మాములుగా ఒక సినిమా ఏదైనా ఓటిటి స్ట్రీమింగ్ మొదలుపెట్టుకుంటే దాన్ని తీసేయడమంటూ ఉండదు. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ లాంటి ఇంటర్నేషనల్ కంపెనీలు ఈ విషయంలో పటిష్టంగా పాలసీలు ఫాలో అవుతాయి. ఎలాంటి వివాదాలు వచ్చినా సరే అంత సులభంగా తలొగ్గవు. కానీ గత వారం విడుదలైన నయనతార అన్నపూరణి కేసులో మాత్రం వెనక్కు తగ్గక తప్పలేదు. లవ్ జిహాద్ ని ప్రోత్సహించేలా ఉందని, హిందూ మత విశ్వాసాలను దారుణంగా దెబ్బ తీసేలా ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నమని మధురైకి చెందిన కొందరు కొద్దిరోజుల క్రితం కేసు వేయడంతో వ్యవహారం మలుపు తిరిగింది.
దీనికి తోడు పలు రాజకీయ పార్టీలు అన్నపూరణిని బ్యాన్ చేయాలని నినాదం తలెత్తుకోవడంతో చివరికి నెట్ ఫ్లిక్స్ తన ప్లాట్ ఫార్మ్ నుంచి ఆ సినిమాని తొలగించింది. ఇది తాత్కాలికమా లేక ఎప్పటికీనా అనేది ఇంకా తేలాల్సి ఉంది. విచిత్రం ఏంటంటే డిసెంబర్ 1 థియేటర్లలో రిలీజైనప్పుడు దీని గురించి చిన్న నిరసనలు తప్ప తీవ్ర వ్యతిరేకత ఎవరూ చూపించలేదు. దీనికి తోడు ఫ్లాప్ టాక్ రావడంతో ఆడియన్స్ దూరంగా ఉన్నారు. తీరా డిజిటల్ లో వచ్చాక చూస్తే షాకింగ్ కంటెంట్ కనిపించింది. దీంతో ఒక్కసారిగా మనోభావాలు దెబ్బ తిని ఏకంగా దాన్ని నెట్ ఫ్లిక్స్ నుంచి తీసేసే దిశగా వెళ్ళింది.
ఇంతకు ముందు చెప్పినట్టు అన్నపూరణిలో నిజంగానే అభ్యంతర పెట్టే కంటెంట్ ఉంది. సంప్రదాయాలకు కట్టుబడిన ఒక బ్రాహ్మణ అమ్మాయి నాన్ వెజ్ బిర్యానీ వండేందుకు తాపత్రయపడటం, రుచి బాగా రావాలని బురఖా వేసుకుని నమాజ్ చేయడం లాంటి అర్థం లేని పైత్యం దర్శకుడు చాలానే జోడించాడు. ఇది ముస్లిం వర్గాలకే నచ్చలేదు. మరీ ఓవర్ గా చూపించారని వాళ్ళూ మండి పడ్డారు. కోర్టు కేసు సీరియస్ గా మారడంతో నెట్ ఫ్లిక్స్ వెంటనే నష్టనివారణ చర్యలకు పూనుకుంది. తెలుగుతో సహా ఇతర డబ్బింగ్ భాషల్లో అందుబాటులో ఉన్న అన్నపూరణిని ఇక అఫీషియల్ గా చూసే ఛాన్స్ లేనట్టే.
కమల్ హాసన్ అభిమానులే మర్చిపోయిన పేరు ఇండియన్. మొన్న ఏడాది దీని రెండో భాగం వచ్చి ఎంత డిజాస్టర్ అయ్యిందో…
విద్యాశాఖ మంత్రిగా టీడీపీ యువ నాయకుడు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్.. నారా లోకేష్ దూకుడు చూపిస్తున్నారు. నిజానికి విద్యా శాఖ…
ఈ రోజు విడుదలైన సింగ్ గీతం కమర్షియల్ గా ఎంత వసూలు చేస్తుంది, నిర్మాతలకు డబ్బులు ఇస్తుందా లేదానేది పక్కనపెడితే…
రాష్ట్రంలో కూటమిప్రభుత్వంఏర్పడి జూన్ 12కు రెండేళ్లు పూర్తయ్యాయి. 2024లో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు జనసేన అధినేత…
ఏపీలో పెను కలకలం రేపిన మద్యం కుంభకోణంలో ఇప్పుడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంట్రీ ఇచ్చేసింది. వైసీపీ…
తాను చేసే మాస్ మసాలా సినిమాల విషయంలో ఎవరెన్ని విమర్శలు చేసినా, పట్టించుకోకుండా చాలా ఏళ్ల పాటు అదే రూట్లో…