మాములుగా ఒక సినిమా ఏదైనా ఓటిటి స్ట్రీమింగ్ మొదలుపెట్టుకుంటే దాన్ని తీసేయడమంటూ ఉండదు. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ లాంటి ఇంటర్నేషనల్ కంపెనీలు ఈ విషయంలో పటిష్టంగా పాలసీలు ఫాలో అవుతాయి. ఎలాంటి వివాదాలు వచ్చినా సరే అంత సులభంగా తలొగ్గవు. కానీ గత వారం విడుదలైన నయనతార అన్నపూరణి కేసులో మాత్రం వెనక్కు తగ్గక తప్పలేదు. లవ్ జిహాద్ ని ప్రోత్సహించేలా ఉందని, హిందూ మత విశ్వాసాలను దారుణంగా దెబ్బ తీసేలా ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నమని మధురైకి చెందిన కొందరు కొద్దిరోజుల క్రితం కేసు వేయడంతో వ్యవహారం మలుపు తిరిగింది.
దీనికి తోడు పలు రాజకీయ పార్టీలు అన్నపూరణిని బ్యాన్ చేయాలని నినాదం తలెత్తుకోవడంతో చివరికి నెట్ ఫ్లిక్స్ తన ప్లాట్ ఫార్మ్ నుంచి ఆ సినిమాని తొలగించింది. ఇది తాత్కాలికమా లేక ఎప్పటికీనా అనేది ఇంకా తేలాల్సి ఉంది. విచిత్రం ఏంటంటే డిసెంబర్ 1 థియేటర్లలో రిలీజైనప్పుడు దీని గురించి చిన్న నిరసనలు తప్ప తీవ్ర వ్యతిరేకత ఎవరూ చూపించలేదు. దీనికి తోడు ఫ్లాప్ టాక్ రావడంతో ఆడియన్స్ దూరంగా ఉన్నారు. తీరా డిజిటల్ లో వచ్చాక చూస్తే షాకింగ్ కంటెంట్ కనిపించింది. దీంతో ఒక్కసారిగా మనోభావాలు దెబ్బ తిని ఏకంగా దాన్ని నెట్ ఫ్లిక్స్ నుంచి తీసేసే దిశగా వెళ్ళింది.
ఇంతకు ముందు చెప్పినట్టు అన్నపూరణిలో నిజంగానే అభ్యంతర పెట్టే కంటెంట్ ఉంది. సంప్రదాయాలకు కట్టుబడిన ఒక బ్రాహ్మణ అమ్మాయి నాన్ వెజ్ బిర్యానీ వండేందుకు తాపత్రయపడటం, రుచి బాగా రావాలని బురఖా వేసుకుని నమాజ్ చేయడం లాంటి అర్థం లేని పైత్యం దర్శకుడు చాలానే జోడించాడు. ఇది ముస్లిం వర్గాలకే నచ్చలేదు. మరీ ఓవర్ గా చూపించారని వాళ్ళూ మండి పడ్డారు. కోర్టు కేసు సీరియస్ గా మారడంతో నెట్ ఫ్లిక్స్ వెంటనే నష్టనివారణ చర్యలకు పూనుకుంది. తెలుగుతో సహా ఇతర డబ్బింగ్ భాషల్లో అందుబాటులో ఉన్న అన్నపూరణిని ఇక అఫీషియల్ గా చూసే ఛాన్స్ లేనట్టే.
This post was last modified on January 11, 2024 1:10 pm
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…
టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…
తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…
నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి ఎర్త్ పెడుతున్నారా?... ఆయన ప్రాభవాన్ని.. వైభవాన్ని…
రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…