పోయిన సంక్రాంతికి సందడి అంతా మెగాస్టార్ చిరంజీవిదే. ఆయన సినిమా వాల్తేరు వీరయ్య రీఎంట్రీ తర్వాత 2013 సంక్రాంతికి విడుదలై చిరు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆ చిత్రం 200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టడం విశేషం. అటు ఇటుగా 50 రోజుల పాటు వాల్తేరు వీరయ్య థియేట్రికల్ రన్ సాగింది. ఆ తర్వాత ఆ చిత్రం ఓటిటిలోకి వచ్చింది. శాటిలైట్లో కూడా ప్రసారం అయింది. అయినా సరే ఒక థియేటర్లో వాల్తేరు వీరయ్య ఇంకా ఆడుతున్నాడు విశేషం. పోయిన సంక్రాంతికి రిలీజ్ అయి ఈ సంక్రాంతికి కూడా ఆ సినిమా ఆ థియేటర్లోనే ఉంది. అవనిగడ్డ ప్రాంతంలోని రామకృష్ణ థియేటర్లో వాల్తేరు వీరయ్య 365 రోజుల రన్ పూర్తి చేసుకోవడం విశేషం.
ఈ సందర్భంగా మెగా అభిమానులు ఒక ప్రత్యేక వేడుక నిర్వహించి దర్శకుడు బాబి కొల్లి, నిర్మాత రవిశంకర్ లను సన్మానించడం విశేషం. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు. వాల్తేరు వీరయ్య సినిమా అంత పెద్ద సక్సెస్ కావడానికి ప్రధాన కారణం దర్శకుడు బాబీ, అలాగే తన తమ్ముడు రవితేజ, ఈ సినిమాకి ప్రతి అంశాన్ని పేర్చి చేర్చిన నిర్మాతలు అని.. వీరందరూ లేకపోతే వాల్తేరు వీరయ్య సినిమా లేదని చిరు అన్నారు.
ఈ రోజుల్లో కూడా ఈ సినిమా 365 రోజులు ఒక థియేటర్లో రన్ అవడం సాధారణ రికార్డు కాదని చెబుతూ.. అందరికీ కొత్త సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలను మెగాస్టార్ తెలియజేసిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలోకి వచ్చింది. మరి అవనిగడ్డలో వాల్తేరు వీరయ్య రన్ ఇంతటితో ముగుస్తుందా, ఇంకా కొనసాగుతుందా అన్నది చూడాలి.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…