పోయిన సంక్రాంతికి సందడి అంతా మెగాస్టార్ చిరంజీవిదే. ఆయన సినిమా వాల్తేరు వీరయ్య రీఎంట్రీ తర్వాత 2013 సంక్రాంతికి విడుదలై చిరు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆ చిత్రం 200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టడం విశేషం. అటు ఇటుగా 50 రోజుల పాటు వాల్తేరు వీరయ్య థియేట్రికల్ రన్ సాగింది. ఆ తర్వాత ఆ చిత్రం ఓటిటిలోకి వచ్చింది. శాటిలైట్లో కూడా ప్రసారం అయింది. అయినా సరే ఒక థియేటర్లో వాల్తేరు వీరయ్య ఇంకా ఆడుతున్నాడు విశేషం. పోయిన సంక్రాంతికి రిలీజ్ అయి ఈ సంక్రాంతికి కూడా ఆ సినిమా ఆ థియేటర్లోనే ఉంది. అవనిగడ్డ ప్రాంతంలోని రామకృష్ణ థియేటర్లో వాల్తేరు వీరయ్య 365 రోజుల రన్ పూర్తి చేసుకోవడం విశేషం.
ఈ సందర్భంగా మెగా అభిమానులు ఒక ప్రత్యేక వేడుక నిర్వహించి దర్శకుడు బాబి కొల్లి, నిర్మాత రవిశంకర్ లను సన్మానించడం విశేషం. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు. వాల్తేరు వీరయ్య సినిమా అంత పెద్ద సక్సెస్ కావడానికి ప్రధాన కారణం దర్శకుడు బాబీ, అలాగే తన తమ్ముడు రవితేజ, ఈ సినిమాకి ప్రతి అంశాన్ని పేర్చి చేర్చిన నిర్మాతలు అని.. వీరందరూ లేకపోతే వాల్తేరు వీరయ్య సినిమా లేదని చిరు అన్నారు.
ఈ రోజుల్లో కూడా ఈ సినిమా 365 రోజులు ఒక థియేటర్లో రన్ అవడం సాధారణ రికార్డు కాదని చెబుతూ.. అందరికీ కొత్త సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలను మెగాస్టార్ తెలియజేసిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలోకి వచ్చింది. మరి అవనిగడ్డలో వాల్తేరు వీరయ్య రన్ ఇంతటితో ముగుస్తుందా, ఇంకా కొనసాగుతుందా అన్నది చూడాలి.
This post was last modified on January 10, 2024 4:39 pm
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…
తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…
టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…