అక్కినేని నాగార్జున కెరీర్ కొన్నేళ్లుగా ఒడుదొడుకులతో సాగుతోంది. 2016 లో వచ్చిన సోగ్గాడే చిన్నినాయన తర్వాత ఆయనకు నిఖార్సైన హిట్ లేదు. దేవదాస్, బంగార్రాజు లాంటి సినిమాలు పర్వాలేదు అనిపించాయి కానీ మిగతావన్నీ తీవ్ర నిరాశనే మిగిల్చాయి. నాగ్ నుంచి చివరగా వచ్చిన ఘోస్ట్ మూవీ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే. అక్కినేని వారి ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ అంతా హరించుకుపోయిన పరిస్థితి కనిపించింది. ఈ స్థితి నుంచి నాగ్ ఎలా పుంజుకుంటాడా అని అందరూ ఎదురు చూశారు. తన కొత్త సినిమా మొదలు పెట్టడంలో నాగ్ చాలా జాప్యం చేయడంతో ఆయన పరిస్థితి ఇంకా ఇబ్బందికరంగా మారింది.
ఈ అక్కినేని సీనియర్ హీరో బౌన్స్ బ్యాక్ కావడం ఇక అసాధ్యం అనుకున్నారు చాలామంది. కానీ ఈ సంక్రాంతికి రాబోతున్న నా సామి రంగకు అభిమానుల్లో ట్రేడ్ వర్గాల్లో, ఉన్న క్రేజ్ చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. పండుగ సినిమాల్లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ బిజినెస్ చేసిన చిత్రం ఇదే. పక్కాగా పండుగకు సూట్ అయ్యే సినిమాలా కనిపిస్తుండడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమా పట్ల బాగానే ఆసక్తి నెలకొంది. బయర్లు కూడా ఈ సినిమాను మంచి రేటుకి కొన్నట్లు సమాచారం.
కాస్త మంచి టాక్ రావాలి కానీ గుంటూరు కారం తర్వాత సంక్రాంతి సినిమాల్లో హైయెస్ట్ కలెక్షన్ రాబట్టే చిత్రం ఇదే అవుతుంది అని ట్రేడ్ పండిట్లో అంచనా వేస్తున్నారు. పట్టుబట్టి ఈ సంక్రాంతికి సినిమాని తీసుకొస్తున్న నాగ్ కచ్చితంగా హిట్టు కొడతాడు అని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on January 7, 2024 8:18 pm
గత ఏడాది సెప్టెంబర్ లో ఆంధ్రకింగ్ తాలూకా రిలీజైనప్పుడు పాజిటివ్ రివ్యూలు వెల్లువెత్తాయి. మౌత్ టాక్ కూడా బాగానే ఉంది.…
వేలంటైన్ప్ డే వీకెండ్లో మంచి అంచనాల మధ్య విడుదలైన చిత్రం.. ఫంకీ. యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న విశ్వక్సేన్ను హీరీగా…
ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు సైతం కోటి.. అంతకంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వచ్చేశాయి. ధరలు అంతగా…
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…