మాములుగా ఒక సినిమా ఏదైనా ఓటిటి స్ట్రీమింగ్ మొదలుపెట్టుకుంటే దాన్ని తీసేయడమంటూ ఉండదు. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ లాంటి ఇంటర్నేషనల్ కంపెనీలు ఈ విషయంలో పటిష్టంగా పాలసీలు ఫాలో అవుతాయి. ఎలాంటి వివాదాలు వచ్చినా సరే అంత సులభంగా తలొగ్గవు. కానీ గత వారం విడుదలైన నయనతార అన్నపూరణి కేసులో మాత్రం వెనక్కు తగ్గక తప్పలేదు. లవ్ జిహాద్ ని ప్రోత్సహించేలా ఉందని, హిందూ మత విశ్వాసాలను దారుణంగా దెబ్బ తీసేలా ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నమని మధురైకి చెందిన కొందరు కొద్దిరోజుల క్రితం కేసు వేయడంతో వ్యవహారం మలుపు తిరిగింది.
దీనికి తోడు పలు రాజకీయ పార్టీలు అన్నపూరణిని బ్యాన్ చేయాలని నినాదం తలెత్తుకోవడంతో చివరికి నెట్ ఫ్లిక్స్ తన ప్లాట్ ఫార్మ్ నుంచి ఆ సినిమాని తొలగించింది. ఇది తాత్కాలికమా లేక ఎప్పటికీనా అనేది ఇంకా తేలాల్సి ఉంది. విచిత్రం ఏంటంటే డిసెంబర్ 1 థియేటర్లలో రిలీజైనప్పుడు దీని గురించి చిన్న నిరసనలు తప్ప తీవ్ర వ్యతిరేకత ఎవరూ చూపించలేదు. దీనికి తోడు ఫ్లాప్ టాక్ రావడంతో ఆడియన్స్ దూరంగా ఉన్నారు. తీరా డిజిటల్ లో వచ్చాక చూస్తే షాకింగ్ కంటెంట్ కనిపించింది. దీంతో ఒక్కసారిగా మనోభావాలు దెబ్బ తిని ఏకంగా దాన్ని నెట్ ఫ్లిక్స్ నుంచి తీసేసే దిశగా వెళ్ళింది.
ఇంతకు ముందు చెప్పినట్టు అన్నపూరణిలో నిజంగానే అభ్యంతర పెట్టే కంటెంట్ ఉంది. సంప్రదాయాలకు కట్టుబడిన ఒక బ్రాహ్మణ అమ్మాయి నాన్ వెజ్ బిర్యానీ వండేందుకు తాపత్రయపడటం, రుచి బాగా రావాలని బురఖా వేసుకుని నమాజ్ చేయడం లాంటి అర్థం లేని పైత్యం దర్శకుడు చాలానే జోడించాడు. ఇది ముస్లిం వర్గాలకే నచ్చలేదు. మరీ ఓవర్ గా చూపించారని వాళ్ళూ మండి పడ్డారు. కోర్టు కేసు సీరియస్ గా మారడంతో నెట్ ఫ్లిక్స్ వెంటనే నష్టనివారణ చర్యలకు పూనుకుంది. తెలుగుతో సహా ఇతర డబ్బింగ్ భాషల్లో అందుబాటులో ఉన్న అన్నపూరణిని ఇక అఫీషియల్ గా చూసే ఛాన్స్ లేనట్టే.
This post was last modified on January 11, 2024 1:10 pm
దేవర బ్లాక్ బస్టర్ తర్వాత వార్ 2 విపరీతంగా నిరాశ పరచడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆశలన్నీ ప్యాన్ ఇండియా…
తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధిపతి విజయ్ రాజకీయ విమర్శలకు కేంద్రంగా మారారు. ఆయనను కార్నర్ చేస్తూ.. బీజేపీసహా ఇతర పార్టీలు…
ఇంకో రెండు రోజుల్లో దృశ్యం 3 విడుదల కానుంది. ఒరిజినల్ వెర్షన్ తో పాటు తెలుగు డబ్బింగ్ రిలీజ్ కానుండటంతో…
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జోగి రమేష్ తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. వాస్తవానికి ఆయన అగ్రిగోల్డ్ కేసులోను…
ఏపీ సీఎం చంద్రబాబు మత్స్యకారుల మనసు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన మత్సకార సేవలో కార్యక్రమంలో…
దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…