సంక్రాంతి కోడిపుంజులన్నీ దిగిపోయాయి. విన్నర్ ఎవరో క్లారిటీ వచ్చేసింది. హనుమాన్ కి బ్రహ్మరథం పడుతూ ప్రేక్షకులు తీర్పిచ్చారు. నిజానికీ నాలుగు సినిమాలతో పాటు ఈగల్ కూడా రావాల్సింది. కానీ రవితేజ పూనుకోవడంతో వాయిదా పడింది. అదెంత గొప్ప నిర్ణయమో కళ్ళెదురుగా కనిపిస్తుంటే ఎవరు మాత్రం కాదంటారు. నిజానికి జనవరి మొదటి వారం దాకా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ టిజి విశ్వప్రసాద్ థియేటర్లు తక్కువ దొరికినా సరే ఖచ్చితంగా విడుదల చేయాలనే సంకల్పంతో ఉన్నారు. దానికి తగ్గట్టే కొత్త పోస్టర్లు ఎప్పటికప్పుడు వదులుతూనే వచ్చారు. నిర్మాత మండలి జోక్యంతో మనసు మార్చుకున్నారు.
కట్ చేస్తే పండక్కు ఎలాంటి సినిమాలకు ఆదరణ దక్కుతోందో వసూళ్లు తేల్చి చెప్పాయి. హనుమాన్ ని పక్కన పెడితే నా సామిరంగకు మాస్ సెంటర్స్ లో మంచి కలెక్షన్లు వస్తున్నాయి. నాగ్ గత మూడేళ్ళలో ఇంత పెద్ద నెంబర్లు చూడలేదన్నది నిజం. ఆయన నమ్మకాన్ని విజయ్ బిన్నీ నిలబెట్టాడు. ఇక గుంటూరు కారం టాక్ తో తనకేం పని లేదన్నట్టు ఫ్యామిలీస్ ని బాగానే లాగుతోంది. నిర్మాత సంస్థ నూటా ఇరవై కోట్లు వచ్చేశాయని చెప్పింది. గ్రౌండ్ లెవెల్ లో షోలు తగ్గిపోవడం దాచలేరు కానీ మెయిన్ సెంటర్స్ లో మాత్రం ఆక్యుపెన్సీలు చాలా బాగున్నాయి. గురువారం నుంచి చూడాలి.
ఒకవేళ ఈగల్ కనక ఈ హడావిడిలో దిగి ఉంటే సైంధవ్ లాగా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వచ్చేది. పూర్తి యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాని ప్రాధాన్యత క్రమంలో ఆడియన్స్ నాలుగో స్థానంలో పెట్టేశారు. టాక్ కూడా ఏమంత ఆశాజనకంగా లేదు. హౌస్ ఫుల్స్ పడుతున్న దాఖలాలు తక్కువగా ఉన్నాయి. సీరియస్ నెస్ ఎక్కువ ఉన్న సినిమా కావడంతో జనాలు కాస్త దూరంగానే ఉన్నారు. ఈగల్ బ్యాక్ డ్రాప్, స్టోరీ వేరే అయినప్పటికీ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ కాదు. సో చక్కగా తప్పుకుని ఫిబ్రవరికి వెళ్లడం వల్ల మాస్ మహారాజా తనకు తానే కాదు మిగిలిన వాళ్లకూ మేలే చేశాడు.
This post was last modified on January 15, 2024 9:53 am
ఇటీవలే కాంతారావు పురస్కారం అందుకున్న సందర్భంగా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తమిళ లెజెండరీ నటులు ఎంజీఆర్ ని ఉద్దేశించి అన్న…
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…