయని సిబిఐ గుర్తించింది. అతడు అలా మారిపోవడానికి రియా కుట్ర చేసిందనే కోణంలోను సిబిఐ విచారణ జరిపినా కానీ ఆమె అలా చేసిందనే దానికి సిబిఐ ఎలాంటి అనుమానిత విషయాలు కనుగొనలేదని సమాచారం.
సుషాంత్ మరణంలో పాత్ర కానీ, అతని డబ్బులు దుర్వినియోగం చేసిందనే ఆరోపణల పరంగా కానీ సిబిఐకి రియా చక్రవర్తి దోషి అనడానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అయితే ఈ గొడవలో రియాతో పాటు ఆమె సోదరుడు కూడా డ్రగ్స్ వినియోగం విషయంలో మాత్రం అడ్డంగా దొరికిపోయారు. వీరు వున్న వాట్సాప్ గ్రూపుల్లో చాట్స్, వీళ్ల పర్సనల్ చాట్స్ లో కూడా పలుమార్లు డ్రగ్స్ ప్రస్తావన వుండడంతో ఆ కేసు మాత్రం మెడకు చుట్టుకునేలా వుంది.
మరి ఈ ఛార్జస్ ఎంత తీవ్రంగా వుంటాయో, దీంట్లో రియాకు ఎన్నాళ్ల శిక్ష పడుతుందో తెలియదు కానీ సుషాంత్ అభిమానులు మాత్రం అతడిది ఆత్మహత్యే అనే వాదనను ఇప్పటికీ అంగీకరించడం లేదు.
This post was last modified on September 7, 2020 1:25 am
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…
ఏపీలో వచ్చే మూడు మాసాల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నాయకులు అలెర్టుగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు.…