మాములుగా ఒక సినిమా ఏదైనా ఓటిటి స్ట్రీమింగ్ మొదలుపెట్టుకుంటే దాన్ని తీసేయడమంటూ ఉండదు. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ లాంటి ఇంటర్నేషనల్ కంపెనీలు ఈ విషయంలో పటిష్టంగా పాలసీలు ఫాలో అవుతాయి. ఎలాంటి వివాదాలు వచ్చినా సరే అంత సులభంగా తలొగ్గవు. కానీ గత వారం విడుదలైన నయనతార అన్నపూరణి కేసులో మాత్రం వెనక్కు తగ్గక తప్పలేదు. లవ్ జిహాద్ ని ప్రోత్సహించేలా ఉందని, హిందూ మత విశ్వాసాలను దారుణంగా దెబ్బ తీసేలా ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నమని మధురైకి చెందిన కొందరు కొద్దిరోజుల క్రితం కేసు వేయడంతో వ్యవహారం మలుపు తిరిగింది.
దీనికి తోడు పలు రాజకీయ పార్టీలు అన్నపూరణిని బ్యాన్ చేయాలని నినాదం తలెత్తుకోవడంతో చివరికి నెట్ ఫ్లిక్స్ తన ప్లాట్ ఫార్మ్ నుంచి ఆ సినిమాని తొలగించింది. ఇది తాత్కాలికమా లేక ఎప్పటికీనా అనేది ఇంకా తేలాల్సి ఉంది. విచిత్రం ఏంటంటే డిసెంబర్ 1 థియేటర్లలో రిలీజైనప్పుడు దీని గురించి చిన్న నిరసనలు తప్ప తీవ్ర వ్యతిరేకత ఎవరూ చూపించలేదు. దీనికి తోడు ఫ్లాప్ టాక్ రావడంతో ఆడియన్స్ దూరంగా ఉన్నారు. తీరా డిజిటల్ లో వచ్చాక చూస్తే షాకింగ్ కంటెంట్ కనిపించింది. దీంతో ఒక్కసారిగా మనోభావాలు దెబ్బ తిని ఏకంగా దాన్ని నెట్ ఫ్లిక్స్ నుంచి తీసేసే దిశగా వెళ్ళింది.
ఇంతకు ముందు చెప్పినట్టు అన్నపూరణిలో నిజంగానే అభ్యంతర పెట్టే కంటెంట్ ఉంది. సంప్రదాయాలకు కట్టుబడిన ఒక బ్రాహ్మణ అమ్మాయి నాన్ వెజ్ బిర్యానీ వండేందుకు తాపత్రయపడటం, రుచి బాగా రావాలని బురఖా వేసుకుని నమాజ్ చేయడం లాంటి అర్థం లేని పైత్యం దర్శకుడు చాలానే జోడించాడు. ఇది ముస్లిం వర్గాలకే నచ్చలేదు. మరీ ఓవర్ గా చూపించారని వాళ్ళూ మండి పడ్డారు. కోర్టు కేసు సీరియస్ గా మారడంతో నెట్ ఫ్లిక్స్ వెంటనే నష్టనివారణ చర్యలకు పూనుకుంది. తెలుగుతో సహా ఇతర డబ్బింగ్ భాషల్లో అందుబాటులో ఉన్న అన్నపూరణిని ఇక అఫీషియల్ గా చూసే ఛాన్స్ లేనట్టే.
This post was last modified on January 11, 2024 1:10 pm
చిన్న సినిమా వెనుక అగ్ర నిర్మాతలు, హీరోలు ఉండటం వాటికి చాలా పెద్ద బలమవుతుంది. బలగంలో ఎంత గొప్ప కంటెంట్…
తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…
చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…