Movie News

ప్రభాస్ మారుతి సినిమాకు రంగం సిద్ధం

ప్రభాస్ ని డార్లింగ్, మిర్చి నాటి హీరోయిజం ప్లస్ లుక్స్ లో చూడాలని వెయిట్ చేస్తున్న అభిమానుల కోరిక దర్శకుడు మారుతీ తీర్చేలా ఉన్నాడు. ఈ ఇద్దరి కలయికలో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీకి ‘రాజా సాబ్’ టైటిల్ ని లాక్ చేసినట్టు ఇన్ సైడ్ టాక్. తొలుత రాజా డీలక్స్, రాయల్ అంటూ ఏవేవో పేర్లు ప్రచారంలోకి వచ్చాయి కానీ ఫైనల్ గా అందరి అంగీకారం ఒకదాని వైపే మొగ్గు చూపడంతో ఆ మేరకు ఫిక్స్ చేశారని సమాచారం. ఎల్లుండి జనవరి 15 దీనికి సంబంధించిన ప్రకటన, ఫస్ట్ లుక్ రెండూ రాబోతున్నాయని తెలిసింది. టీజర్ వదులుతారో లేదో చూడాలి.

ఇందులో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. మాళవిక మోహనన్, రిద్ది కుమార్, నిధి అగర్వాల్ ప్రభాస్ సరసన ఆడి పాడుతున్నారు. ఇది హారర్ బ్యాక్ డ్రాప్ లో ఉంటూనే కమర్షియల్ అంశాలు మిస్ కాకుండా ఎంటర్ టైన్ చేసేలా మారుతీ చాలా వెరైటీగా తీర్చిదిద్దారట. మరి ఇంత పెద్ద హీరోతో దెయ్యాలంటే రిస్క్ కదా అని అడిగితే చంద్రముఖి సృష్టించిన రికార్డులను గుర్తు చేస్తున్నారట దర్శకుడు. అంతకు మించి అనేలా రాజా సాబ్ ఉంటుందని, ఆత్మల ప్రస్తావన ఉన్నా అదేదో రొటీన్ హారర్ మూవీ తరహాలో ట్రీట్ మెంట్ ఉండదని నొక్కి చెబుతున్నారు.

సంజయ్ దత్ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రభాస్ తండ్రి పాత్రని అంటున్నారు కానీ ఎంత వరకు నిజమో కొంచెం వెయిట్ చేసి చూడాలి. డిసెంబర్ విడుదల సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. కల్కి 2898 ఏడి మేలో వస్తుంది కానీ రాజా సాబ్ ని ఏడాది చివరిలో తేవడం మంచి ఆలోచన. ఏడాదికి రెండు రిలీజులు ఉండేలా చూశానని ఫ్యాన్స్ కి ఇచ్చిన మాట నెరవేరేలా దర్శకులు ప్లాన్ చేస్తున్నారు. 2023లో ఆదిపురుష్-సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్, 2024లో కల్కితో రాజా సాబ్ రావొచ్చు. దీని తర్వాత సలార్ 2, స్పిరిట్, హను రాఘవపూడి ప్రాజెక్టులు లైన్ లో ఉంటాయి.

This post was last modified on January 13, 2024 7:35 am

Share
Show comments
Published by
satya

Recent Posts

మిరల్ రిపోర్ట్ ఏంటి

నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…

2 hours ago

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

4 hours ago

టీడీపీలో 92 గెలుపు గుర్రాలు.. అధికారం ఖాయ‌మే!

బీజేపీ, జ‌న‌సేన‌లతో కూట‌మి క‌ట్టిన టీడీపీ ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోరాటం చేసిన విష‌యం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…

5 hours ago

గురుశిష్యులతో రామ్ చరణ్ సింగిల్ ప్లాన్

గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…

5 hours ago

జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?

ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…

6 hours ago

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

6 hours ago