యూట్యూబ్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్న గుంటూరు కారం ట్రైలర్ లో మీనాక్షి చౌదరిని కేవలం ఒక్క ఫ్రేమ్ లో చూపించి చిన్న డైలాగుతో సరిపెట్టడం ఆమె ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. మెయిన్ హీరోయిన్ కానప్పటికీ మంచి స్క్రీన్ స్పేస్ దొరికి ఉంటుందనే అంచనాలకు భిన్నంగా మరదలి పాత్రని త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా లిమిటెడ్ గా డిజైన్ చేసిన ఫీలింగ్ ఆ చిన్న వీడియోలోనే వచ్చేసింది. మావయ్యగా నటించిన జయరామ్ ని ఉద్దేశించి రమణ గురించి రెండు ముక్కలు మాట్లాడ్డం తప్పించి ఇంకెక్కడా తనను చూపించడం, హైలైట్ చేయడం జరగలేదు.
మహేష్ బాబు తర్వాత ఎక్కువ ఫోకస్ వచ్చింది శ్రీలీలకి. మరీ ప్రత్యేకంగా అనిపించకపోయినా ఉన్నంతలో మూడు షాట్లు, డాన్స్ బిట్, చిన్న డైలాగులు ఇలా బాగానే చూపించారు. గతంలో చెప్పినట్టు ఇందులో మీనాక్షి చౌదరికి మరీ ఎక్కువ లెన్త్ అయితే దొరకలేదు. పేరుకి మరదలి పాత్రే అయినా హీరోతో డ్యూయెట్లు, రొమాన్సులు గట్రా పెద్దగా ఉండవు. పాటల్లో సైతం ఒక గ్రూప్ డాన్స్ తప్ప విడిగా డ్యూయెట్ పడలేదట. కెరీర్ ప్రారంభంలో మీడియం రేంజ్ హీరోలతో చేసి ఇప్పుడు స్టార్ల సరసన ఆఫర్లు పడుతున్న మీనాక్షి చౌదరి గుంటూరు కారం మీద బోలెడు ఆశలు పెట్టుకుంది.
ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు మీనాక్షి చేసిన పాత్రే గతంలో శ్రీలీలకు ఇచ్చారు. అప్పుడు అసలు హీరోయిన్ పూజా హెగ్డే. తర్వాత క్యాస్టింగ్ లో అనూహ్యమైన మార్పులు జరిగే ప్లేసులు అటుఇటు మారాయి. ఒకవేళ పూజా తప్పుకోక పోయి ఉంటే ఇప్పుడు మీనాక్షి మీద వచ్చే సింపతీ శ్రీలీల మీదకు వెళ్ళేది. సినిమా మొత్తం చూశాక పూర్తి క్లారిటీ వస్తుంది కానీ దానికింకా అయిదు రోజులు టైం ఉంది కాబట్టి అప్పటి దాకా వెయిట్ చేయాలి. ఇప్పటిదాకా త్రివిక్రమ్ తీసిన సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా నటించిన ఎవరికి మరీ ఎక్కువ పేరు రాలేదు. అఆలో అనుపమ పరమేశ్వరన్ ని కొంతమేర మినహాయించవచ్చు.
This post was last modified on January 8, 2024 2:40 pm
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…