పోయిన సంక్రాంతికి సందడి అంతా మెగాస్టార్ చిరంజీవిదే. ఆయన సినిమా వాల్తేరు వీరయ్య రీఎంట్రీ తర్వాత 2013 సంక్రాంతికి విడుదలై చిరు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆ చిత్రం 200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టడం విశేషం. అటు ఇటుగా 50 రోజుల పాటు వాల్తేరు వీరయ్య థియేట్రికల్ రన్ సాగింది. ఆ తర్వాత ఆ చిత్రం ఓటిటిలోకి వచ్చింది. శాటిలైట్లో కూడా ప్రసారం అయింది. అయినా సరే ఒక థియేటర్లో వాల్తేరు వీరయ్య ఇంకా ఆడుతున్నాడు విశేషం. పోయిన సంక్రాంతికి రిలీజ్ అయి ఈ సంక్రాంతికి కూడా ఆ సినిమా ఆ థియేటర్లోనే ఉంది. అవనిగడ్డ ప్రాంతంలోని రామకృష్ణ థియేటర్లో వాల్తేరు వీరయ్య 365 రోజుల రన్ పూర్తి చేసుకోవడం విశేషం.
ఈ సందర్భంగా మెగా అభిమానులు ఒక ప్రత్యేక వేడుక నిర్వహించి దర్శకుడు బాబి కొల్లి, నిర్మాత రవిశంకర్ లను సన్మానించడం విశేషం. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు. వాల్తేరు వీరయ్య సినిమా అంత పెద్ద సక్సెస్ కావడానికి ప్రధాన కారణం దర్శకుడు బాబీ, అలాగే తన తమ్ముడు రవితేజ, ఈ సినిమాకి ప్రతి అంశాన్ని పేర్చి చేర్చిన నిర్మాతలు అని.. వీరందరూ లేకపోతే వాల్తేరు వీరయ్య సినిమా లేదని చిరు అన్నారు.
ఈ రోజుల్లో కూడా ఈ సినిమా 365 రోజులు ఒక థియేటర్లో రన్ అవడం సాధారణ రికార్డు కాదని చెబుతూ.. అందరికీ కొత్త సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలను మెగాస్టార్ తెలియజేసిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలోకి వచ్చింది. మరి అవనిగడ్డలో వాల్తేరు వీరయ్య రన్ ఇంతటితో ముగుస్తుందా, ఇంకా కొనసాగుతుందా అన్నది చూడాలి.
This post was last modified on January 10, 2024 4:39 pm
నిన్న విడుదలైన రణబాలి టీజర్ పట్ల సోషల్ మీడియాలో పాజిటివ్ రియాక్షన్లు ఎక్కువగా కనిపించాయి. అలాని అందరూ యునానిమస్ గా…
అర్జెంటీనాలో జరిగిన ఒక విచిత్ర పరిణామం ప్రపంచ వ్యాప్తంగా తెగ వైరల్ అవుతుంది. రాత్రికి రాత్రే ఒక సముద్రం ఇంకిపోయిందని,…
ఫోల్డబుల్ ఫోన్ అంటే ముందుగా గుర్తొచ్చేది శాంసంగ్. 2019లో తొలి గెలాక్సీ ఫోల్డ్ను తీసుకొచ్చిన ఆ కంపెనీ, అప్పటి నుంచి…
ఫౌజీ వాయిదా గురించి నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోయినా పోస్ట్ పోన్ ఖాయమని…
మొబైల్ ఫోన్లు చేతిలోకి వచ్చాక రోజుకో కొత్త రకం నేరం బయట పడుతుంది. ముఖ్యంగా యువతీ యువకులు, మైనర్ బాలుల్లో…
కారణాలు లక్షా తొంభై ఉండని, టాలీవుడ్ హీరోలు చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తున్నారనేది వాస్తవం. రవితేజ, శ్రీవిష్ణు లాంటి ఒకరిద్దరిని…