Movie News

చిరు, నాగ్, వెంకీ మల్టీస్టారర్.. ‘త్రివేణి సంగమం’

మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగులో మల్టీస్టారర్స్ చాలా తక్కువ. ఫ్యాన్స్ ఒప్పుకోరనే కారణంగా మరో హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి వెనుకాడుతుంటారు తెలుగు స్టార్లు. అయితే ఈ మధ్య మన హీరోలు కూడా మారుతున్నారు.

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మూవీ కోసం విక్టరీ వెంకటేశ్, సూపర్ స్టార్ మహేష్‌బాబు చేతులు కలిపితే… ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్, రామ్ చరణ్‌‌ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. అయితే వీటన్నింటికంటే ముందే ఓ భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేశారట శతాధిక చిత్రాల దర్శకుడు కె. రాఘవేంద్రరావు.

కెరీర్‌లో ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ అందుకున్న దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు… తన నూరో చిత్రంగా ఓ భారీ మల్టీస్టారర్ అనుకున్నారట. సీనియర్ స్టార్ త్రయం మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేశ్‌‌లు హీరోలుగా ఓ ప్రాజెక్ట్ ప్లాన్ చేశారట. దీనికి ‘త్రివేణి సంగమం’ అని టైటిల్ కూడా ఫిక్స్ చేశారట. అయితే ముగ్గురు స్టార్లను ఒకే స్క్రీన్ మీద చూపించాలని దర్శకేంద్రుడు చేసిన ఈ ప్రయత్నం వర్కవుట్ కాలేదు.

దాంతో అల్లుఅర్జున్‌ను హీరోగా పరిచయం చేస్తూ తన 100వ చిత్రంగా ‘గంగోత్రి’ని చేశారు రాఘవేంద్రుడు. టాప్ స్టార్లు చిరంజీవి, నాగ్, వెంకీ ఒకే సినిమాలో కనిపిస్తే… అది పెను సంచలనం క్రియేట్ చేసి ఉండేది.

ఆ టైమ్‌లో వారికున్న క్రేజ్‌కు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిసేది. టాలీవుడ్‌లో ప్రయోగాత్మక చిత్రాలు కూడా పెరిగేవి. అప్పట్లో వర్కవుట్ కాకపోయినా ‘త్రివేణి సంగమం’ స్క్రిప్ట్ మీద ఉన్న నమ్మకంతో ఎప్పటికైనా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కించాలనే గట్టి పట్టుదలతో ఉన్నారట రాఘవేంద్రరావు. అదీగాక ఇప్పుడు స్టార్లలతో పాటు ఫ్యాన్స్ ఆలోచనావిధానం కూడా మారింది. కంటెంట్‌‌ ఉంటే ప్రయోగాత్మక చిత్రాలను కూడా ఆదరిస్తున్నారు తెలుగు జనాలు. అందుకే ఈ మెగా, అక్కినేని, దగ్గుపాటి మల్టీస్టారర్‌ పర్ఫెక్ట్‌గా వర్కవుట్ అవుతుందనే ధీమాగా ఉన్నారు దర్శకేంద్రుడు.

ఇకపోతే ‘శ్రీరామదాసు’ తర్వాత సరైన సక్సెస్ అందుకోకపోయిన రాఘవేంద్రుడు… ‘ఓం నమో వెంకటేశాయ’ తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టలేదు. వీలైతే త్వరలో ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కించేందుకు దర్శకుడిగా మారిన తన తనయుడు ప్రకాశ్‌కు ‘త్రివేణి సంగమం’ బాధ్యతలు అప్పగించారని టాక్ వినిపిస్తోంది.

This post was last modified on April 26, 2020 1:46 pm

Share

Recent Posts

పోటీకి సిద్ధంకండి… పొత్తు సంగతి నేను చూసుకుంటాను

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…

40 minutes ago

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

1 hour ago

అప్పట్లో చిరు ఏడాదికి నాలుగు సినిమాలు చేసినా గొడవే

ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్‌ను పక్కన పెడితే.. అల్లు…

9 hours ago

దీపికా విషయంలో సందీప్ వంగానే కరెక్ట్

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…

10 hours ago

హృద‌య విదార‌కం… టీచ‌ర్ దెబ్బ‌కు ప్రాణం వ‌దిలిన పిల్లాడు

పిల్ల‌ల విష‌యంలో త‌ల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్య‌వ‌హ‌రించాలో చెప్పే ఉదంత‌మిది. విద్యార్థుల‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌లో పెట్టాల‌ని, వారిలో భ‌యం పెంచాల‌ని…

10 hours ago

యాక్సిడెంట్ కేసులో జనసేన ఎంపీ తనయుడు

హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…

11 hours ago