పిలిచి మరీ త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి అగ్ర దర్శకుడు అది కూడా మహేష్ బాబు సినిమాలో సెకండ్ హీరోయిన్ అయినా సరే పిలిచి మరీ ఛాన్స్ ఇస్తే ఎవరు వద్దంటారు. మీనాక్షి చౌదరి అదే చేసింది. శ్రీలీల మెయిన్ లీడ్ అని తెలిసినా సరే తనకూ అంతో ఇంతో ప్రాధాన్యం దక్కుతుందనే ఆశతో ఒప్పేసుకుంది. పైగా మరదలి క్యారెక్టర్ కాబట్టి ఒక పాట ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేయడం సహజం. కాసేపు టాక్ గోల పక్కనపెడితే మీనాక్షి చౌదరికి దక్కిన స్క్రీన్ స్పేస్, కథ పరంగా ఆమె చేసిన పనులు చూసి అభిమానులు తెగ ఫీలైపోతున్నారు. మరీ ఇంత అన్యాయమా అంటూ వాపోతున్నారు.
ఇంతకీ సినిమా మొత్తంలో మీనాక్షి చౌదరి చేసింది ఏమయ్యా అంటే మహేష్ బాబుకి భోజనం ప్లేటు తెచ్చివ్వడం, ఇంటికి రాగానే అమ్మకు కేకేసి చెప్పడం, మందు తాగుతుంటే ఆమ్లెట్ ప్లేట్ అందివ్వడం, అంతే. ఓసారి మావయ్య జయరాంతో బావ బయట అందరిని కొడుతున్నాడని కంప్లయింట్ చేయడం. ఇంతకు మించి ఇంకేమైనా కనిపిస్తే ఒట్టు. మందు సాంగ్ లో ఏమైనా నాలుగు స్టెప్పులు ఉంటాయనుకుంటే అవీ లేదు. శ్రీలీలకే బోనస్ గా అసలు పాటలు కాకుండా స్పెషల్ గా ఒక్కడు, పలాస వింటేజ్ సాంగ్స్ తో హుషారుగా స్టెప్పులు వేయించి స్పేస్ పెంచారు.
ఇప్పుడు మీనాక్షి డిమాండ్ ఏమి తక్కువ లేదు. వరుణ్ తేజ్, విశ్వక్ సేన్, దుల్కర్ సల్మాన్ ల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. అన్నింటి కన్నా పెద్ద జాక్ పాట్ తమిళ స్టార్ విజయ్ తో ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైంలోనూ ఉంది. ఇన్ని క్రేజీ ప్రాజెక్టులు చేతిలో ఉన్నప్పుడు గుంటూరు కారం లాంటి వాటిలో రాజీ పడటం వల్ల లాభం ఏమి లేదని ఫ్యాన్స్ కంప్లయింట్. అరవింద సమేత వీర రాఘవలో ఈషా రెబ్బ, అల వైకుంఠపురములో నివేత పేతురాజ్ లకు వచ్చిన సమస్యే ఈ అమ్మాయికీ వచ్చింది. కాకపోతే వాళ్ళు ఫామ్ లో లేనప్పుడు చేశారు మీనాక్షి డిమాండ్ ఉన్నప్పుడూ ఒప్పుకుంది .
This post was last modified on January 12, 2024 6:31 pm
మొన్న ఏడాది వచ్చిన వరుణ్ తేజ్ 'మట్కా'ని సామాన్య ప్రేక్షకులు మర్చిపోయి ఉండొచ్చు కానీ అభిమానులకు మాత్రం పీడకలలా నిలిచిపోయింది.…
నిన్న కీలకమైన వీకెండ్ పూర్తయ్యింది. శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ ఆశలన్నీ సండే మీద పెట్టుకుని ప్రమోషన్లు…
సమ్మర్ సీజన్ లో ఏప్రిల్ చివరి వారం సినిమాలకు చాలా మంచి టైం. వేసవి పీక్స్ లో ఉండటంతో పాటు…
గంధపు చెక్కల స్మగ్లర్గా.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం రేపిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు…
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…
రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…