రిలీజ్ ముందు రోజు భారీ సంఖ్యలో ఒక చిన్న సినిమా వందల ప్రీమియర్లు వేయడం చూసి ట్రేడ్ షాక్ అయినా నిర్మాతల నమ్మకమే గెలిచింది. దేశవ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీతో దాదాపు అన్ని హౌస్ ఫుల్స్ నమోదు చేయడం విశేషం. దర్శకుడు ప్రశాంత్ వర్మ కాన్ఫిడెన్స్ నిలబడినట్టే కనిపిస్తోంది. కానీ అది ఏ స్థాయిలో అనేది ఓ వారం రోజులు ఆగితే కానీ చెప్పలేం. బహుశా ఆ నమ్మకంతోనే ఏమో హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ ని క్లైమాక్స్ లో ప్రకటించారు. 2025 విడుదలని చెప్పేశారు. అంటే వచ్చే ఏడాది రిలీజ్ అవుతుందన్న మాట. ఆల్రెడీ కొంత భాగం తీశారా లేదానేది సస్పెన్స్.
పబ్లిక్ టాక్ చూస్తుంటే జై హనుమాన్ కి రూట్ క్లియర్ అయినట్టే కనిపిస్తోంది. సినిమాటిక్ యూనివర్స్ సృష్టిస్తానని అందులో సూపర్ హీరోలు ఉంటారని చెప్పిన ప్రశాంత్ వర్మ రెండో భాగంలో హనుమంతుడి పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్టు క్లూ ఇచ్చాడు. ప్రపంచ నాశనంకోసం అసుర గణం తరలి వస్తోంది కాబట్టి దాన్ని అణచాలంటే ఖచ్చితంగా నువ్వే రావాలి హనుమా అంటూ విభీషణుడితో చెప్పించడం సీక్వెల్ స్టోరీకి సంబంధించి క్లూగా చెప్పుకోవచ్చు. ఎండింగ్ కార్డు కూడా పర్ఫెక్ట్ గా కట్ చేయడం ద్వారా ఆసక్తి రేపడంలో ప్రశాంత్ వర్మ సక్సెసయ్యాడు.
ఒకవేళ జై హనుమాన్ త్వరగా తీస్తే మాత్రం బడ్జెట్ విషయంలో రాజీ ఉండకపోవచ్చు. హనుమాన్ బాక్సాఫీస్ లెక్కల్లో ఎంత పే చేస్తుందనే దాన్ని బట్టి ఏ మేరకు ఖర్చుని పెంచాలనేది నిర్ణయించుకోవచ్చు. పరిమితులు ఉంటేనే ఇంత క్వాలిటీ తెచ్చినప్పుడు ఒకవేళ హద్దులు చెరిపేస్తే ఏ స్థాయిలో మేజిక్ చేయొచ్చో ఊహించుకోవచ్చు. కేవలం ఏడాది టైం తీసుకోవడం చూస్తే ప్రశాంత్ వర్మ జై హనుమాన్ కోసం ఏళ్ళ తరబడి సమయం అవసరం లేకుండానే పూర్తి చేసేలా ఉన్నాడు. మొత్తం 12 సినిమాలతో యునివర్స్ ని పూర్తి చేస్తానన్న ఈ యువ దర్శకుడు ఇంకే సూపర్ హీరోలను తీసుకొస్తాడో.
This post was last modified on January 12, 2024 8:05 am
కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా… అందులో ఎదో ఒక మెలిక ఉండనే ఉంటుంది. ఈ తరహా నిర్ణయాలను కేంద్రం తెలిసి…
తెలంగాణాలో త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే… ఆ వార్తలన్నింటిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
సీఎం చంద్రబాబుపై ఎప్పుడు బురదజల్లుదామా అనే కాన్సెప్ట్ తో వైసీపీ నేతలు రెడీగా ఉంటారని టీడీపీ నేతలు విమర్శిస్తుంటారు. చంద్రబాబు…
ఏపీలోని పేద ప్రజల గుండెకు భరోసా అందించే దిశగా కూటమి సర్కారు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే అమలులోకి…
ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా చివరి ఉత్తర్వుల్లో అద్భుత ట్విస్ట్ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా కుటుంబ…
మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సాకే శైలజానాథ్.. తాజాగా వైసీపీ గూటికి చేరారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం…