త్రివిక్రమ్ నుంచి ఒక సినిమా వస్తుందంటే ఆయన మార్కు కామెడీ, చమత్కారం, వ్యంగ్యం, డైలాగుల మీద ప్రత్యేకంగా దృష్టి పెడతారు అభిమానులు. సినిమాకు సంబంధించి చిన్న ప్రోమో రిలీజ్ చేసినా.. ఆయన టచ్ మీద చర్చ జరుగుతుంది. ఇక ట్రైలర్ రిలీజ్ అయింది అంటే.. డిస్కషన్ అంతా త్రివిక్రమ్ మార్కు గురించే ఉంటుంది. అయితే గుంటూరు కారం సినిమాకు సంబంధించి మొదటి నుంచి త్రివిక్రమ్ టచ్ కనిపించకపోవడం గమనార్హం. ఇది సగటు మా సినిమాలా కనిపిస్తోంది తప్ప త్రివిక్రమ్ ప్రత్యేకత లేదని ఆయన ఫ్యాన్స్ ముందు నుంచి కొంత ఫీలవుతున్నారు.
తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్లో కూడా ఆయన ముద్ర తక్కువనే చెప్పాలి. త్రివిక్రమ్ గత సినిమాలను దృష్టిలో ఉంచుకొని చూస్తే.. గుంటూరు కారం ఆయన సినిమాయేనా అనిపించేలా ఉంది ట్రైలర్. ఇందులో హీరో క్యారక్టర్, యాక్షన్ ఎక్కువగా హైలెట్ అయ్యాయి. అయితే ట్రైలర్ చూస్తే పైసా వసూల్ అని మాత్రం అనిపించింది.
అయితే ట్రైలర్లో త్రివిక్రమ్ మార్కు లేదని మహేష్ ఫాన్స్ పెద్దగా ఏమి ఫీల్ అవ్వట్లేదు. నిజానికి ఈ విషయాన్ని సానుకూలంగానే తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇంతకుముందు మహేష్ తో త్రివిక్రమ్ తీసిన రెండు చిత్రాలు అతడు, ఖలేజాల్లో స్పష్టంగా ఆయన ముద్ర కనిపిస్తుంది. త్రివిక్రమ్ అంటే మాటల మాంత్రికుడు అనడానికి ఆ రెండు చిత్రాలు నిదర్శనం. వాటిలో కామెడీ, డైలాగ్స్ మామూలుగా పేలలేదు. కానీ ఆ రెండు చిత్రాలు ఆశించిన విజయం సాధించలేదు. అతడు కల్ట్ మూవీగా పేరు తెచ్చుకుంది తప్ప కమర్షియల్ గా పెద్ద సక్సెస్ కాలేదు. ఇక ఖలేజా ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే. త్రివిక్రమ్ మార్క్ విషయంలో వాటితో పోల్చుకోలేని విధంగా ఉన్న గుంటూరు కారం.. కమర్షియల్ గా పెద్ద సక్సెస్ అయ్యేలా కనిపిస్తుంది.
మహేష్ అభిమానులు, మాస్ బాగా కనెక్ట్ అయ్యే సినిమా ఇదని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. అందుకే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని.. ఈసారి గురూజీ మార్కు లేదు, కాబట్టి హిట్టు కొట్టబోతున్నాము అని మహేష్ అభిమానులు సరదాగా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తుండడం విశేషం.
టాలీవుడ్లో బండ్ల గణేష్ విచిత్రమైన పర్సనాలిటీ. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే అతను.. నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్,…
బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ తీశారు. ఆస్కార్ వేదిక మీద తన బృందానికి అవార్డు వచ్చేలా చేశారు. వారణాసిని ఇంటర్నేషనల్…
టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. రాజమౌళి కాకుండా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లేని దర్శకుడు…
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…
అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…
విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ సీఐ నాగరాజుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే..…