సంక్రాంతి రేసులో మంచి అంచనాలు మోస్తున్న హనుమాన్ కి థియేటర్ల సమస్య ఉన్నప్పటికీ కంటెంట్ తో పాటు అంజనీ పుత్రుడి దీవెనలే తమను నడిపిస్తుందని టీమ్ ధైర్యంగా పోటీలో అడుగు పెడుతోంది. ఆ నమ్మకంతోనే ప్రధాన కేంద్రాల్లో ముందు రోజు రాత్రి ప్రీమియర్లకు రెడీ అవుతోంది. మొదటి షో అనౌన్స్ మెంట్ అమలాపురం నుంచి వచ్చేసింది. మెల్లగా సెంటర్ల వారిగా వివరాలు ప్రకటించబోతున్నారు. నిజానికి ఈ సినిమా ఫిక్స్ చేసినప్పుడు పది భాషల్లో విడుదల కాబట్టి 3డి వెర్షన్ లో చేయాలని అనుకున్నారు. కానీ క్రమంగా ఆ ఆలోచన మానుకుని సాధారణంగానే తీసుకొస్తున్నారు.
ఒకరకంగా చెప్పాలంటే 3డి వద్దనుకోవడం తెలివైన నిర్ణయం. ఒకవేళ ఆ టెక్నాలజీలో సినిమా చూపించాలనుకున్నప్పుడు ప్రత్యేకంగా ఆ సాంకేతికతను సపోర్ట్ చేసే కెమెరాలు వాడాలి. కానీ హనుమాన్ మేకర్స్ దగ్గర అంత బడ్జెట్ లేదు. అన్నేసి వందల కోట్లు ఖర్చు పెట్టిన ఆదిపురుష్ కే ఆడియన్స్ మరీ స్పెషల్ గా ఫీలవ్వలేదు. అవతార్ లాంటి హాలీవుడ్ మూవీస్ తప్ప ఇండియాలో తీసిన వాటికి ఎక్స్ ట్రాడినరీ అనే ఫీడ్ బ్యాక్ వచ్చిన త్రిడి సినిమాలు చాలా అరుదు. ఒకవేళ నార్మల్ గా తీసింది 3డిలో మార్చాలన్నా ఖర్చుతో కూడుకున్నవ్యవహారం. దాని బదులు వదిలేసుకోవడం ఉత్తమం.
ఆర్ఆర్ఆర్ సైతం త్రిడిలో వచ్చినా రెస్పాన్స్ గొప్పగా రాలేదు. హనుమాన్ లో విజువల్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. వాటిని మంచి క్వాలిటీ ఉన్న స్క్రీన్ లో డాల్బీ సౌండ్ తో చూస్తే చాలు కనెక్ట్ అయిపోతుంది. ఇది కాకుండా ఒకవేళ త్రిడి అయితే అదనంగా టికెట్ మీద ముప్పై రూపాయలు వసూలు చేయాలి. అన్ని థియేటర్లలో ఒకే రకమైన క్వాలిటీ స్క్రీనింగ్ లేదు. దాని వల్ల అనుభూతుల్లో వ్యత్యాసం వస్తోంది. ఇవన్నీ ఆలోచించే హనుమాన్ మేకర్స్ నార్మల్ వెర్షన్ కి కట్టుబడ్డారు. తేజ సజ్జ, అమృత అయ్యర్ జంటగా నటిస్తున్న ఈ ఫాంటసీ డ్రామాలో వరలక్ష్మి, వినయ్ వర్మ ఇతర ప్రధాన తారాగణం.
This post was last modified on January 8, 2024 5:14 pm
గత ఏడాది సెప్టెంబర్ లో ఆంధ్రకింగ్ తాలూకా రిలీజైనప్పుడు పాజిటివ్ రివ్యూలు వెల్లువెత్తాయి. మౌత్ టాక్ కూడా బాగానే ఉంది.…
వేలంటైన్ప్ డే వీకెండ్లో మంచి అంచనాల మధ్య విడుదలైన చిత్రం.. ఫంకీ. యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న విశ్వక్సేన్ను హీరీగా…
ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు సైతం కోటి.. అంతకంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వచ్చేశాయి. ధరలు అంతగా…
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…