ప్రభాస్ ని డార్లింగ్, మిర్చి నాటి హీరోయిజం ప్లస్ లుక్స్ లో చూడాలని వెయిట్ చేస్తున్న అభిమానుల కోరిక దర్శకుడు మారుతీ తీర్చేలా ఉన్నాడు. ఈ ఇద్దరి కలయికలో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీకి ‘రాజా సాబ్’ టైటిల్ ని లాక్ చేసినట్టు ఇన్ సైడ్ టాక్. తొలుత రాజా డీలక్స్, రాయల్ అంటూ ఏవేవో పేర్లు ప్రచారంలోకి వచ్చాయి కానీ ఫైనల్ గా అందరి అంగీకారం ఒకదాని వైపే మొగ్గు చూపడంతో ఆ మేరకు ఫిక్స్ చేశారని సమాచారం. ఎల్లుండి జనవరి 15 దీనికి సంబంధించిన ప్రకటన, ఫస్ట్ లుక్ రెండూ రాబోతున్నాయని తెలిసింది. టీజర్ వదులుతారో లేదో చూడాలి.
ఇందులో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. మాళవిక మోహనన్, రిద్ది కుమార్, నిధి అగర్వాల్ ప్రభాస్ సరసన ఆడి పాడుతున్నారు. ఇది హారర్ బ్యాక్ డ్రాప్ లో ఉంటూనే కమర్షియల్ అంశాలు మిస్ కాకుండా ఎంటర్ టైన్ చేసేలా మారుతీ చాలా వెరైటీగా తీర్చిదిద్దారట. మరి ఇంత పెద్ద హీరోతో దెయ్యాలంటే రిస్క్ కదా అని అడిగితే చంద్రముఖి సృష్టించిన రికార్డులను గుర్తు చేస్తున్నారట దర్శకుడు. అంతకు మించి అనేలా రాజా సాబ్ ఉంటుందని, ఆత్మల ప్రస్తావన ఉన్నా అదేదో రొటీన్ హారర్ మూవీ తరహాలో ట్రీట్ మెంట్ ఉండదని నొక్కి చెబుతున్నారు.
సంజయ్ దత్ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రభాస్ తండ్రి పాత్రని అంటున్నారు కానీ ఎంత వరకు నిజమో కొంచెం వెయిట్ చేసి చూడాలి. డిసెంబర్ విడుదల సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. కల్కి 2898 ఏడి మేలో వస్తుంది కానీ రాజా సాబ్ ని ఏడాది చివరిలో తేవడం మంచి ఆలోచన. ఏడాదికి రెండు రిలీజులు ఉండేలా చూశానని ఫ్యాన్స్ కి ఇచ్చిన మాట నెరవేరేలా దర్శకులు ప్లాన్ చేస్తున్నారు. 2023లో ఆదిపురుష్-సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్, 2024లో కల్కితో రాజా సాబ్ రావొచ్చు. దీని తర్వాత సలార్ 2, స్పిరిట్, హను రాఘవపూడి ప్రాజెక్టులు లైన్ లో ఉంటాయి.
This post was last modified on January 13, 2024 7:35 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…