ప్రభాస్ ని డార్లింగ్, మిర్చి నాటి హీరోయిజం ప్లస్ లుక్స్ లో చూడాలని వెయిట్ చేస్తున్న అభిమానుల కోరిక దర్శకుడు మారుతీ తీర్చేలా ఉన్నాడు. ఈ ఇద్దరి కలయికలో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీకి ‘రాజా సాబ్’ టైటిల్ ని లాక్ చేసినట్టు ఇన్ సైడ్ టాక్. తొలుత రాజా డీలక్స్, రాయల్ అంటూ ఏవేవో పేర్లు ప్రచారంలోకి వచ్చాయి కానీ ఫైనల్ గా అందరి అంగీకారం ఒకదాని వైపే మొగ్గు చూపడంతో ఆ మేరకు ఫిక్స్ చేశారని సమాచారం. ఎల్లుండి జనవరి 15 దీనికి సంబంధించిన ప్రకటన, ఫస్ట్ లుక్ రెండూ రాబోతున్నాయని తెలిసింది. టీజర్ వదులుతారో లేదో చూడాలి.
ఇందులో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. మాళవిక మోహనన్, రిద్ది కుమార్, నిధి అగర్వాల్ ప్రభాస్ సరసన ఆడి పాడుతున్నారు. ఇది హారర్ బ్యాక్ డ్రాప్ లో ఉంటూనే కమర్షియల్ అంశాలు మిస్ కాకుండా ఎంటర్ టైన్ చేసేలా మారుతీ చాలా వెరైటీగా తీర్చిదిద్దారట. మరి ఇంత పెద్ద హీరోతో దెయ్యాలంటే రిస్క్ కదా అని అడిగితే చంద్రముఖి సృష్టించిన రికార్డులను గుర్తు చేస్తున్నారట దర్శకుడు. అంతకు మించి అనేలా రాజా సాబ్ ఉంటుందని, ఆత్మల ప్రస్తావన ఉన్నా అదేదో రొటీన్ హారర్ మూవీ తరహాలో ట్రీట్ మెంట్ ఉండదని నొక్కి చెబుతున్నారు.
సంజయ్ దత్ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రభాస్ తండ్రి పాత్రని అంటున్నారు కానీ ఎంత వరకు నిజమో కొంచెం వెయిట్ చేసి చూడాలి. డిసెంబర్ విడుదల సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. కల్కి 2898 ఏడి మేలో వస్తుంది కానీ రాజా సాబ్ ని ఏడాది చివరిలో తేవడం మంచి ఆలోచన. ఏడాదికి రెండు రిలీజులు ఉండేలా చూశానని ఫ్యాన్స్ కి ఇచ్చిన మాట నెరవేరేలా దర్శకులు ప్లాన్ చేస్తున్నారు. 2023లో ఆదిపురుష్-సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్, 2024లో కల్కితో రాజా సాబ్ రావొచ్చు. దీని తర్వాత సలార్ 2, స్పిరిట్, హను రాఘవపూడి ప్రాజెక్టులు లైన్ లో ఉంటాయి.
This post was last modified on January 13, 2024 7:35 am
జనసేన ఆవిర్భావ సభా వేదిక మీద నుంచి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చాలా విషయాలను ప్రస్తావించారు. కొన్ని…
మూడు వారాలు ఆలస్యంగా విడుదలైనా మంచి వసూళ్లతో తెలుగు వెర్షన్ బోణీ మొదలుపెట్టిన ఛావాకు వసూళ్లు బాగానే నమోదవుతున్నా ఏదో…
సౌత్ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా పేరొందిన లోకేష్ కనగరాజ్ కు మర్చిపోలేని బ్రేక్ ఇచ్చింది ఖైదీ. తెలుగులో…
జనసేన ఆవిర్భావ వేడుకల్లో సుదీర్ఘ ప్రసంగం చేసిన ఆ పార్టీ అదినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్… తనను…
భయం లేదు కాబట్టే… దుష్ట పాలనను బద్దలు కొట్టామని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.…
భారత దేశానికి బహుభాషే మంచిదని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తాజాగా పిఠాపురంలో జరిగిన…